జగన్ పై నాన్-బెయిలబుల్ కేసులు నమోదు

    పులివెందుల: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త రహ్మతుల్లా కేసు విషయంలో నిన్న రాత్రి పులివెందుల పోలీసుస్టేషన్ ఎదుట ధర్నా చేసిన కడప ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహా 68మందిపై పోలీసులు నాన్-బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. వీరిపై 11 సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి.

    రహ్మతుల్లా అనే పార్టీ కార్యకర్తను పోలీసులు దూషించటంతో పాటు కొట్టడాన్ని నిరసిస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి 8.30 వరకు పులివెందుల పోలీసు స్టేషన్ ఎదుట బైఠాయించిన విషయం తెలిసిందే.

    చదవండి :  16 వ తేదీ నుండి 18 వరకు దొమ్మర నంద్యాలలో జ్యోతి ఉత్సవాలు

      వార్తా విభాగం

      ఇవీ చదవండి

      Leave a Reply

      Your email address will not be published. Required fields are marked *