కడప : పులివెందులలో అరటి పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సిధ్ధమయింది. ఏపీకార్ల్లో ఈ పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించి రెండు రోజుల్లో ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడనున్నాయి. సుమారు 50 ఎకరాల్లో దీనిని ఏర్పాటు చేయనున్నారు. డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఈ పరిశోధనా కేంద్రం పనిచేయనుంది. ఇక్కడ శాస్త్రవేత్తల ద్వారా అరటిలోని అన్నిరకాలపై పరిశోధనలు చేస్తారు. ఈ ప్రాంతంలో సాగుకు అనుకూలమైన రకం ఏది, తెగుళ్లను తట్టుకోవడంతో పాటు […]పూర్తి వివరాలు ...
Tags :pulivendula
పుస్తకం : పులివెందుల రంగనాథ స్వామి వారి చరిత్రము , రచన: లగిసెట్టి వెంకటరమణయ్య, ప్రచురణ : 1929లో ప్రచురితం. సౌజన్యం : బ్రిటీష్ లైబ్రరీ, లండన్పూర్తి వివరాలు ...
పులివెందుల గురించి చంద్రబాబు మళ్ళీ నోరు పారేసుకున్నారు. తునిలో అల్లరిమూకలు జరిపిన దాడులను పులివెందులకు, కడప జిల్లాకు ఆపాదించి ముఖ్యమంత్రిగిరీ వెలగబెడుతున్న చంద్రబాబు అవాకులు చెవాకులు ఎలా పేలుతున్నారో మీరే చూడండి.. పూర్తి వివరాలు ...
ప్రభుత్వానికి విపక్షనేత జగన్ విజ్ఞప్తి పులివెందుల: 247 కోట్ల రూపాయల నిధులూ, 650 ఎకరాల క్యాంపస్ కలిగిన పశుగణ పరిశోధనా కేంద్రాన్ని ఉపయోగంలోకి తీసుకువస్తే రైతులకు మేలు జరుగుతుందని, ఆ దిశగా చర్యలు చేపట్టాలని ప్రతిపక్ష నాయకుడు, వైకాపా అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గురువారం పులివెందులలోని అధునాతన పశుగణ పరిశోధనా కేంద్రాన్ని (ఐజీ కార్ల్) సందర్శించారు. ఆ తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ…. ”వ్యవసాయం గిట్టుబాటు కాని దుస్థితి ఉంది. పశుపోషణ […]పూర్తి వివరాలు ...
పట్టిసీమ ద్వారా రాయలసీమకు కృష్ణా జలాలను తీసుకురావడానికి సీఎం చంద్రబాబు మహాయజ్ఞం చేస్తుంటే, విపక్ష నేత జగన్ దీనికి అడ్డుపడుతున్నారని ఆరోపిస్తూ శాసనమండలి ఉపాధ్యక్షులు సతీష్కుమార్రెడ్డి (తెదేపా) ఆధ్వర్యంలో సోమవారం పులివెందుల పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి జిల్లాలోని తెదేపా నేతలంతా హాజరై పట్టిసీమకు అనుకూలంగా మాట్లాడటం విశేషంగా ఉంది. అనంతరం ర్యాలీనుద్దేశించి సతీష్రెడ్డి, తెదేపా నేతలు ప్రసంగించారు. వర్షాలు లేకపోవడంతో ఈ ప్రాంత రైతులు తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఎదుర్కొంటున్నారని, ఇటువంటి పరిస్థితి మున్ముందు […]పూర్తి వివరాలు ...
పులివెందుల: పట్టణంలో రూ.3 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కొత్త సీఎస్ఐ చర్చిని గురువారం రాయలసీమ బిషప్ బీడీ ప్రసాద్రావు, మోడరేటర్, మోస్టు రెవరెండ్ దైవ ఆశీర్వాదం తదితరులు ప్రారంభించారు. అంతకుముందు భక్తులు, వివిధ ప్రాంతాల చర్చిల ఫాదర్లు స్థానిక ఆర్అండ్బీ అతిధి గృహం సమీప నుంచి ర్యాలీగా చర్చికి చేరుకున్నారు. చర్చి ప్రాంగణమంతా భక్తులతో రద్దీగా మారింది. చర్చి ప్రారంభం సందర్భంగా ప్రత్యేక ప్రార్థన కూటమి నిర్వహించారు. బిషప్ బీడీ ప్రసాదరావు ప్రభువు సందేశాన్ని వినిపించారు. […]పూర్తి వివరాలు ...
పులివెందుల: పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల (మెయిన్), రమణప్ప సత్రం, మైదానాల్లో సోమవారం పన్నెండేళ్ళ లోపు బాలబాలికల (అండర్-12) అఖిల భారత ఛాంపియన్షిప్ టెన్నిస్ టోర్నీ ప్రారంభమైంది. అక్టోబర్ 3తేదీ వరకు జరిగనున్న ఈ పోటీలను ప్రముఖ చిన్నపిల్లల వైద్యుడు డాక్టర్ ఈ.సి.గంగిరెడ్డి ప్రారంభించారు. టోర్నీలో పాల్గొనేందుకు చెన్నై, బెంగళూరు, కొయంబత్తూరు, విశాఖపట్టణం, శివకాశి, హైదరాబాద్, కేరళ తదతర ప్రాంతాల నుంచి 50 మందికి పైగా క్రీడాకారులు తరలివచ్చారు. పారిశ్రామికవేత్త గంగాధర, స్వామి వివేకానంద పాఠశాల అధిపతి సోమశేఖర్రెడ్డి […]పూర్తి వివరాలు ...
కడప నగరపాలికతోపాటు, ఆరు పురపాలికల్లో పాలకవర్గాలు గురువారం కొలువు దీరాయి. జమ్మలమడుగులో మాత్రం ఓ కౌన్సిలర్ కనిపించకుండా పోవడంతో తెదేపా నేతలు వీరంగం చేశారు. దీంతో అక్కడ పాలకవర్గం ఎన్నికను ఈరోజుకు వాయిదా వేశారు. బద్వేలులో ఛైర్మన్గా తెదేపా కౌన్సిలర్ పార్థసారధిని ఎన్నుకోగా, వైస్ ఛైర్మన్ అభ్యర్థిపై స్పష్టత రాకపోవడంతో ఆ ఎన్నిక వాయిదా వేశారు. కడప నగరపాలికలోని మేయర్, డిప్యూటీ మేయర్, ఏడు పురపాలికల్లో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులకు గురువారం ఎన్నిక నిర్వహించారు. అన్ని చోట్లా […]పూర్తి వివరాలు ...
పులివెందులలో చోటా మోటా నాయకులు ఇళ్ళ ముందు చూడడానికి భయంకరంగా ఉండే మనుషులను పెట్టుకుని బాంబులు చుట్టిస్తూ.. కత్తులు పట్టుకుని తిరుగుతుంటారట – అంతే కాదండోయ్ పులివెందులలో కేవలం ఫ్యాక్షనిస్టులు, నేరస్తులు, రౌడీలు మాత్రమే ఉంటారుట – ఇదీ ‘జంపు జిలానీ’ అనే పేరుతో ఇటీవల విడుదలయిన ఒక సినిమాలో పైత్యం శ్రుతిమించి చూపించిన సన్నివేశం. అంతేనా సినిమాలో పలుచోట్ల పులివెందుల అనగానే అయ్యా బాబోయ్ అది ఫ్యాక్షనిస్టుల ఊరు నేను రాను అంటూ కథానాయకుడితో సంభాషణలు […]పూర్తి వివరాలు ...