ఎట్టకేలకు సిబిఐ ఊహాగానాలకు తెరదించింది. కొద్దిసేపటి క్రితం వైఎస్ జగన్ అరెస్టు చేసింది.ఈ మేరకు వైఎస్ జగన్ కుటుంబ సభ్యుల సిబిఐ సమాచారం అందించింది. రేపు జగన్ కోర్టుకు హాజరు కావాల్సిన నేపధ్యంలో విచారణ పేరుతొ సిబిఐ జగన్ను అదుపులోకి తీసుకుంది. నా అరెస్టుకు రంగం సిద్ధమైన్దంటూ జగన్ చేస్తున్న ఆరోపణలను నిజమయ్యాయి. జగన్ అరెస్టు సమాచారాన్ని ముందస్తుగా అందుకున్న ప్రభుత్వమూ, పోలీసు శాఖ నిముషాల వ్యవధిలో భారీగా పోలీసు బలగాలను మోహరించింది.పూర్తి వివరాలు ...
కడప: జిల్లాలో పలు చోట్ల అనధికారికంగా నిషేదాజ్క్షలను జారీ చేశారు. ఈ సాయంత్రం నుండి మైదుకూరు, బద్వేలు, కడప, పులివెందుల, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు సహా జిల్లా వ్యాప్తంగా భారీగా పోలీసుల మోహరించారు. కడప తిరుపతి మార్గంలో బస్సు సర్వీసులను కొద్ది సేపటి క్రితం నిలిపివేసినట్లు వార్తలు వెలుడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా అనేక గ్రామాలలో విద్యుత్తూ సరఫరాను ఆపివేశారు.పూర్తి వివరాలు ...
కడప : జిల్లాలో బస్సు సర్వీసులను నిలిపివేసినట్టు వార్తలు వెలువడుతున్నాయి. అలాగే కడప నుండి హైదరాబాద్ కు చేరుకునే బస్సులను రద్దు చేస్తున్నట్టు సమాచారం. పోలీసు అధికారుల ఆదేశాలతోనే ఆర్టీసీ బస్సులను రద్దు చేసినట్టు అధికారులు తెలిపారు. కడప పులివెందుల బస్సులను కూడా నిలిపెసినట్లు సమాచారం. ఇదంతా జగన్ అరెస్టు సమాచారం మేరకే జరుగుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే పోలీసుల అత్యుత్సాహం విమర్శలకు దారి తీస్తోంది.పూర్తి వివరాలు ...
జగన్ ప్రత్యర్ధులు కంటున్న ఈ కల నిజమైతే పరమపద సోపానంలో అది జగన్ కి నిచ్చెనేనని ప్రకాష్ తాడి విశ్లేషణ…. జయలలితని అరెస్ట్ చేస్తే ఒక ఇరవై మంది పెట్రోలు పోసుకు తగలబడిపోతారు. రాజశేఖరెడ్డి చనిపోతే కొన్ని వందల మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఆనాడు దేశంలో ఎన్నికలు ఒక దశ ముగిసి, రెండో దశ జరగడానికి ముందు రాజీవ్ గాంధీ చనిపోయారు. తొలిదశ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోతే, మలిదశ పోలింగ్లో తొంభైశాతం సీట్లు గెలుచుకుంది. భావోద్వేగమనే సెంటిమెంటే […]పూర్తి వివరాలు ...
జగన్ ప్రత్యర్ధులు కంటున్న ఈ కల నిజమైతే పరమపద సోపానంలో అది జగన్ కి నిచ్చెనేనని ప్రకాష్ తాడి విశ్లేషణ (పునః ప్రచురణ)…. ”వెళ్ళూ, వెళ్ళవయ్యా వెళ్ళు. కుర్రాడివి. తొందరేంటి? కాస్త అనుభవం సంపాదించు. చూద్దాం” అని జగన్మోహన్ రెడ్డిని ఈసడించి పంపేసిన కాంగ్రెస్ పార్టీయే ఇప్పుడా కుర్రాణ్ణి ముఖ్యమంత్రిని చేయడానికి సకల ఏర్పాట్లూ చేస్తోంది అదెలా? ముందు శంకర్రావుతో హైకోర్టుకో లెటర్ రాయించు. అతడు దళితుడై వుండటం చాలా ముఖ్యం. ముందుముందు వ్యవహారం బూమరాంగ్ అయితే […]పూర్తి వివరాలు ...
మాజీ మంత్రి, వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు, వై.ఎస్.వివేకానందరెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్బై చెప్పారు. కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు వైఎస్ను తిడుతుండటాన్ని జీర్జించుకోలేకే తానీ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ప్రకటించారు. తండ్రి వైఎస్ రాజారెడ్డి వర్థంతి సందర్భంగా పులివెందులలో కార్యకర్తల సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఇమడలేకపోతున్నాననీ, పార్టీ కోసం కుటుంబాన్ని దూరం చేసుకున్నా తనకు తగిన గౌరవం ఇవ్వలేదనీ అన్నారు.పూర్తి వివరాలు ...
యుపిఎ-2 ప్రభుత్వం మూడేళ్లు పూర్తి చేసుకున్న మరునాడే ‘పెట్రో మంట రూపంలో సామాన్యుడి నడ్డి విరిచేందుకు సిద్ధమైంది. పార్లమెంటు సమావేశాలు ముగియగానే ప్రజలపై పెను భారం మోపింది. గతంలో ఎన్నడూ లేని విధంగా లీటరుకు రు.6.28 వంతున పెంచు తున్నట్లు చమురు కంపెనీలు ప్రకటించాయి. వ్యాట్, ఇతర పన్నులు కలిపి ఆయా రాష్ట్రాల్లో రూ.7.50 నుండి రూ.8.50 వరకు పెరగనుంది. గత ఆరు నెలల్లో పెట్రో లు ధర పెంచడం ఇది రెండోసారి.పూర్తి వివరాలు ...
సిబిఐ స్తంభింపచేసిన సాక్షి మీడియా సంస్థల బ్యాంకు ఖాతాలను తెరవాలని హైకోర్టు బుధవారం మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. అయితే కొన్ని షరతులు విధిస్తూ ఈ సడలింపునిచ్చింది. సాక్షి పత్రిక, సాక్షి టీవీ ఛానల్కు సంబంధించిన బ్యాంకు ఖాతాలను డీఫ్రీజ్ చేస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి చంద్రకుమార్ బుధవారం వెకేషన్ కోర్టులో మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. ఈ బ్యాంకు ఖాతాలను స్తంభింపచేస్తూ ఇటీవల సిబిఐ ఉత్తర్వులిచ్చిన విషయం విదితమే.పూర్తి వివరాలు ...
ఎడ్లబండి కదిలింది. చెరువు కానుకొని ఉండే దట్టమైన చీకిచెట్ల నుంచి కీచురాళ్లు రొద చేస్తానే ఉండాయి ఆగకుండా! చుక్కలు లేని ఆకాశం చినుకులు కురిపించడానికి సిద్దమవుతున్నట్లుగా ఉంది. కందెన తక్కువై ఇరుసు చేస్తున్న శబ్దం… రాయి ఎక్కి దిగినపుడు చక్రం మీదున్న కమీ చేస్తున్న శబ్దం… ఎద్దుల గిట్టల శబ్దం… సుతారంగా కదిలే ఎద్దుల మెడలోని పట్టీల గజ్జల శబ్దాలు తప్ప ఇంకేమీ విన్పించటం లేదు. కుదుపు.. సన్నటి కుదుపు… అలాంటి కుదుపే మనసులోనూ… బండి రెడ్డిగారిండ్ల […]పూర్తి వివరాలు ...