వార్తా విభాగం

కవితలు

నాది నవసీమ గొంతుక (కవిత)

కరువు గడ్డ కాదిది కాబోయే పోరు బిడ్డ నెత్తుటి గుడ్డ కాదిది కాబోయే ఉద్యమ అడ్డా మౌనాంగీకారం కాదు రా….. బద్దలవబోయే సీమ నిశ్శబ్ద ఘీంకారం ఎర్ర చందనం నీ సొత్తు కాదిక అది నా సీమ అస్తిత్వం అది మొరటుతనం కాబోదిక మాది నిప్పంటి సీమ కరుకుతనం కూరలో కరేపాకు కాదిక పోరులో కుర్రాళ్ళ జజ్జనక బీడుకట్టు కాదిక గోసెగ్గట్టిన ముళ్ళగట్టె నవ్యాంధ్ర కాదిక నాది నవసీమ గొంతుక జై రాయలసీమ జై జై రాయలసీమ […]పూర్తి వివరాలు ...

రాయలసీమ వీడియోలు

మౌనమెంత సేపే రాయలసీమ గడ్డ మీద (వీడియో పాట)

అరుణోదయ (ACF) వారి సహకారంతో రాయలసీమ నిర్మాణ సమితి , రాయలసీమ కళాకారుల సమితిలు కలిసి రూపొందించిన దృశ్యరూప రాయలసీమ ఉద్యమ గీతమిది. ఈ రోజు youtube ద్వారా విడుదలైన ఈ పాట ఆకట్టుకొంటోంది… మీరూ ఒకసారి వీక్షించండి!!  పూర్తి వివరాలు ...

ప్రత్యేక వార్తలు

గండికోటలో తిరిగుతోంది చిరుతపులులే!

ఆడ చిరుత దొరికింది మగచిరుత కోసం మరో బోను ఏర్పాటు పులిని చంపితే ఏడేళ్ల జైలు శిక్షతో పాటు రూ. 25లక్షల జరిమానా గండికోట: కోట పరిసరాల్లో తిరుగుతూ గత కొద్దినెలలుగా జీవాలపై దాడి చేస్తోన్న క్రూరజంతువులు చిరుతపులులే అని తేలిపోయింది. గురువారం రాత్రి అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో చిరుతపులి ఒకటి చిక్కింది. దీన్ని ఒకటిన్నర సంవత్సరం వయస్సున్న ఆడ చిరుతగా గుర్తించారు. గ్రామస్థులు ఇచ్చిన సమాచారం మేరకు తిరుపతి, సిద్ధవటం, ముద్దనూరు ప్రాంతాల […]పూర్తి వివరాలు ...

రాజకీయాలు

కడప జిల్లా తెదేపా నేతలు నోరు మొదపరేం?

కడప: కడప జిల్లాపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వివక్ష చూపుతున్నాడని రాయచోటి శాసనసభ్యుడు శ్రీకాంత్‌రెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఆయన రాయచోటిలోని వైకాపా పార్టీ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ…. రాయలసీమలో రాజధానిని ఏర్పాటు చేస్తామని ప్రకటించి కోస్తా- ఆంధ్రలో ఏర్పాటు చేయడం దారుణమన్నారు. కడప జిల్లాకు రావాల్సిన డీఆర్‌డీవో పరిశోధనా కేంద్రాన్ని ముఖ్యమంత్రి తన సొంత జిల్లాకు కేటాయించుకోవడం అన్యాయమన్నారు. దీనిపై తెదేపా జిల్లా నేతలు కూడా నోరు మొదపలేదన్నారు. కడపలో విమానాశ్రయం పూర్తయినా ఇంత వరకు ప్రారంభించలేదన్నారు. […]పూర్తి వివరాలు ...

జానపద గీతాలు

డొక్కల కరువును తెలిపే జానపదగీతం

1876-78 సంవత్సరాలలో వచ్చిన కరువును ‘దాతు కరువు’ లేదా ‘డొక్కల కరువు’ లేదా ‘పెద్ద కరువు’ లేదా ‘ముష్టి కరువు’ గా వ్యవహరిస్తారు. తెలుగు సంవత్సరమైన ‘దాత’ లో వచ్చినందున ఈ కరువును ‘దాతు కరువు’ అని వ్యవరించేవారు.  కరువు ఎంత తీవ్రంగా వచ్చిందంటే జనాలకు తినడానికి ఎక్కడా తిండి దొరక్క బాగా కడుపు మాడ్చుకునేవాళ్ళు. దాంతో సన్నబడి, శరీరంలో కండమొత్తం పోయి ఎముకలు మాత్రమే కనపడేవి. ఇలా అందరికీ డొక్కలు(ఎముకల గూళ్ళు) మాత్రమే కనపడటం వలన […]పూర్తి వివరాలు ...

ఆచార వ్యవహారాలు వార్తలు

రేపూ…మన్నాడు ఆస్థానే మురాదియాలో ఉరుసు ఉత్సవాలు

కడప: స్థానిక వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ దగ్గర గల హజరత్‌ ఖ్వాజా సయ్యద్‌షామొహర్‌ అలీ (మొరి సయ్యద్‌సాహెబ్‌ వలి) 417వ ఉరుసు ఉత్సవాలు ఈనెల 20, 21వ తేదీల్లో వైభవంగా జరగనున్నాయి. ఆస్థానే మురాదియా దర్గా పీఠాధిపతి సయ్యద్‌షా ఆధ్వర్యంలో 20వ తేదీ శనివారం గంథం ఉత్సవాలు నిర్వహిస్తారు. అదేరోజు సాయంత్రం ముగరిబ్‌ నమాజ్‌ తరువాత పీఠాధిపతి ఇంటి నుంచి ఫకీర్ల మేళతాళాలతో దర్గా చేరుకొని గంథాన్ని సమర్పించనున్నారు. 21వ తేదీ ఆదివారం రాత్రి 9.30 గంటలకు ఖవ్వాలి […]పూర్తి వివరాలు ...

వార్తలు

‘సీమకు ప్రత్యేక హోదా కల్పించాల’:రామానాయుడు

రైల్వేకోడూరు : రాయలసీమకు ప్రత్యేక హోదా కల్పించాలని, ప్రత్యేకప్యాకేజి కేటాయించాల ని, లక్షమందికి ఉపాధికల్పించే ఉక్కుపరిశ్రమ ను కడపలో నిర్మించాలని రాష్ట్ర సీసీఐ కార్యవర్గసభ్యులు రామానాయుడు డిమాండ్‌ చేశారు. గురువారం స్థానిక పిఎస్‌ఆర్‌ కళ్యాణమండపంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశం లో ఆయన మాట్లాడుతూ సెయిల్‌ ఆధ్వర్యం లో ఉక్కుపరిశ్రమను స్థాపించాలన్నారు. తెలుగుగంగకు 29టిఎంసిలు, హంద్రీనీవాకు 40 టిఎంసిలు, గాలేరు-నగిరికి 38టిఎంసిలు, వెలి గొండ ప్రాజెక్టులకు 43.5 టిఎంసిల నికరజలాలను కేటాయించాలన్నారు. తగినన్ని నిధులు మంజూరుచేసి ఆయా […]పూర్తి వివరాలు ...

వార్తలు

ఎస్సైలుగా ఎంపికైనోళ్ళు రేపు కర్నూలుకు పోవాల

ఎస్సై(సివిల్) ఉద్యోగాలకు ఎంపికైన రాయలసీమ జోన్ అభ్యర్థులు ఈనెల 19న కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలోని కె.ఎస్.వ్యాస్ ఆడిటోరియంలో హాజరుకావాలని కర్నూలు రేంజ్ డీఐజీ మురళీక్రిష్ణ బుధవారం రాత్రి విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు ఈనెల 21 నుంచి హైదరాబాద్‌లోని ఏపీ పోలీసు అకాడమీలో శిక్షణ ప్రారంభమవుతుందన్నారు. సబ్-ఇన్‌స్పెక్టర్ మెస్ అప్పా, హైదరాబాద్ పేరిట తీసిన రూ.12వేలు డీడీ, వంద రూపాయల ఖాళీ బాండ్ పేపరు, 8 పాస్‌పోర్టు సైజ్ ఫొటోలు తీసుకుని […]పూర్తి వివరాలు ...

వార్తలు

‘తెదేపా నేతపై చర్య తీసుకోవాలి’

యోగివేమన విశ్వవిద్యాలయంలోని పరీక్షల నియంత్రణా విభాగంలో పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ బి. లక్ష్మీప్రసాద్‌ను ఫోన్‌లో దూషించిన తెదేపా నేత గోవర్ధన్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని యోవేవి అధ్యాపకులు పట్టుపట్టారు. బుధవారం ఉపకులపతి ఛాంబర్‌కు అధ్యాపక సిబ్బంది యావత్తు కదలి వచ్చి తమతోటి సహాయ ఆచార్యునికి బాసటగా నిలిచారు. దుర్భాషలాడిన టీడీపీ నాయకుడిపై చర్యలు తీసుకోవాలని కోరారు. నరుకుతా.. అంటూ ఫోన్‌లో దుర్భాషలాడినందుకు క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరారు. లేనిపక్షంలో ఆందోళనబాట తప్పదని హెచ్చరించారు. వెంటనే చర్యలు తీసుకోవాలని […]పూర్తి వివరాలు ...

error: