వార్తా విభాగం

వార్తలు

1953 నుంచీ నష్టపోతున్నది సీమవాసులే

తిరుపతి : శ్రీబాగ్ ఒడంబడిక మేరకు రాయలసీమలో రాజధాని ఏర్పా టు చేయడం ప్రభుత్వాల విధి అని దీనిని విస్మరిస్తే ప్రజా ఉద్యమం తప్పదని పలువురు మేధావులు హెచ్చరించారు. ‘రాయలసీమలోనే రాజధాని’ అనే అంశంపై రాయలసీమ అధ్యయన సంస్థల అధ్యక్షుడు భూమన్ ఆధ్వర్యంలో తిరుపతిలోని గీతం స్కూల్లో ఆదివారం చర్చాగోష్టి నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి మాట్లాడుతూ 1953 నుంచి రాజధాని విషయంలో తీవ్రంగా నష్టపోతున్నది సీమవాసులేనన్నారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోవడం మొదలు […]పూర్తి వివరాలు ...

రాజకీయాలు

జమ్మలమడుగు పురపాలిక పీఠం వైకాపాదే

జమ్మలమడుగు మున్సిపల్ చైర్ పర్సన్ గా తులశమ్మ(వైకాపా), వైస్‌ ఛైర్మన్‌గా ముల్లా జానీ (తెదేపా)ఎన్నికయ్యారు.  జమ్మలమడుగు మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక ఎట్టకేలకు ప్రశాంతంగా ముగిసింది. తెదేపా, వైకాపా అభ్యర్థులకు సమానంగా ఓట్లు రావడంతో లాటరీ ద్వారా ఛైర్మన్, వైస్ ఛైర్మన్‌లను ఎంపిక చేశారు. తెదేపా వాళ్ళు ప్రత్యక్ష ఎన్నికలలో అధిక స్థానాలు పొందినప్పటికీ లాటరీలో చైర్ పర్సన్,  పదవి వైకాపాకు దక్కడం విశేషంగా ఉంది. మే నెలలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ 9 […]పూర్తి వివరాలు ...

రాజకీయాలు

జమ్మలమడుగులో జానీ ఓటేస్తాడా?

వాయిదా పడిన జమ్మలమడుగు మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక ఆదివారం నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మరోవైపు జమ్మలమడుగు మున్సిపల్ ఛైర్మన్, వైస్‌ఛైర్మన్ ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. ఈ ఎన్నిక ఏక్షణాన ఏ మలుపు తిరుగుతుందోనని ప్రతి ఒక్కరూఆసక్తిగా గమనిస్తున్నారు. మే నెలలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ 9 స్థానాల్లో, టీడీపీ 11స్థానాల్లో విజయం సాధించింది. అయితే స్థానిక శాసనసభ్యుడు ఆదినారాయణరెడ్డి, ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిలు ఎక్స్ అఫిషియో సభ్యులుగా […]పూర్తి వివరాలు ...

రాజకీయాలు

విపక్షనేత ఇంట్లో పోలీసు సోదాలు

ఎలాంటి వారంటూ లేకుండా వైకాపా అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి గెస్ట్‌హౌస్‌లో శనివారం నెల్లూరు జిల్లాకు చెందిన పోలీసులు సోదా చేశారు. పోలీసులు అలా సోదాలు చేసింది ఆ పార్టీ జెడ్పీటీసీల కోసమట!! తమ వారు కిడ్నాపైనట్టు నెల్లూరు జిల్లాకు చెందిన ఇద్దరు జెడ్పీటీసీల తరఫున ఫిర్యాదు దాఖలైందని, అందుకోసమే ఇడుపుల పాయలో వెదికామన్నది పోలీసుల వివరణ.  ఈ నెల 5న తెదేపా వారి రభస కారణంగా నెల్లూరు జడ్పీ చైర్మన్ ఎన్నిక వాయిదా పడిన నేపధ్యంలో 8 నుంచీ […]పూర్తి వివరాలు ...

జానపద గీతాలు

సీతా కళ్యాణం – హరికథ

ఆకాశవాణి కడప కేంద్రం ద్వారా ప్రసారమైన సీతాకల్యాణం హరికథ కడప.ఇన్ఫో వీక్షకుల కోసం…. గానం చేసినవారు : శ్రీ రాజయ్య శర్మ భాగవతార్ గారు క్రింద ప్లే బటన్ నొక్కడం ద్వారా హరికథ వినవచ్చును. గమనిక : ఈ కథను వినుట ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ లో కొన్నిసార్లు సాధ్యపడక పోవచ్చు. మీరు ఒకవేళ ఫైర్ ఫాక్స్ వినియోగిస్తున్నట్లయితే దయచేసి గూగుల్ క్రోం లేదా ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ లో ఈ పుటను తెరవండి.  పూర్తి వివరాలు ...

అభిప్రాయం చరిత్ర

శ్రీభాగ్ ఒప్పందం లేదా ఒడంబడిక

శ్రీభాగ్ ఒప్పందం నేపధ్యం మరియు అందులోని అంశాలు మద్రాసు ప్రెసిడెన్సీలో భాగంగా వున్న తెలుగు వారు ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం 1913 లో ఆంధ్రమహాసభను ఏర్పాటు చేసుకున్నారు, ఉద్యమించారు. రాయలసీమ వారికి సర్కార్‌ జిల్లాల వాళ్ళు భాషా సంస్కృతుల పరంగా తమను తక్కువ చూస్తున్నారనే అనుమానం ఉండేది. ఇందుకు ఒక ఉదాహరణ  1927లో జనమంచి శేషేంద్ర శర్మ గారు రాసిన ‘కడప మండల చరిత్రము’ అనే పుస్తకములో కూడా చూడవచ్చు. పాపం శర్మ గారు కడప జిల్లాలో […]పూర్తి వివరాలు ...

అభిప్రాయం

‘రాయలసీమవారి అభిప్రాయానికి ఇప్పటికైనా కట్టుబడాలి’ – ఎబికె ప్రసాద్

స్వార్థ ప్రయోజనాలతో, అధికార దాహంతో తెలుగుజాతిని చీల్చిన ప్రధాన రాజకీయ పార్టీల నేతలు చేతులు కాలాక ఆకులు పట్టుకున్నారు. ఇప్పుడు రాజధాని కోసం ప్రజల ప్రయోజనాలు గాలికి వదిలి కోట్లకు పడగలెత్తిన రియల్‌ఎస్టేట్ వ్యాపారులకూ, వారి ప్రయోజనాలను కాపాడే అవినీతి రాజకీయ బేహారుల కోసం గాలింపులు సాగిస్తున్నారు. అశాతవాహన, కాకతీయ, రాయల విజయనగర యుగాలు తెలుగుజాతి సమైక్యతకూ, శతాబ్దాల తరబడి భాషా, సాంస్కృతిక వైభవ ప్రాభవాలకూ మూలవిరాట్టులుగా, కొండగుర్తులుగా నిలిచాయి. ఆనాటి సామంతరాజులైన మండల పాలకుల స్థానిక […]పూర్తి వివరాలు ...

రాజకీయాలు

మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై హైకోర్టు ఆదేశం

హైకోర్టు ఆదేశాలతో జమ్మలమడుగు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక మళ్ళీ ఉత్సుకతను పెంచేలా ఉంది. ఈ నెల 4న జరిగిన ఓటింగ్ కు ఇష్టపూర్వకంగానే గైర్హాజరైన జానీ ఓటును పరిగణలోకి తీసుకోరాదని ఆదివారం (13వ తేదీన) చైర్మన్ ఎన్నికను నిర్వహిస్తూనే , ఎన్నికల వివరాలను కోర్టు ముందు ఉంచాలని ఆదేశించినట్లు సమాచారం. అంతేకాకుండా కోరం ఉన్నప్పటికీ ఎన్నికలను వాయిదా వేసిన ఆర్డీఓపై చర్యలు ఎందుకు తీసుకోలేదని హైకోర్టు ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. జమ్మలమడుగు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా వేయడంపై […]పూర్తి వివరాలు ...

చరిత్ర

కడప జిల్లా శాసనాలు 3

భారతదేశంలోనే ఏకైక శాసనం… నీటి పారుదల సౌకర్యాలను గురించి తెలుపుతున్న శాసనాల్లో కూడా కడప జిల్లాకు ప్రత్యేక స్థానముంది. బుక్కరాయల కుమారుడు, ఉదయగిరి రాజ్యపాలకుడు భవదూరమహీపతి (భాస్కరరాయలు) క్రీ.శ. 1369లో పోరుమామిళ్లలో అనంతరాజసాగరమనే తటాకాన్ని నిర్మించి ఆ సందర్భంలో ఒక శాసనాన్ని వేయించాడు. చెరువుకట్ట మీద రెండు బండలపై చెక్కబడి ఉన్న ఈ శాసనం మధ్యయుగాల్లోని తటాక నిర్మాణ కౌశలానికి ప్రబల సాక్ష్యంగా దర్శనమిస్తుంది. తటాక నిర్మాణానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఈ శాసనంలో ప్రస్తావించబడ్డాయి. […]పూర్తి వివరాలు ...

error: