వార్తా విభాగం

అభిప్రాయం

కాంగ్రెస్‌ సమర్పించు.. హైప్‌ మీడియా డ్రీమ్‌ ప్రొడక్షన్స్‌.. జైల్లో జగన్‌ – 2

జగన్ ప్రత్యర్ధులు కంటున్న ఈ కల నిజమైతే పరమపద సోపానంలో అది జగన్ కి నిచ్చెనేనని ప్రకాష్ తాడి  విశ్లేషణ…. జయలలితని అరెస్ట్‌ చేస్తే ఒక ఇరవై మంది పెట్రోలు పోసుకు తగలబడిపోతారు. రాజశేఖరెడ్డి చనిపోతే కొన్ని వందల మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఆనాడు దేశంలో ఎన్నికలు ఒక దశ ముగిసి, రెండో దశ జరగడానికి ముందు రాజీవ్‌ గాంధీ చనిపోయారు. తొలిదశ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘోరంగా ఓడిపోతే, మలిదశ పోలింగ్‌లో తొంభైశాతం సీట్లు గెలుచుకుంది. భావోద్వేగమనే సెంటిమెంటే […]పూర్తి వివరాలు ...

అభిప్రాయం

కాంగ్రెస్‌ సమర్పించు.. హైప్‌ మీడియా డ్రీమ్‌ ప్రొడక్షన్స్‌.. జైల్లో జగన్‌ -1

జగన్ ప్రత్యర్ధులు కంటున్న ఈ కల నిజమైతే పరమపద సోపానంలో అది జగన్ కి నిచ్చెనేనని ప్రకాష్ తాడి  విశ్లేషణ (పునః ప్రచురణ)…. ”వెళ్ళూ, వెళ్ళవయ్యా వెళ్ళు. కుర్రాడివి. తొందరేంటి? కాస్త అనుభవం సంపాదించు. చూద్దాం” అని జగన్‌మోహన్‌ రెడ్డిని ఈసడించి పంపేసిన కాంగ్రెస్‌ పార్టీయే ఇప్పుడా కుర్రాణ్ణి ముఖ్యమంత్రిని చేయడానికి సకల ఏర్పాట్లూ చేస్తోంది అదెలా? ముందు శంకర్రావుతో హైకోర్టుకో లెటర్‌ రాయించు. అతడు దళితుడై వుండటం చాలా ముఖ్యం. ముందుముందు వ్యవహారం బూమరాంగ్‌ అయితే […]పూర్తి వివరాలు ...

వార్తలు

కాంగ్రెస్‌ పార్టీలో ఇమడలేకపోతున్నా…

మాజీ మంత్రి,  వైఎస్‌ రాజశేఖరరెడ్డి సోదరుడు, వై.ఎస్‌.వివేకానందరెడ్డి కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌బై చెప్పారు. కొద్ది రోజులుగా కాంగ్రెస్‌ పార్టీకి చెందిన నాయకులు వైఎస్‌ను తిడుతుండటాన్ని జీర్జించుకోలేకే తానీ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ప్రకటించారు. తండ్రి వైఎస్‌ రాజారెడ్డి వర్థంతి సందర్భంగా పులివెందులలో కార్యకర్తల సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీలో ఇమడలేకపోతున్నాననీ, పార్టీ కోసం కుటుంబాన్ని దూరం చేసుకున్నా తనకు తగిన గౌరవం ఇవ్వలేదనీ అన్నారు.పూర్తి వివరాలు ...

వార్తలు

పెట్రో మోత

యుపిఎ-2 ప్రభుత్వం మూడేళ్లు పూర్తి చేసుకున్న మరునాడే ‘పెట్రో మంట రూపంలో సామాన్యుడి నడ్డి విరిచేందుకు సిద్ధమైంది. పార్లమెంటు సమావేశాలు ముగియగానే ప్రజలపై పెను భారం మోపింది. గతంలో ఎన్నడూ లేని విధంగా లీటరుకు రు.6.28 వంతున పెంచు తున్నట్లు చమురు కంపెనీలు ప్రకటించాయి. వ్యాట్‌, ఇతర పన్నులు కలిపి ఆయా రాష్ట్రాల్లో రూ.7.50 నుండి రూ.8.50 వరకు పెరగనుంది. గత ఆరు నెలల్లో పెట్రో లు ధర పెంచడం ఇది రెండోసారి.పూర్తి వివరాలు ...

వార్తలు

‘సాక్షి’ బ్యాంకు ఖాతాలు తెరవండి

సిబిఐ స్తంభింపచేసిన సాక్షి మీడియా సంస్థల బ్యాంకు ఖాతాలను తెరవాలని హైకోర్టు బుధవారం మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. అయితే కొన్ని షరతులు విధిస్తూ ఈ సడలింపునిచ్చింది. సాక్షి పత్రిక, సాక్షి టీవీ ఛానల్‌కు సంబంధించిన బ్యాంకు ఖాతాలను డీఫ్రీజ్‌ చేస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బి చంద్రకుమార్‌ బుధవారం వెకేషన్‌ కోర్టులో మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. ఈ బ్యాంకు ఖాతాలను స్తంభింపచేస్తూ ఇటీవల సిబిఐ ఉత్తర్వులిచ్చిన విషయం విదితమే.పూర్తి వివరాలు ...

కథలు

తరం-అంతరం (కథ) – చెన్నా రామమూర్తి

ఎడ్లబండి కదిలింది. చెరువు కానుకొని ఉండే దట్టమైన చీకిచెట్ల నుంచి కీచురాళ్లు రొద చేస్తానే ఉండాయి ఆగకుండా! చుక్కలు లేని ఆకాశం చినుకులు కురిపించడానికి సిద్దమవుతున్నట్లుగా ఉంది. కందెన తక్కువై ఇరుసు చేస్తున్న శబ్దం… రాయి ఎక్కి దిగినపుడు చక్రం మీదున్న కమీ చేస్తున్న శబ్దం… ఎద్దుల గిట్టల శబ్దం… సుతారంగా కదిలే ఎద్దుల మెడలోని పట్టీల గజ్జల శబ్దాలు తప్ప ఇంకేమీ విన్పించటం లేదు. కుదుపు.. సన్నటి కుదుపు… అలాంటి కుదుపే మనసులోనూ… బండి రెడ్డిగారిండ్ల […]పూర్తి వివరాలు ...

వార్తలు

ముఖ్యమంత్రి కిరణ్ చెప్పిన రహస్యం!

ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా కడప జిల్లాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ ఆసక్తికరమైన విషయం చెప్పారు. తన తండ్రి అమరనాధరెడ్డి రాజకీయాలలో వై.ఎస్. రాజశేఖరరెడ్డి కన్నా సీనియర్ అని , వై.ఎస్.తండ్రి రాజారెడ్డి ఒకసారి జైలులో ఉంటే అమరనాధరెడ్డి విడిపించారని కిరణ్ చెప్పడం విశేషం.ఉపఎన్నికల ప్రచారంలో ఈ విషయం చెప్పడం ద్వారా కిరణ్ వైఎస్ కుటుంబం కంటే తమ కుటుంబం గొప్ప అని చెప్పదలుచుకున్నారా! లేక వ్యూహాత్మకంగా వైఎస్ కుటుంబానికి నేరచరిత్ర ఉందని చెప్పదలుచుకున్నారా!పూర్తి వివరాలు ...

ప్రత్యేక వార్తలు

కడప జిల్లాలో 15 చిరుతపులులు…

ప్రొద్దుటూరు అటవీశాఖ డివిజన్‌ పరిధిలో ఏడు చోట్ల చిరుతపులి పాదాల గుర్తులను సేకరించినట్లు అటవీశాఖాధికారులు పేర్కొన్నారు. ప్రొద్దుటూరు రేంజిలో 10,264.07 హెక్టార్లు, బద్వేలు రేంజిలో 9,786 హెక్టార్లలో లంకమల అభయారణ్యం విస్తరించి ఉంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈనెల 2-8 వరకు లంకమలలో వన్యప్రాణులు, వన్యమృగాల సంచారం, సంతతిపై అటవీశాఖాధికారులు క్ష్రేతస్థాయిలో సర్వే చేశారు. బద్వేలు రేంజి పరిధిలోని బాలాయపల్లె బీటులో సాకుడుచెల ప్రాంతంలో నాలుగు చిరుతలు సంచరించినట్లు గుర్తించారు. అదేవిధంగా బట్టమానుచెల, ముల్లెద్దుచెల ప్రాంతాల్లో వీటి […]పూర్తి వివరాలు ...

వార్తలు

ఈనాడు, ఆంధ్రజ్యోతి, టివి9 రాసేవి, చూపేవే వార్తలా? – జగన్

అనంతపురం: ఏదో ఒక రోజు సిబిఐ ఇలా చేస్తుందని ముందే ఊహించామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి అన్నారు. రాయదుర్గం నియోజకవర్గంలో ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆయన మాట్లాడుతూ సాక్షికి సంబంధించిన సంస్థల బ్యాంకు ఖాతాలను నిలిపివేయడాన్ని ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనన్నారు. ఇటువంటి అప్రజాస్వామిక చర్యలతో సాక్షి మీడియాను నిరోధించలేరన్నారు.పూర్తి వివరాలు ...