శ్రీశైలం డ్యామ్కనీస నీటిమట్టం విషయంలో ప్రభుత్వంస్పందించకపోతే ఉద్యమ బాట తప్పదని శాసనసభ్యులు, రైతు, ప్రజా సంఘాలనేతలు మూకుమ్మడిగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సీమరైతు కోసరమని వారంతా ఆందోళన పథాన్ని ఎంచుకున్నారు. కర్నూలు: రాయలసీమ హక్కుల సాధన కోసం వైకాపా శాసనసభ్యుడు భూమా నాగిరెడ్డి ఆధ్వర్యంలో గురువారం (ఈ నెల ఏడున) శ్రీశైలం డ్యామ్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నల్లమల అడవిలోని శ్రీశైలం డ్యామ్పరిసర ప్రాంతాలు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో దద్దరిల్లాయి. కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలకు చెందిన […]పూర్తి వివరాలు ...
కడప జిల్లా మైదుకూరు మండలం ఎల్లంపల్లె సమీపంలోని గగ్గితిప్ప వద్ద పురాతన శాసనాలు, రాతి శిల్పాలు బయటపడినాయి. యెల్లంపల్లె గ్రామానికి చెందిన గవిరెడ్డి నాగ ప్రసాద రెడ్డి,మూలే శంకర రెడ్డి పొలాల వద్దగల భైరవుని బావివద్ద ఈ శాసనాలు,శిల్పాలు ఉన్నట్లు తెలుగు భాషోద్యమ సమాఖ్య రాయలసీమ ప్రాంత కార్యదర్శి , కథా రచయిత తవ్వా ఓబుల్ రెడ్డి, సమాఖ్య మైదుకూరు శాఖ అధ్యక్షుడు అరబోలు వీరాస్వామి గ్రామస్తుల ద్వారా సమాచారం అందుకుని ఈవిషయాన్ని రాష్ట్ర పురావస్తు శాఖ […]పూర్తి వివరాలు ...
ప్రొద్దుటూరు: రాష్ట్ర విభజనానంతరం కడప జిల్లా అభివృద్ధి పట్ల ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తోందని జవివే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తవ్వా సురేష్ రెడ్డి, పట్టణాధ్యక్షుడు రమణయ్య శుక్రవారం డిప్యూటీ తహశీల్దార్ మహబూబ్బాషాకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి ప్రభుత్వంపై వత్తిడి తేవాలని పిలుపునిచ్చారు. శివరామకృష్ణన్ కమిటీ జిల్లాను ఇంకా సందర్శించలేదన్నారు. ప్రభుత్వం కేంద్ర విద్యా సంస్థ ను ప్రకటించలేదని, రైల్వే బడ్జెట్లో జిల్లాకు ఎలాంటి ప్రయోజనం జరగలేదని పేర్కొన్నారు. […]పూర్తి వివరాలు ...
కోడి పిల్లో… అబ్బో కోడి పిల్లా.. ఆ మాటలంటదే కోడిపిల్ల ఆ.. మాటలంటదే ఆ..లాగనంటదే ఆ..మైన అంటదే ఆ.. లయ్యబడ్తదే కోడిపిల్ల! కోయ్యీ కోయంగానే…కోడి కూత మానేసి కైలాసం నేనూ పోయినానంటదే ఆ మాటలంటదే కోడిపిల్ల!! దిబ్బమీదికొంచబోయి … బొచ్చు గిచ్చు ఈకుతాంటే (౩) అహా.. సిలంకూరి సిన్నప్ప.. శవరం సేసినానంటదే (2) ఆ మాటలంటదే ఆ..లాగనంటదే ఆ మైన అంటదే ఆ లయబడ్తదే కోడిపిల్ల! కోయ్యీ కోయంగానే…కోడి కూత మానేసి కైలాసం నేనూ పోయినానంటదే ఆ […]పూర్తి వివరాలు ...
శ్రీశైలం ప్రాజెక్ట్లో నీరు 854 అడుగుల వరకు నిండినా రాయలసీమకు నీటిని విడుదల చేయకపోవడం అన్యాయమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్రెడ్డి, అంజాద్ బాషా విమర్శించారు. రాయలసీమ ప్రాజెక్ట్లకు నీటి విడుదల చేసిన తర్వాతే కిందికి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతు రుణాలను రీషెడ్యూల్ చేయడానికి ఆర్బీఐ, ఇతర బ్యాంక్లు కుదరదన్నా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. రాబోయే రోజుల్లో ప్రజలే ఆయనకు బుద్ధి చెబుతారని ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్రెడ్డి, […]పూర్తి వివరాలు ...
ఎత్తేత్తు… ఎత్తూ.. ఎత్తు.. ఎత్తులపై గళమెత్తు జిత్తులపై కలమెత్తు పిడికిల్లే విచ్చు కత్తు ఎత్తూ..ఎత్తూ… ఎత్తూ..ఎత్తూ.. ఎత్తేత్తు…..ఎత్తేత్తు…..ఎత్తేత్తు….. రావాల్చిన రాజధాని.. రాకుండా పాయరా వచ్చాయన్న సాగునీరు మనది కాదు సోదరా నిధులు లేని గడ్డరా నిరుద్యోగ బిడ్డరా ఎత్తేత్తు… ఎత్తూ.. ఎత్తు.. ఎత్తేత్తు… ఎత్తూ.. ఎత్తు.. నవ్యాంధ్ర ముసుగులో రాయలసీమ బుగ్గిరా వదిలావా పగ్గాలు ఎద్దు నీది కాదురా సేద్యం సెయ్యలేవురా సేను బీడు ఆయరా బతుకు మోయలేవురా.. ఓ అమ్మా ఓ అక్కా ఓ నాన్నా […]పూర్తి వివరాలు ...
వాళ్లంతా బడికి పోయే పిల్లోళ్ళు … కాలేజీకి పోయే యువతరం… అందరూ ఒక్కటై, ఒకే గొంతుకై వినిపించినారు రాయలసీమ ఉద్యమ నినాదం. ఆ నినాదం వెనుక దగాపడిన బాధ, పైకి లేవాలన్న తపన… అందుకు పోరు బాట పట్టేందుకు సిద్ధమన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పోరుగిత్తలు ఇచ్చిన ఈ పిలుపు మహోద్యమమై సీమ పాలిటి సైంధవులకు శరాఘాతమయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. రాయలసీమపై రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ సోమవారం రాయలసీమ స్టూడెంట్స్ యూనియన్ […]పూర్తి వివరాలు ...
శ్రీభాగ్ ఒప్పందం మేరకు సీమలో రాజధానిని ఏర్పాటు చేయాలనే డిమాండుతో సోమవారం విద్యాసంస్థల బంద్కు పిలుపునిచ్చనట్లు రాయలసీమ విద్యార్థి సమాఖ్య ప్రతినిధులు తెలిపారు. బంద్కు సంబంధించిన కరపత్రాలను ఆదివారం సమాఖ్య కోకన్వీనరు దస్తగిరి, నాగార్జున యోగివేమన విశ్వవిద్యాలయంలో విడుదల చేశారు. ఆర్ఎస్ఎఫ్ బంద్కు పిలుపునివ్వడం వెనక ప్రధాన ఉద్దేశం రాజధాని లేకపోతే రాయలసీమకు జరిగే నష్టం వివరించే అన్నీ విషయాలు అందులో పొందుపరిచారు. బంద్కు విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యాసంస్థల ప్రతినిధులు పాల్గొనాలని వారు కోరారు.పూర్తి వివరాలు ...
“నాయినా, నాయినా” అని పరిగెత్తుకుంటా వొచ్చె మా పిల్ల నాకొడుకు నిన్న తెల్లార్తో జలదాట్లో నీల్లు పోసుకుంటాంటే. “ఏంటికిరా అట్ల గస పోసుకుంటావొస్తివి ?” అనడిగితి సబ్బుతో వొల్లు రుద్దుకుంటా. “నీ సెల్లు పోను మోగుతాంది, అది చెప్తామనే వొస్తి ” అని చెప్పె. “సరేపా, వస్తాండాగనీ” అంటి చెంబుతో నీల్లు మింద కుమ్మరిచ్చుకుంటా. “ఇబ్బుడికి రొండుతూర్లు మోగిండాది” అనె వాడు ఆట్నించీ ఎల్లబారకుండానే. “అట్లనా , ఎవురు చేసినారో చూస్తివ్యా”? అనడిగితి. “ఆ, చూసినా, ‘ […]పూర్తి వివరాలు ...