వార్తా విభాగం

వార్తలు

ప్రొద్దుటూరులో కదం తొక్కిన విద్యార్థులు

వాళ్లంతా బడికి పోయే పిల్లోళ్ళు … కాలేజీకి పోయే యువతరం… అందరూ ఒక్కటై, ఒకే గొంతుకై వినిపించినారు రాయలసీమ ఉద్యమ నినాదం. ఆ నినాదం వెనుక దగాపడిన బాధ, పైకి లేవాలన్న తపన… అందుకు పోరు బాట పట్టేందుకు సిద్ధమన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పోరుగిత్తలు ఇచ్చిన ఈ పిలుపు మహోద్యమమై సీమ పాలిటి సైంధవులకు శరాఘాతమయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయి.  (ప్రొద్దుటూరు నుండి వనం దత్తప్రసాద్ శర్మ అందించిన ప్రత్యేక కథనం) రాయలసీమకు రాజధానిని రేపటి […]పూర్తి వివరాలు ...

రాజకీయాలు

వీళ్ళు పన్ను ఎందుకు కట్టటం లేదో?

కడప కార్పోరేషన్ పరిధిలో గత కొద్ది సంవత్సరాలుగా పన్ను కట్టకుండా తిరుగుతున్న కొంతమంది వ్యక్తులు, సంస్థల పేర్లను ఒక దినపత్రిక ఈరోజు ప్రచురించింది. సదరు కధనం ప్రకారం పన్ను కట్టనివాళ్ళ జాబితా ఇదే… ఫాతిమా మెడికల్‌ కాలేజ్‌ రూ.81 లక్షల 77వేల 282, ఫాతిమా ఇంజనీరింగ్‌ కాలేజ్‌ రూ.14 లక్షల 77 వేల 392 నిర్మలా హాస్పిటల్‌ అండ్‌ క్వార్టర్స్‌ రూ.19 లక్షల 11 వేలు సరస్వతి విద్యాలయం రూ.12 లక్షల 86 వేల 714 దేశం […]పూర్తి వివరాలు ...

రాజకీయాలు

ఈరోజు కడపకు రానున్న ఇన్చార్జి మంత్రి

జిల్లా ఇంచార్జ్ మంత్రిగా నియమితులైన రాష్ట్ర సాంఘిక, గిరిజన సంక్షేమశాఖామంత్రి రావెల కిశోర్‌బాబు ఈ రోజు జిల్లాకు వస్తున్నారు. గురువారం ఉదయం 10 గంటలకు తిరుపతి నుంచి రోడ్డుమార్గాన రాజంపేటకు బయలుదేరి మధ్యాహ్నం గం.1.30కు చేరుకొని, స్థానిక ర.భ.శాఖ కార్యాలయంలో విశ్రాంతి తీసుకుంటారు. సాయంత్రం గం.4.00కు కడపకు చేరుకొని, అక్కడి స్టేట్ గెస్ట్‌హౌస్‌లో అధికారులు, అనధికారులతో సమావేశమవుతారు. రాత్రికి అక్కడే బసచేసి 15న కడపలో జరిగే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు […]పూర్తి వివరాలు ...

వార్తలు

ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ కాల్చిన విద్యార్థులు

ప్రొద్దుటూరు: రాయలసీమ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఈరోజు (బుధవారం) విద్యార్థులు స్థానిక పుట్టపర్తి సర్కిల్ లో ముఖ్యమత్రి దిష్టిబొమ్మను కాల్చినారు. రాయలసీమ విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో  పుట్టపర్తి సర్కిల్ వద్దకు చేరుకున్న విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేఖంగా నినాదాలు చేశారు. రాజధానితో సహా శ్రీభాగ్ ఒప్పందాన్ని అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా  రాయలసీమ విద్యార్థి సమాఖ్య అధ్యక్షుడు భాస్కర్ మాట్లాడుతూ… విజయవాడను తాత్కాలిక రాజధానిగా చెయ్యటం అన్నది ముఖ్యమంత్రి కుట్రలో భాగమన్నారు. హైదరాబాదు […]పూర్తి వివరాలు ...

రాజకీయాలు

ఫిరాయించిన ముగ్గురు వైకాపా కౌన్సిలర్లపై అనర్హత వేటు

రాయచోటి : మునిసిపల్‌ ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్‌ ఎన్నిక సందర్భంగా విప్‌ ధిక్కరించినందుకు ముగ్గురు కౌన్సిలర్లపై మంగళవారం అనర్హత వేటు పడింది. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి నరసింహులునాయక్‌ ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు. మునిసిపాలిటీలోని 4వ వార్డు కౌన్సిలర్‌ అనీఫా, 12వ వార్డు కౌన్సిలర్‌ మహబూబ్‌బాష, 21వ వార్డు కౌన్సిలర్‌ షాహిరున్నీసాలపైన ఈ వేటు పడింది. పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించి, ఛైర్మన్‌, వైస్‌ఛైర్మన్‌లుగా పార్టీ బలపరిచిన అభ్యర్ధికి ఓటు వేయలేదంటూ వైకాపా నాయకులు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి […]పూర్తి వివరాలు ...

వార్తలు

తాత్కాలిక రాజధాని కుట్రే!

బాబు మాటల మరాటీ అయితే వెంకయ్య మాయల మరాటీ  విజయవాడను తాత్కాలిక రాజ ధానిగా చంద్రబాబు ప్రకటించడం వెనక కుట్ర దాగి ఉందని విశ్రాంత న్యాయమూర్తి లక్ష్మణ్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. రాయలసీమలోనే ఆంధ్రప్రదేశ్ రాజధానిని ఏర్పాటు చేయాలనే డిమాండ్ సాధన కోసం పార్టీలకతీతంగా రాజకీయ జేఏసీగా ఏర్పడాలని ఆయన సూచించారు. మంగళవారం కడపలో రాయలసీమ రాజధాని సాధన కమిటీ ఆధ్వర్యంలో విసృ్తత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి మాట్లాడుతూ సీమ వాసులు నాడు […]పూర్తి వివరాలు ...

వార్తలు

‘శివరామక్రిష్ణన్’కు నాయకుల నివేదనలు

అందుబాటులో భూమి “కడపలో 30 వేల ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంది. రిమ్స్‌ను ఎయిమ్స్‌గా మార్చుకోవచ్చు. చెన్నై, తిరుపతి ప్రాంతాలు దగ్గరగా ఉన్నాయి. విదేశీయులు వచ్చేందుకు అనువుగా ఉంటుంది. పర్యాటక ప్రాంతంగా కూడా అభివృద్ధి చేసుకోవచ్చు. జాతీయ రహదారి, కృష్ణపట్నం ఓడరేవు, విమానాశ్రయాలు దగ్గరలోనే ఉన్నాయి. జిల్లాను అభివృద్ధి చేస్తామంటే మా పార్టీ ప్రజాప్రతినిధులందరం రాజీనామ చేసి వెళ్తాం. – ఆదినారాయణరెడ్డి, శాసనసభ్యులు, జమ్మలమడుగు అన్యాయం చేయొద్దు “కడపకు అన్యాయం చేయొద్దు. రాజధాని ఏర్పాటుకు అనువుగా […]పూర్తి వివరాలు ...

వార్తలు

‘శివరామక్రిష్ణన్’కు నిరసన తెలిపిన విద్యార్థులు

కడప: రాజధాని ఎంపికకు సంబంధించి అభిప్రాయ సేకరణ జరిపేందుకు ఈ రోజు కడపకు వచ్చిన శివరామకృష్ణన్ కమిటీకి విద్యార్థుల నుండి నిరసన ఎదురైంది. రాయలసీమలో రాజధాని ఏర్పాటు చేయాలని కోరుతూ రాయలసీమ స్టూడెంట్ ఫెడరేషన్‌ విద్యార్థులు శివరామకృష్ణన్ కమిటీ సమావేశం జరుగుతున్న హాల్ లోకి దూసుకువెళ్లి తమ నిరసన తెలియచేశారు. ఈ సందర్భంగా వారు కమిటీ రాకను నిరసిస్తూ ప్లెకార్డులు ప్రదర్శించారు. రాయలసీమకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని ఈ సందర్బంగా వారు కోరారు. నిరసన  తెలుపుతున్న విద్యార్థులను […]పూర్తి వివరాలు ...

ప్రత్యేక వార్తలు

ఈ రోజు కడపకు శివరామక్రిష్ణన్

ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎంపిక కోసం కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ నేడు కడప జిల్లాలో పర్యటించనుంది. ఉదయం 10.30 గంటలకు కడపలోని సభా భవనంలో జిల్లా అధికారులతో కమిటీ సమావేశం కానుంది. కొత్త రాజధాని ఏర్పాటుపై అభిప్రాయాలు, వినతలు స్వీకరించనుంది. ఇప్పటికే ఒకసారి ఆయా ప్రాంతాలలో పర్యటించి పర్యటనలు పూర్తైనట్లు ప్రకటించిన శివరామకృష్ణన్ కమిటీ ఇప్పుడు మళ్ళీ పర్యటిస్తుండడం వెనుక మతలబు ఏమిటో? ఒక పక్క కమిటీ ఇలా పర్యటనలు చేస్తోంటే రాష్ట్ర మంత్రులూ, ముఖ్యమంత్రీ రాజధాని, […]పూర్తి వివరాలు ...

error: