యోగివేమన విశ్వవిద్యాలయ పరిధిలోని డిగ్రీ కళాశాలల విద్యార్థుల వార్షిక పరీక్షలు ఏప్రిల్ రెండు నుంచి మే ఒకటో తేదీ వరకు నిర్వహిస్తామని పరీక్షల నిర్వహణ అధికారి ఆచార్య సాంబశివారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య బేతనభట్ల శ్యామసుందర్ ఆదేశాల మేరకు ఈ తేదీలు నిర్ణయించామన్నారు. పూర్తిస్థాయి పరీక్షల షెడ్యూలును విశ్వవిద్యాలయ వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని అలానే ఆయా కళాశాలలకు పంపుతామని ఆయన చెప్పారు.