వైకాపా చీఫ్, కడప ఎంపీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బెయిల్ వస్తుందా రాదా అని మొన్న సుప్రీంకోర్టులో బెయిల్ పిటీషన్పై విచారణ సమయంలో సర్వత్రా ఉత్కంఠగా ఎదురుచూశారు. ఐతే సుప్రీంకోర్టు బెయిల్ పిటీషన్ను తోసిపుచ్చింది. దీంతో పార్టీ శ్రేణులంతా నిరాశ చెందాయి. కానీ జగన్ అభిమానులు, ముఖ్యంగా యువత సామాజిక సైట్ ఫేస్ బుక్లో జగన్కు బెయిల్ వస్తుందనీ, నెక్ట్స్ సీఎం జగనే అంటూ తెగ కామెంట్స్ పెడుతున్నారు. జగన్ బయటకొస్తే వార్ వన్ సైడేననీ… […]పూర్తి వివరాలు ...
కడప జిల్లాలోని కలమళ్ళ గ్రామంలో గల శ్రీ చెన్నకేశవస్వామి ఆలయ ప్రాంగణంలో క్రీ.శ. 575లో రేనాటి చోళరాజు ధనుంజయ వర్మ వేయించిన శాసనాన్ని 1904లో మద్రాసు శాసన పరిశోధన విభాగం వారు గుర్తించారు. నేటికి లభించిన తొలి తెలుగు శాసనాల్లో కలమళ్ళ శాసనమే ప్రప్రథమ మనడానికి అందులో వాడిన ప్రాచీన లిపి-భాషలే ప్రమాణం. పోగొట్టుకున్నాం! ఈసారి పోయింది అట్లాటి ఇట్లాటి వస్తువు కాదు. తెలుగు భాషకు వెలుగు పూలు పూయించిన తొలి తెలుగు శాసనం… తెలుగు భాషకు […]పూర్తి వివరాలు ...
తెదేపా అధ్యక్షుడు చంద్రబాబుకు సీబీఐని ప్రశ్నించే దమ్ము, ధైర్యం లేదని రాజంపేట శాసన సభ్యుడు ఆకేపాటి అమరనాథరెడ్డి విమర్శించారు. రాజంపేటలో మాట్లాడుతూ జగన్మోహన్రెడ్డికి బెయిల్ రాకుండా కాంగ్రెస్, టీడీపీ మోకాలొడ్డుతున్నాయన్న ఆయన సీబీఐ కాంగ్రెస్ పార్టీ జేబు సంస్థ అని, ఇప్పటికే ప్రజల్లో దానిపై చులకన భావం ఏర్పడిందన్నారు. చివరకు సీబీఐ పనితీరును అత్యున్నత న్యాయస్థానం కూడా ప్రశ్నించడం తెలిసిందేనన్నారు. బెయిల్ రాకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా సీబీఐ పనిచేస్తున్నదన్నారు. సీబీఐ సర్కారు పంజరంలో చిలుక అని ఆయన […]పూర్తి వివరాలు ...
కడప నగరంలో పెరిగిన జనాభాను దృష్టిలో పెట్టుకుని సిటీ బస్సులు నడపాలని జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ నిర్మల అన్నారు. శుక్రవారం నగరం, పురపాలక సంస్థ కమిషనర్లు, అర్టీసీ, ఇతర ప్రభుత్వ అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కడప నగరంతో పాటు ప్రొద్దుటూరు పురపాలకలో కూడా సిటీ బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. అందుకు పురపాలక సంస్థల అధికారులు సహకరించాలన్నారు. విద్యుత్, తాగునీటి సరఫరా, భూసేకరణ, రోడ్లు వెడల్పు, ఆక్రమణలు, తదితరాలపై సమీక్షించడం […]పూర్తి వివరాలు ...
కడప జిల్లా నిడిజివ్వి గ్రామంలో జన్మించిన మైసూరారెడ్డి ‘రాయలసీమ ఉద్యమం’లో కీలక పాత్ర పోషించారు. మూడుసార్లు ఎమ్మెల్యే అయ్యారు. రాష్ట్ర హోంమంత్రిగా పనిచేశారు. సుమారు 25 ఏళ్లు కాంగ్రెస్లో కొనసాగిన ఈ వైద్య పట్టభద్రుడు 2004లో తెలుగుదేశంలో చేరారు. ఒక టర్మ్ రాజ్యసభ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహించారు. ఆ మధ్యన ఎం.వి.మైసూరారెడ్డితో ‘సాక్షి’ ప్రతినిధులు డి.శ్రీనాథ్, పూడూరి రాజిరెడ్డి సంభాషించారు. సారాంశం ఆయనదైన రాయలసీమ మాండలికంలోనే… మొదట్నుంచీ రైతు కుటుంబము. సిర్రాజుపల్లి అనే చిన్న గ్రామం నుంచి […]పూర్తి వివరాలు ...
వైఎస్ జగన్మోహన్రెడ్డిపై పెట్టిన కేసులు పూర్తిగా రాజకీయ ప్రేరేపితమని, ఈ విషయం రాష్ట్రంలో చిన్న పిల్లాడికి కూడా తెలుసని ఆయన భార్య వైఎస్ భారతి అన్నారు. జగన్ను జైల్లో ఉంచడమే సీబీఐ లక్ష్యమని, అందుకే ఈ కేసులో దర్యాప్తు పూర్తి చేయాలన్న ఆలోచనే సీబీఐకి లేదని ఆమె విమర్శించారు. గురువారం ఆమె ప్రముఖ ఆంగ్ల న్యూస్ చానెల్ ‘ఎన్డీటీవీ’తో మాట్లాడుతూ … ‘‘ఈ కేసును సీబీఐ 21 నెలలుగా దర్యాప్తు చేస్తోంది. అక్టోబర్లో బెయిల్కోసం పిటిషన్ వేసినప్పుడు.. […]పూర్తి వివరాలు ...
రాయచోటి – లక్కిరెడ్డిపల్లె ప్రాంతాలను సస్యశ్యామలం చేయగలిగే వెలిగల్లు, శ్రీనివాసపురం రిజర్వాయర్ల నిర్మాణాలను త్వరగా పూర్తిచేయించి, హంద్రీ-నీవా జలాల తో నింపడమే తన జీవిత ధ్యేయమని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డి పేర్కొన్నారు. హంద్రీ – నీవా జలాలను తరలించడం ద్వారానే దుర్భిక్ష ప్రాంతమైన రాయచోటి నియోజక వర్గంలో శాశ్వతంగా కరవును నివారించవచ్చని శ్రీకాంత్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం స్థానిక మార్కెట్ యార్డులో నూతనంగా ఏర్పాటు చేసిన భూసార పరీక్షా కేంద్రాన్ని ప్రారంభించిన ఆయన రైతులనుద్దేశించి మాట్లాడుతూ దశాబ్దాలుగా ఈ […]పూర్తి వివరాలు ...
పదకవితా పితామహుడు శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యుని 605వ జయంత్యుత్సవాలకు తి.తి.దే బుధవారం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్లను అన్నమాచార్య ప్రాజెక్టు ఇన్చార్జి డెరైక్టర్, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఆఫీసర్ టీఏపీ నారాయణ తాళ్లపాకలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 24 నుంచి 26 వరకు జయంత్యుత్సవాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. అన్నమయ్య జన్మస్ధలం అయిన తాళ్లపాకలోని ధ్యానమందిరంలో నాదస్వర సమ్మేళనంతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయన్నారు. గ్రామోత్సవం, సప్తగిరి గోష్టిగానం, శ్రీవారి కల్యాణం, […]పూర్తి వివరాలు ...
చంద్రబాబు పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన పలు హామీలను గడగడపకూ తెలిపెందుకు మాజీ ఎమ్మెల్సీ పుత్తా నర్సింహారెడ్డి కమలాపురం నియోజకవర్గ పరిధిలో ‘పలెపల్లెకు పుత్తా’ కార్యక్రమం ఈరోజు ఆరంభించనున్నారు. నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాల్లోఅక్కడి మండల, గ్రామస్థాయి నాయకులు నిత్యం కొన్ని గ్రామాలను ఎంపిక చేసుకుని వాటిలో ప్రతి ఇంటికీ వెళ్లి బాబు వాగ్దానాలపై ప్రచారం చేయనున్నట్లు పుత్తా నర్సింహారెడ్డి తెలిపారు. బాబు గారి హామీల్లో ముఖ్యమైన బ్యాంకుల్లో వ్యవసాయ రుణాలు, బంగారు రుణాలురద్దు, సాగు, తాగునీరు సరఫరా, […]పూర్తి వివరాలు ...