ప్రొద్దుటూరు: విద్యార్థులకు సైన్సు ను ప్రయోగాత్మకంగానే శిక్షణ ఇచ్చినప్పుడే మంచి అవగాహన కలుగుతుందని జనవిజ్ఞాన వేదిక చెకుముకి కన్వీనర్ జి,టి.ఈశ్వరయ్య ఆన్నారు . స్థానిక శ్రీరాములపేటలోని CRC భవనంలో ఆదివారం ఉదయం విద్యార్థులకు సైన్సు ను ప్రయోగాత్మకంగా వివరించే కార్యక్రమం చేపట్టారు. బోధకులుగా సైన్సు ఉపాద్యాయులు శివ మాధవ రెడ్డి , రసాయన శాస్త్ర అధ్యాపకులు ఐఎల్ కుమార్ పాల్గొన్నారు. రసాయన శాస్త్రం లోని ద్రావణాల రకాలు , సజాతీయ , విజాతీయ , సంత్రుప్త , […]పూర్తి వివరాలు ...
ప్రదేశము : అర్కటవేముల లేదా అరకటవేముల తాలూకా: ప్రొద్దుటూరు (కడప జిల్లా) శాసనకాలం: 9వ శతాబ్దం కావచ్చు శాసన పాఠం: 1.స్వస్తిశ్రీ వల్లభమహారాజాధి రాజపరమేశ్వర భట్టరళ పృథివిరాజ్య 2.ఞయన్ పెబా೯ణ వంశ భుజంగది భూపాదిత్యుల కదాన్ వంగనూర్లి చరువశమ్మ೯పుత్ర 3.విన్నళమ్మ೯ళాకు నుడుగడంబున పన్నశ ఇచ్చిరి. వేంగుఖూదు, పెన్డ్రు(డ్=θ)కాలు, నారకొళూ కంచద్లు 4.ఇన్నల్వురు సాక్షి 5.దేనికి వక్రంబువచ్చు వాన్డు(డ్=θ)పఞచ్ మహాపాతక సంయ్యుక్తున్డు(డ్=θ) గున్ 6.అబ్భిద్ధ೯త్తన్త్రిభి భు೯క్తం సద్భిశ్చపరిపాలితం ఏతానినని వత్త೯న్తే పూవ్వ೯రాజకృ 7.తానిచ ||స్వరత్తా[0]పరదత్తా[0]వాయోహరేతి(త) వసుందరా(0)షష్టిం వష೯సహప్రాణి విష్టా […]పూర్తి వివరాలు ...
బద్వేలు: శాసనసభకు హాజరుకాని తనను ఎలా సస్పెండ్ చేస్తారని వైఎస్సార్ జిల్లా బద్వేలు శాసనసభ్యుడు తిరువీధి జయరాములు ప్రశ్నించారు. ఐదు రోజుల క్రితం అయ్యప్పస్వామి దర్శనం కోసం శబరిమలై వెళ్లిన ఆయన శనివారం సాయంత్రం పోరుమామిళ్లలోని తన నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ తాను ఐదు రోజుల క్రితం శబరిమలైకి వెళ్లానని అందువల్ల అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాలేకపోయానన్నారు. అయినా ఈనెల 18న తాను అసెంబ్లీలో ఉన్నట్లు ప్రకటించి స్పీకర్ తనను కూడా సస్పెండ్ చేశారన్నారు. […]పూర్తి వివరాలు ...
ప్రదేశము: మాలెపాడు గ్రామము, ఎర్రగుంట్ల మండలం, కమలాపురం తాలూకా, కడప జిల్లా శాసన కాలం: క్రీ.శ. 725 శాసన పాఠం: మొదటి వైపు 1.అ స్వస్తిశ్రీ చోఱమ 2.హా రాజాధిరాజ ప 3.రమేశ్వర విక్రమాది 4.త్యశక్తి కొమర వి 5.క్రమాదితుల కొడుకు 6.[ళ్ళ్]కాశ్యపగోత్ర 7.[న్డు(ఇక్కడ డవత్తును θగా చదవాలి)]శతదిన్డు(ఇక్కడ డవత్తును θగా చదవాలి)శిద్ది 8.[వే]యురేనాణ్డు ఏఱు[వే] 9.[ళు] ఏళుచు[న్డి](ఇక్కడ డవత్తును θగా చదవాలి)కొను 10.[ఱి]పాఱ రేవళ 11.మ్మ೯కాశ్యపగో 12.త్రి(త్రు)నికి ఇచ్చిన 13.[- -]చిఱుంబూరి ఉత్త 14.[- -]శ తూపు೯నదిశ […]పూర్తి వివరాలు ...
పిడికెడంత సీమ గుప్పెడంత ప్రేమ వేటకుక్కల్నే యంటబడి తరిమిన కుందేళ్ళు తిరిగాడిన చరిత్ర! రాళ్ళు కూడా రాగాలు పలికిన గడ్డ! కాలికింద కరువు ముల్లై గుచ్చుకుంటే కంట్లో నెత్తురు కారుచిచ్చై కమ్ముకుంది నెర్రెలిగ్గిన ఒళ్ళుపై గుక్కెడు నీళ్ళు సిలకరించు ఒళ్లంతా గొర్రుసాల్లో ఇత్తనమై సర్రున మొలకెత్తుతుంది. నిద్రబుచ్చేటోడూ, నిందలేసేటోడూ ఇద్దరూ దొంగలే! నిజం మాట్లాడేటోడు, నిగ్గుదేల్చోటోడే నికార్సైన నాయకుడు బువ్వ పెట్టిన సేతినే బూడిదపాలు జేసినోనిపై భూమి తిరగాబడక మానదు భుక్తే భుజాల్ని కలుపుతుంది వలసే నిలేసి […]పూర్తి వివరాలు ...
రైల్వేకోడూరు : వైఎస్సార్ జిల్లా రైల్వే కోడూరు, ఓబులవారిపల్లె మండలాల్లో వర్షాలకు దెబ్బతిన్న పంటలను ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం పరిశీలించారు. మధ్యాహ్నం 2 గంటలకు రైల్వే కోడూరు పట్టణంలోని చిట్వేల్ రోడ్డు బ్రిడ్జిని ఆయన పరిశీలించారు. తర్వాత ఓబులవారిపల్లి మండలం బి.కమ్మపల్లి వద్ద ఆగి రైతులతో మాట్లాడారు. ఉద్యాన పంటలకు రుణాలను మాఫీ చేయలేమని స్పష్టం చేశారు. ఎకరాకు రూ.10వేల పరిహారం మాత్రమే ఇస్తామన్నారు. హెలికాప్టర్లో మధ్యాహ్నం 1.45 గంటలకు కోడూరుకు వచ్చిన ఆయన తొలుత గుంజన నదిని […]పూర్తి వివరాలు ...
రాయలసీమ ప్రజలకు తీరని అన్యాయం చేస్తున్న బాబు కరెంటు కోసం సీమ ప్రాజెక్టులను గాలికొదిలేస్తారా? హైకోర్టును వేరే చోట ఏర్పాటు చెయ్యాలి 13 జిల్లాలను ఒకే విధంగా అభివృద్ధి చేయాల కడప: రాయలసీమకు జరుగుతున్న అన్యాయలపైన, రాయలసీమ విషయంలో, అభివృద్ది వికేంద్రీకరణ విషయంలో ప్రభుత్వ వివక్షను ప్రశ్నిస్తూ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మొదటిసారి బహిరంగంగా గొంతెత్తారు. మంగళవారంనాడు పులివెందుల నియోజకవర్గ పరిధిలోని సింహాద్రిపురం మండలంలో పైడిపాలెం ప్రాజెక్టును ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రాజధాని చుట్టూ […]పూర్తి వివరాలు ...
ఒక పడుచు పిల్లగాడు తన అందమైన పడుచు పెళ్ళాన్ని విడిచి వ్యాపారం కోసం పరాయిదేశం పోయినాడు. వాడు చెప్పిన సమయానికి రాలేదు. ఆలస్యంగా వచ్చిన మగడిని చూసి అలిగింది ఆ అందాలభామ. ఆ మగడు ఆమెను ఎలా అనునయించాడో, అలుక తీర్చాడో చూడండి. వర్గం: జట్టిజాం పాట (బృందగేయం) పాడటానికి అనువైన రాగం:తిలకామోద్ స్వరాలు (మధ్యాది తాళం) ఏమే రంగన పిల్లా నీ మకమే సిన్నబాయ – సెప్పే పిల్లా ఆలూరు సంతాకు పోతాన్ పిల్లా అడిగినన్ని […]పూర్తి వివరాలు ...
అయ్యా.. విపక్ష నేతలూ! కడప జిల్లా ప్రజలు దుర్భర పరిస్థితుల మధ్య ఉపాధి కరువై, ప్రభుత్వ ఆదరువు లేక, రోగాల పాలై బతుకీడుస్తున్నారు. మిమ్ములను, మీ పార్టీలని ఆదరించిన జిల్లా ప్రజలపైన ప్రభుత్వం కక్ష కట్టి వివక్ష చూపుతోంది. ఇదే విషయాన్ని మీ పార్టీల నేతలే పలు సందర్భాలలో వాక్రుచ్చినారు. ఇదే సమయంలో గత రెండు మూడు నెలలుగా జిల్లా జ్వర పీడితమైంది. ఇప్పటికే సుమారు వంద మంది వరకూ సామాన్యులు ఈ జ్వరాల బారిన పడి […]పూర్తి వివరాలు ...