మైదుకూరు, ఎర్రగుంట్లలలో అభ్యర్థులు దొరకలేదు

    మైదుకూరు, ఎర్రగుంట్లలలో అభ్యర్థులు దొరకలేదు

    శతాధిక సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పరిస్థితి కడప జిల్లాలో దయనీయంగా మారింది. ఈనెల 30న జరిగే పురపాలక పోరులో ఆ పార్టీ తరపున నామినేషన్ వేసే నాధుడే కరవయ్యారు.

    జిల్లాలోని ఏడు మున్సిపాల్టీల్లో జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున నామినేషన్లు వేసిన అభ్యర్థుల సంఖ్య రెండంకెలకు మించలేదు.

    ముఖ్యంగా మైదుకూరు, ఎర్రగుంట్ల మున్సిపాల్టీల్లో ఆ పార్టీ తరపున నామినేషన్ వేసే అభ్యర్థి ఒక్కరంటే ఒక్కరు కూడా లేకపోవడం పార్టీ పరిస్థితికి అద్దంపడుతోంది.

    చదవండి :  'సతీష్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేయాల'

    కడప కార్పొరేషన్‌లో 50 డివిజన్లకు గాను కేవలం 13 మంది , మిగిలిన ఏడు మున్సిపాల్టీల్లోని 236 వార్డులకు 76 మంది మాత్రమే నామినేషన్లు దాఖలు చేశారు.

    ఉప సంహరణ తేదీ నాటికి ఈ సంఖ్య మరింత తగ్గే సూచనలు కన్పిస్తున్నాయి.

      వార్తా విభాగం

      ఇవీ చదవండి

      Leave a Reply

      Your email address will not be published. Required fields are marked *