రెడ్డేరోళ్ల ఆదిరెడ్డి ఇంటిముందు బ్యాండు మేళాలు ఉన్నట్టుండి మోగడంతో జనం సందడిగా గుమిగూడినారు. రేపు దగ్గరలోని టవున్లో ఆదిరెడ్డి కొడుకు విష్ణూది పెళ్లి. పెళ్లికి ముందు జరిపే దాసర్ల కార్యం ఆదిరెడ్డి ఇంట్లో జరుగుతోంది. దాసర్ల కోసం కుండలూ, బానలు తెచ్చి రామస్వామి దేవళం ముందు ఆవరణలోని వేపచెట్టు కింద పెట్టి సున్నపు నీళ్లు కలిపిన గుడ్డతో వాటిపై తెల్లటి పట్టెలు గీస్తున్నాడు కుమ్మరిశెట్టి. ఆడోళ్లంతా అక్కడ చేరి సాంగెపు పనులు చక్కబెడుతూ చతుర్లు విసురుకుంటున్నారు. సారేకాలు, […]పూర్తి వివరాలు ...
నిన్నమొన్నటిదాకా కడప జిల్లా మొత్తానికి ప్రసిద్ధిచెందిన దేవాలయం అంటే ‘దేవుని కడప’ ఒక్కటే గుర్తొచ్చేది. ఇప్పుడు స్వదేశ్ దర్శన్ కింద జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేసిన నాలుగు కేంద్రాల్లో దేవుని కడప ప్రస్తావనే లేదు. ఆ నాలుగు కేంద్రాలు: ఒంటిమిట్ట కోదండరామాలయం, పుష్పగిరి చెన్నకేశవాలయం, అమీన్ పీర్ దర్గా, గండికోటలోని మసీదు. ఒంటిమిట్టను ఎలాగూ తితిదే వాళ్ళు నూరుకోట్లతో అభివృద్ధి చేస్తున్నారు కదా? అది చాలదన్నట్లు మరీ కక్కుర్తిగా చిన్నాచితకా దేవస్థానాలకు కేంద్రప్రభుత్వం ఇస్తున్న రెండుకోట్లకు కూడా […]పూర్తి వివరాలు ...
ఇది రాయలసీమ జీవన్మరణ సమస్య రెండు తెలుగు రాష్ట్రాలు కృష్ణా జలాల వినియోగంలో సమస్యలు రాకుండా ఉండడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన బిల్లులో కృష్ణానది నీటి యాజమాన్య బోర్డును ఏర్పాటు చేసిన విషయం విదితమే. కృష్ణానది నీటిపై ఆధారపడిన ఒక ప్రాంతానికి తెలంగాణ రాష్ట్రం, అదే సందర్భంలో కృష్ణా నది నీటిపై ఆధారపడిన రెండు ప్రాంతాలకు ఆంద్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా నది నీటి యాజమాన్య బోర్డుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. రెండు ప్రాంతాలకు అంటే రాయలసీమ, దక్షిణ […]పూర్తి వివరాలు ...
రెండో దఫా ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన తరువాత స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పర్యటన అనే భావనను మార్చేశారు. అంతకు ముందు పల్లెబాట, నగరబాట, రైతు చైతన్యయాత్ర, పొలం బడి, రైతు సదస్సులు వంటివి నిర్వహించారు. రెండోసారి పదవిని చేపట్టిన తరు వాత ప్రజలతో ముఖాముఖీ సమావేశమై ప్రభుత్వ పథకాల గురించీ, అవి ప్రజలకు చేరుతున్న తీరు గురించీ, వాటితో చేకూరిన లబ్ధిని గురించీ, మంచిచెడుల గురించీ మాట్లాడాలని అనుకున్నారు. అలాగే భూపంపిణీ, ఇళ్లు, ఇళ్ల స్థలాల […]పూర్తి వివరాలు ...
యోగి వేమన విశ్వవిద్యాలయం ఘనత కడప: పరీక్షలు జరిగిన 24 గంటల్లోపే పీజీ ప్రవేశ పరీక్ష (పీజీసెట్ 2016) ఫలితాలను ప్రకటించి యోగి వేమన విశ్వవిద్యాలయ రికార్డు సృష్టించింది. శుక్రవారం రాత్రి 7 గంటలకు ఉపకులపతి ఆచార్య బేతనభట్ల శ్యామసుందర్ ఈ ఫలితాలను విడుదల చేశారు.ఈ సందర్భంగా పీజీసెట్ కన్వీనర్ ఆచార్య రఘునాథరెడ్డి మాట్లాడుతూ ఈ నెల 1, 2 తేదీల్లో జరిగిన వైవీయూ సెట్కు 2,602 మంది అభ్యర్థులు పరీక్ష రాయగా 2,356 మంది అర్హత […]పూర్తి వివరాలు ...
చంద్రబాబుకు కోపం వచ్చింది. పట్టిసీమ నుంచి నీళ్లిస్తామని చెబితే వినకుండా సిద్ధేశ్వరం అలుగు కట్టుకుంటామని వెళతారా? అని పోలీసులను ఉసిగొలిపాడు. వాళ్లకు చేతనైనదంతా వాళ్లు చేశారు. మీ పట్టిసీమ మాకెందుకు? సిద్ధేశ్వరం కట్టుకుంటే చాలని అనడమే శాంతిభద్రతల సమస్య అయింది. ముందు రోజే హౌస్ అరెస్టులు చేశారు. నాయకుల కోసం ఆరా తీసి ఆందోళన పెట్టారు. సిద్ధేశ్వరం దారులన్నీ జనమయం అవుతాయని అటకాయించారు. ఇటు నందికొట్కూరు నుంచి, అటు వెలుగోడు నుంచి చెక్పోస్టులు తెరుచుకున్నాయి. అసలు దారులు, […]పూర్తి వివరాలు ...
నాగభూషణరెడ్డి స్వస్థలం ప్రొద్దుటూరు కడప: ఇండియన్ ఫారెన్ సర్వీస్ అధికారి బి.నాగభూషణ రెడ్డి(B.N.రెడ్డి) నైజీరియా దేశంలో భారత హైకమిషనర్గా నియమితులయ్యారు. నాగభూషణరెడ్డి స్వస్థలం కడప జిల్లా, ప్రొద్దుటూరు. తండ్రి పేరు డాక్టర్ బి. రామసుబ్బారెడ్డి. నాగభూషణ్ 1993 బ్యాచ్ కు చెందినా ఐఎఫ్ఎస్ అధికారి. ప్రస్తుతం నాగభూషణ రెడ్డి జెనీవాలోని “పర్మినెంట్ మిషన్ ఆఫ్ ఇండియా”లో డిప్యూటీ శాశ్వత ప్రతినిధిగా పని చేస్తున్నారు. త్వరలోనే నాగభూషణరెడ్డి బాధ్యతలు స్వీకరిస్తారు. నైజీరియా హైకమిషనర్గా నియమితులైన నాగభూషణరెడ్డి గారికి కడప […]పూర్తి వివరాలు ...
ఆటంకాలు దాటుకొని అలుగుకు శంకుస్థాపన నిర్భందాలు దాటుకుని వేలాదిగా తరలి వచ్చిన జనం అడుగడుగునా అడ్డంకులు కల్పించిన ప్రభుత్వం సిద్దేశ్వరం వెళ్ళే దారిలో వందలాది తనిఖీ కేంద్రాలు రైతునాయకుల అరెస్టుకు పోలీసుల విఫలయత్నం ప్రతిఘటించిన రైతులు (సిద్దేశ్వరం నుండి మా ప్రత్యేక ప్రతినిధి) వాళ్ళు దారి పొడవునా తనిఖీల పేరుతో కాపు కాశారు. కొంతమందిని ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. మరికొంతమందిని మార్గమధ్యంలోనే నిలువరించారు. అడుగడుగునా ఆటంకాలు సృష్టించారు. నాలుగు జిల్లాల నుండి తరలివచ్చిన వాహన శ్రేణులను అడ్డుకోవాలని […]పూర్తి వివరాలు ...
సిద్దేశ్వరం ..గద్దించే స్వరం రాయలసీమకు ఇది వరం పాలకుల వెన్నులో జ్వరం కడితే అది సిద్దేశ్వరం కాదంటే అది యుద్దేశ్వరం సాగునీటి ఉద్యమ శరం తోకతొక్కిన సీమ నాగస్వరం కృష్ణా-పెన్నార్ ను తుంగలోతొక్కి కరువు జనుల ఆశలను కుక్కి సాగరాలను నిర్మించుకుని మూడుకార్లు పండించుకుని గొంతెండుతోందని గోస పెడితే అరెస్టులతో అణచేస్తారా ? అదిగదిగో కదులుతోంది దండు ద్రోహులగుండెల్లో ఫిరంగి గుండు నలుదిశలా కనబడలేదా ? రాయలసీమ ఉద్యమ జండా సాగుతోంది సన్నని దారుల గుండా ! […]పూర్తి వివరాలు ...