వార్తా విభాగం

అభిప్రాయం

కడపలో ఓటుకు ఎంత పంచారు?

ఉప ఎన్నికల ఫలితాలపై ‘ఆ ముగ్గురికే పట్టం’ పేరుతొ కడప జిల్లా టాబ్లాయిడ్లో ఒక కధనాన్ని ప్రచురించిన ఈనాడు దినపత్రిక అందులో ఒక ఆసక్తికరమైన అంశాన్ని ప్రస్తావించింది. ఈనాడు కధనం ప్రకారం రాయచోటి, రాజంపేట, రైల్వేకొడూరులలో తెదేపా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్తులు ఓటుకు ఐదు వందలనుంది వెయ్యి రూపాయల వరకు పంపిణీ చేస్తే వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్తులు రెండు వందల రూపాయల చొప్పున పంపిణీ చేశారు. కాంగ్రెస్, తెదేపా అభ్యర్తులు బాగా నగదు పంపిణీ చేసినప్పటికీ ఓటర్లు […]పూర్తి వివరాలు ...

వార్తలు

రాయచోటిలో వైకాపా రికార్డు

రాయచోతిలో అత్యధిక మెజారిటీ సాధించిన పార్టీగా వైకాపా రికార్డు సృష్టించింది.  ఇక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీకాంత్‌రెడ్డి… టీడీపీ అభ్యర్థి సుగవాసి బాల సుబ్రహ్మణ్యంపై 56,891 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. రాయచోటిలో కాంగ్రెస్ డిపాజిట్ కూడా దక్కించుకోలేదు. రాయచోటిలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లతో సహా మొత్తం పోలైన ఓట్లు 1,59,201. అభ్యర్థికి ధరవతు రావాలంటే ఇందులో ఆరింట ఒక వంతు ఓట్లు అంటే 26,533 ఓట్లు దక్కాలి. ఇక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థి రాంప్రసాద్‌రెడ్డి 25,344 […]పూర్తి వివరాలు ...

వార్తలు

వైకాపాకు కొమ్ము కాసిన అధికార యంత్రాంగం – ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు

అధికార యంత్రాంగం మొత్తం వైకాపాకు అనుకూలంగా పనిచేశారని కడప జిల్లా కాంగ్రెస్ నేతలు ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టరు అనిల్ కుమార్ కు ఫిర్యాదు చేయడం విశేషంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ తరపున డి.సి.సి అధ్యక్షుడు మాకం అశోక కుమార్ దీనికి సంబంధించి కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించడం ఆసక్తికరంగా ఉంది. జిల్లాలో మంగళవారం జరిగిన రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాల ఉపఎన్నికల పోలింగ్‌లో పలువురు అధికారులు, ఉద్యోగులు ఏకపక్షంగా వ్యవహరించారని, ఆ మూడు నియోజకవర్గాల్లో అధికార […]పూర్తి వివరాలు ...

వార్తలు

బారులు తీరిన ఓటర్లు – భారీ పోలింగ్ నమోదు

స్వల్ప సంఘటనలు మినహా వైఎస్సార్ జిల్లాలోని రైల్వేకోడూరు, రాజంపేట, రాయచోటి నియోజకవర్గాల్లో ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు అధికారులు పోలింగ్ కేంద్రాలకు చేరుకుని పోలింగ్ బూత్‌లలో ఈవీఎంల ఏర్పాటులో తలమునకలయ్యారు. ఉదయం 8 గంటలకు మందకొడిగా ప్రారంభమైన పోలింగ్ 10 గంటల సమయం తర్వాత ఊపందుకుంది. సాయంత్రం ఐదు గంటల వరకు ఓటర్ల ఉత్సాహం కొనసాగింది. దీంతో భారీగా పోలింగ్ నమోదైంది. 2009 అసెంబ్లీ ఎన్నికల కంటే అధిక సంఖ్యలో ఓటర్లు ఈసారి […]పూర్తి వివరాలు ...

అభిప్రాయం

సొంత జిల్లాకు తరలించుకుపోతున్నా….

రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వైఎస్సార్ జిల్లాలోని అభివృద్ధి పథకాలను సొంత జిల్లాకు తరలించుకుపోతున్నారు. ఈ విషయమై కడప జిల్లా కాంగ్రెస్ నేతలు మౌనం వహిస్తుండడం విశేషం. తరతరాలుగా వెనుకబాటుకు గురైన జిల్లాకు మంజూరైన ప్రాజెక్టులను చిత్తూరుకు తీసుకెళ్ళే బదులు ముఖ్యమంత్రి అక్కడికి కొత్త ప్రాజెక్టులను తీసుకువస్తే బాగుండేది. ఈ చర్యల వల్ల అంతిమంగా రాయలసీమ నష్టపోతుందన్నది నిర్వివాదాంశం. ఇదే విషయమై సాక్షి దినపత్రిక ఇవాళ ఒక కధనాన్ని ప్రచురించింది.పూర్తి వివరాలు ...

వార్తలు

వైఎస్ జగన్ అరెస్టు

ఎట్టకేలకు సిబిఐ ఊహాగానాలకు తెరదించింది. కొద్దిసేపటి క్రితం వైఎస్ జగన్ అరెస్టు చేసింది.ఈ మేరకు వైఎస్ జగన్ కుటుంబ సభ్యుల సిబిఐ సమాచారం అందించింది. రేపు జగన్ కోర్టుకు హాజరు కావాల్సిన నేపధ్యంలో విచారణ పేరుతొ సిబిఐ జగన్ను అదుపులోకి తీసుకుంది. నా అరెస్టుకు రంగం సిద్ధమైన్దంటూ జగన్ చేస్తున్న ఆరోపణలను నిజమయ్యాయి. జగన్ అరెస్టు సమాచారాన్ని ముందస్తుగా అందుకున్న ప్రభుత్వమూ, పోలీసు శాఖ నిముషాల వ్యవధిలో భారీగా పోలీసు బలగాలను మోహరించింది.పూర్తి వివరాలు ...

వార్తలు

జిల్లాలోఅనధికారికంగా నిషేదాజ్క్షలు

కడప: జిల్లాలో  పలు చోట్ల అనధికారికంగా నిషేదాజ్క్షలను జారీ చేశారు. ఈ సాయంత్రం నుండి మైదుకూరు, బద్వేలు, కడప, పులివెందుల, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు సహా జిల్లా వ్యాప్తంగా భారీగా పోలీసుల మోహరించారు. కడప తిరుపతి మార్గంలో బస్సు సర్వీసులను కొద్ది సేపటి క్రితం నిలిపివేసినట్లు వార్తలు వెలుడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా అనేక గ్రామాలలో విద్యుత్తూ సరఫరాను ఆపివేశారు.పూర్తి వివరాలు ...

వార్తలు

జిల్లాలో బస్సు సర్వీసుల నిలిపివేత

కడప : జిల్లాలో బస్సు సర్వీసులను నిలిపివేసినట్టు వార్తలు వెలువడుతున్నాయి.  అలాగే కడప నుండి హైదరాబాద్ కు చేరుకునే బస్సులను రద్దు చేస్తున్నట్టు సమాచారం. పోలీసు అధికారుల ఆదేశాలతోనే ఆర్టీసీ బస్సులను రద్దు చేసినట్టు అధికారులు తెలిపారు. కడప పులివెందుల బస్సులను కూడా నిలిపెసినట్లు సమాచారం. ఇదంతా జగన్ అరెస్టు సమాచారం మేరకే జరుగుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే పోలీసుల అత్యుత్సాహం విమర్శలకు దారి తీస్తోంది.పూర్తి వివరాలు ...