కడప: రాయలసీమ సమగ్రాభివృది కోసం ఈనెల 27 నుంచి ‘రాయలసీమ ఆత్మగౌరవయాత్ర’ను చేపడుతున్నట్లు రాయలసీమ స్టూడెంట్స్ యూనియన్ (ఆర్ఎస్యూ) జిల్లా అధ్యక్షుడు జయవర్థన్ తెలిపారు. ఆత్మగౌరవయాత్రకు సంబంధించిన గోడపత్రాలను ఆదివారం స్థానిక గీతాంజలి కళాశాలలో విద్యార్థులతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆర్ఎస్యూ జిల్లా అధ్యక్షుడు జయవర్థన్ మాట్లాడుతూ శతాబ్దాలుగా కరవు కాటకాలతో రాయలసీమ అల్లాడుతోందన్నారు. సీమ నేల మీద ఆత్మహత్యలు, వలస బతుకులు శ్ర్వసాదారనంయ్యాయన్నారు. తరతరాలుగా సాగు, తాగునీరు అందక సీమ గొంతు ఎండిపోతోందని, […]పూర్తి వివరాలు ...
డీజీపీ ఆదేశించడంతో శాసనసభ్యుడు ఆదినారాయణరెడ్డి తనయుడు సుధీర్రెడ్డి సహా దేవగుడి గ్రామంలో ఏకంగా 35 మందిపై జమ్మలమడుగు పోలీసులు రౌడీషీట్ తెరిచారు. వీరంతా వైకాపాకు చెందినవారు కావడం విశేషం. ఇదేవిధంగా మైదుకూరు శాసనసభ్యుడు రఘురామిరెడ్డి తనయుడు నాగిరెడ్డితోపాటు మరో అయిదుగురిపై రౌడీషీట్ తెరవాలని ఓ తెదేపా నేత నుంచి పోలీసులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి ఉన్నట్లు ఇవాళ ఒక దినపత్రిక పేర్కొంది. ఎన్నికల సమయంలో జరిగిన ఘటనలను ఆధారంగా చేసి వీరిపై రౌడీషీట్ తెరిచినట్లు సమాచారం. ఓ వ్యక్తిపై […]పూర్తి వివరాలు ...
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కడప జిల్లా పర్యటన రద్దయింది. ఈనెల 14న రైల్వేకోడూరు, కమలాపురం నియోజకవర్గాల్లో జరిగే జన్మభూమి- మా ఊరు కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొనాల్సి ఉంది. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. సభాస్థలి, హెలిప్యాడ్ స్థలాలను ఖరారు చేశారు. జిల్లా అధికారులు, టీడీపీ నేతలు చంద్రబాబు పర్యటనను విజయవంతం చేసేందుకు సిద్ధమయ్యారు. బాబు పర్యటనలో జిల్లాపై వరాలజల్లులు కురిపిస్తారని మంత్రి రావెల కిశోర్బాబు చెప్పారు. అయితే హుద్హుద్ తుఫాన్ కారణంగా వైజాగ్, […]పూర్తి వివరాలు ...
కడప: వైఎస్ఆర్ జిల్లాకు రావలసిన పరిశ్రమలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడ్డుకుంటున్నారని వైకాపా శాసనసభ్యుడు గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. ఆదివారం వైకాపా జిల్లా అధ్యక్షుడు అమర్నాద్, కడప మేయర్ సురేష్ బాబులతో కలిసి ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… కడప విమానాశ్రయ ప్రారంభోత్సవం ఎందుకు ఆపారో తక్షణమే చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. 1985లోనే కడప విమానాశ్రయంలో 20 సీట్లున్న వాయుదూత్ విమానం దిగేదని, ఇప్పుడు ఆ సీట్ల గల విమానం కూడా దిగేందుకు […]పూర్తి వివరాలు ...
కడప విమానాశ్రయం ప్రారంభం మళ్ళా వాయిదా పడింది. ఈ నెల 14న ప్రారంభమవుతుందని ప్రచారం జరగడం, అధికార పార్టీ నేతలు కూడా పోటీపడి ఆ మేరకు ప్రకటనలు చేయడం, మీడియాలో కూడా ఈ వార్తలు ఊపందుకోవడంతో ఈ సారి తప్పక ప్రారంభమవుతుందని అంతా ఆశించారు. ఈ మేరకు విమానాశ్రయంలో సన్నాహాలు కూడా చేశారు. ప్రారంభ ఏర్పాట్లకు సంబంధించి రెండు మూడు రోజులుగా రెండు మూడు లక్షల రూపాయల మొత్తాన్ని కూడా ఖర్చు చేశారు. తీరా శుక్రవారం విమానాశ్రయ […]పూర్తి వివరాలు ...
కోడూరు: ఒకప్పుడు మత్స్యకారుల గ్రామంగా ఉన్న విశాఖపట్టణంలో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయడంతో అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు సాధించిందని అదేస్థాయిలో కడపలోనూ ఉక్కు కర్మాగారాన్ని నిర్మించి జిల్లా స్వరూపాన్నే మార్చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పథకరచన చేస్తున్నట్లు జిల్లాకు ఇంచార్జిగా వ్యవహరిస్తున్న రాష్ట్ర సాంఘిక, సంక్షేమశాఖ మంత్రి రావెల కిషోర్బాబు పేర్కొన్నారు. రైల్వేకోడూరు నియోజకవర్గంలో గురువారం నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ.. పదేళ్లపాటు రాష్ట్రాన్ని పరిపాలించిన గత పాలకులు కడప జిల్లాతో పాటు రాష్ట్రాన్ని కూడా భ్రష్టుపట్టించారన్నారు. […]పూర్తి వివరాలు ...
కడప: ఇటీవల అయిదు మృతదేహాలు లభ్యమై రాష్ట్రవ్యాప్తంగా సంచలనానికి వేదికైన జియోన్ పాఠశాల గుర్తింపును జిల్లా విద్యాశాఖ రద్దు చేసింది. పిల్లలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా వారిని సమీప పాఠశాలల్లో సర్దుబాటు చేసే దిశగా ఆలోచనలు చేస్తోంది. సంఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే ఆ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు నష్టం కల్గించకుండా నిర్ణయం తీసుకోవాలని పాఠశాల విద్య ఆర్జేడీ సి.హెచ్.రమణకుమార్, డీఈవో అంజయ్య చర్చించి పాఠశాల విద్య సంచాలకులు ఉషారాణి దృష్టికి తీసుకువెళ్లారు. ఈ మేరకు పాఠశాల […]పూర్తి వివరాలు ...
కడప: ప్రపంచ మానసిక ఆరోగ్య దినం సందర్భంగా శుక్రవారం యోగివేమన విశ్వవిద్యాలయం ప్రాంగణంలో మనోవిజ్ఞానశాస్త్ర శాఖ అవగాహన సదస్సు నిర్వహిస్తోంది. సాయంత్రం 3 గంటలకు విశ్వవిద్యాలయంలోని సర్.సి.వి.రామన్ సెమినార్ హాల్లో జరిగే సదస్సునకు ప్రముఖ మానసిక వైద్యులు డాక్టరు అశోక్కుమార్, డాక్టరు వెంకట్రాముడు హాజరవుతున్నారు. ఆసక్తి కలవారు హాజరుకావాలని విశ్వవిద్యాలయ అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.పూర్తి వివరాలు ...
కడప: ఈనెల 14న కడపజిల్లాకు వస్తున్న ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబు కడప విమానాశ్రయాన్ని ప్రారంభిస్తారని రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ చెప్పారు. నగరంలోని రాష్ట్ర అతిథి గృహంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన చంద్రబాబు పర్యటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. తొలుత తిరుపతి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి రైల్వేకోడూరుకు ఉదయం 10.30 గంటలకు చేరుతారన్నారు. ఓబన్నపల్లెలో ఏర్పాటు చేసిన జన్మభూమి-మావూరు, ఇతర కార్యక్రమాల్లో దాదాపు రెండున్నర గంటల పాటు చంద్రబాబు పాల్గొంటారు. అనంతరం హెలికాప్టర్లో […]పూర్తి వివరాలు ...