వార్తా విభాగం

రాజకీయాలు

వదలని హైటెక్ వాసనలు

కడపలో ఐటీ పరిశ్రమను ఏర్పాటు చేసి ఐటీహబ్‌గా మార్చడంతో పాటు స్మార్ట్‌సిటీగా కడపను తయారు చేస్తానని తెదేపా అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం మున్సిపల్ గ్రౌండ్‌లో జరిగిన ప్రజాగర్జన లో బాబు మాట్లాడుతూ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులన్నీ త్వరితగతిన పూర్తి చేసి ప్రతి ఎకరాకు నీరందిస్తానన్నారు. హైదరాబాద్‌ను తలదన్నేలా కడపను అభివృద్ధి చేసి హైటెక్‌సిటీని నిర్మిస్తామన్నారు. ఇక్కడ చదువుకున్న వారికి కడపలోనే ఉద్యోగాలు ఇచ్చేలా చేస్తానన్నారు. ఎందరో మహానీయులు జన్మించిన గడ్డ కడప, ఇలాంటి తులసి వనంలో […]పూర్తి వివరాలు ...

వార్తలు

మొదటి దశలో 80.40 శాతం పోలింగ్

స్థానిక (ఎంపీటీసీ, జెడ్పీటీసీ) ఎన్నికల మొదటి దశ పోరులో జిల్లాలోని మైదుకూరు, బద్వేలు, రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాల్లోని 29 మండలాల పరిధిలో 29 జెడ్పీటీసీ, 326 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరిగింది. ఉదయం 7గంటల నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. జిల్లా వ్యాప్తంగా 80.40 శాతం పోలింగ్ నమోదైంది. బ్యాలెట్ పేపర్ల ద్వారా పోలింగ్ నిర్వహించారు. ఉదయం మందకొడిగా సాగిన పోలింగ్ 9 గంటల తర్వాత ఊపందుకుంది.పూర్తి వివరాలు ...

వార్తలు

స్థానిక ఎన్నికల పోలింగ్ ప్రారంభం

జిల్లా వ్యాప్తంగా స్థానిక సంస్థల తొలి విడత సమరం ప్రారంభమైంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ఆదివారం ఉదయం 7 గంటలకు ఆరంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. స్థానిక ఎన్నికలను బ్యాలెట్‌ పద్దతిలో నిర్వహిస్తున్నారు. జెడ్పీటీసీకి తెలుపు రంగు‌, MPTC గులాబి రంగు బ్యాలెట్‌ పత్రాలను వాడుతున్నారు. రాయచోటి మండలం అబ్బవరంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలింగ్ కేంద్రం వద్ద వైకాపా, తెదేపా కార్యకర్తలు తోపులాటకు దిగడంతో ఘర్షణ జరిగింది. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని […]పూర్తి వివరాలు ...

రాజకీయాలు

తొలివిడత స్థానిక ఎన్నికలు ఈ పొద్దే!

తొలివిడత జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఆదివారం జరుగనున్నాయి. 29 మండలాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఎంపీటీసీ బరిలో 1055 మంది, జడ్పీటీసీ బరిలో 144 మంది అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మొత్తం 29 జడ్పీటీసీ స్థానాలకు, 326 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. 8,05,681 మంది పల్లె ఓటర్లు ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. ఐదు నియోజకవర్గాల పరిధిలో ఎన్నికలు జరుగుతున్నాయి. బద్వేల్, అట్లూరు, గోపవరం, బికోడూరు, కలసపాడు, పోరుమామిళ్ళ, కాశినాయన, మైదుకూరు, బీమఠం, దువ్వూరు, […]పూర్తి వివరాలు ...

రాజకీయాలు

బాబు గారి స్వర్ణాంధ్ర ఇదే …. పాలగుమ్మి సాయినాద్

చంద్రబాబు తొమ్మిదేళ్ళ పాలనలో ఆంధ్రప్రదేశ్ దుస్థితిని గురించి ‘ది హిందూ’ రెసిడెంట్ ఎడిటర్ పాలగుమ్మి సాయినాద్ వ్యాఖ్యలు  మీ కోసం … విద్య, వైద్యం, వ్యవసాయం, ఉపాధి ఇలా సకల రంగాలలో బాబు గారి గోబెల్ ప్రచారాన్ని ఎండగట్టిన ప్రసంగం…పూర్తి వివరాలు ...

ప్రత్యేక వార్తలు

ఒంటిమిట్టలో కృష్ణంరాజు

భాజపా రాష్ట్ర నాయకుడు, సీనియర్ సినీ నటుడు కృష్ణంరాజు గురువారం ఒంటిమిట్ట కోదండరామాలయాన్నీ సతీసమేతంగా సందర్శించారు. ఆయనకు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా ఆయన స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు చేయించారు. ఆలయ అధికారులు పూలమాల, దుశ్శాలువాలతో కృష్ణంరాజు దంపతులను సత్కరించారు. అనంతరం కడపలోని అమీన్‌పీర్ (పెద్ద ) దర్గాను  దర్శించుకున్నారు. భార్య శ్యామలాదేవితో కలసి ఆయన దర్గాలోని ప్రధాన మజార్ వద్ద ప్రార్థనలు చేశారు. దర్గా ప్రాంగణంలోని ఇతర […]పూర్తి వివరాలు ...

ప్రత్యేక వార్తలు

కడపలో బాలయ్య

లెజెండ్ సినిమా విజయ యాత్రలో భాగంగా బాలయ్య, చిత్ర యూనిట్ తో కలిసి గురువారం కడపకు వచ్చారు. సాయంత్రం 4 గంటలకు ఆయన రవి  థియేటర్ వద్దకు రాగానే అభిమానులు ఈలలు, కేకలు వస్తూ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులనుద్దేశించి మాట్లాడారు. బాలయ్య కోసం ప్రత్యేక కథను రూపొందించి సినిమాను విడుదల చేసినట్లు దర్శకుడు బోయపాటి శ్రీను తెలిపారు.థియేటర్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై బాలయ్య ప్రసంగిస్తున్నంత సేపు అభిమానుల ఈలలు, కేకలతో థియేటర్ ప్రతిధ్వనించింది. […]పూర్తి వివరాలు ...

రాజకీయాలు

7న కడపకు బాబు

తెదేపా అధినేత చంద్రబాబు ప్రజాగర్జన సభ కోసం 7న జిల్లాకు రానున్నారు. ఈ మేరకు చంద్రబాబు పర్యటన వివరాలు జిల్లా నాయకత్వానికి అధిష్ఠానం సమాచారం అందించింది. గతంలో మార్చి 27న నిర్వహించాలని ముందుగా భావించినా వాయిదా వేశారు. చంద్రబాబునాయుడు ప్రజాగర్జనను కడపలో ఏ మైదానంలో నిర్వహించాలి అనే అంశాన్ని జిల్లా కేంద్రంలోని నేతలు పరిశీలిస్తున్నారు. జిల్లాలో పార్టీ వ్యవహారాలు చూస్తున్న రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ కూడా చంద్రబాబు పర్యటనపై జిల్లా నేతలతో మాట్లాడినట్లు సమాచారం. ప్రజాగర్జనకు భారీగా […]పూర్తి వివరాలు ...