కడప: సయ్యద్ నజీం అలీ షామిరిని కడప నగర ఖాజీగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కడప జిల్లా కలెక్టర్ కెవి రమణ ప్రతిపాదన మేరకు సయ్యద్ నజీం అలీ షామిరిని కడప నగర ఖాజీగా నియమిస్తున్నట్లు మైనారిటీ సంక్షేమ శాఖ అధికారులు మే 28న విడుదల చేసిన జీవో నంబరు 65లో పేర్కొన్నారు. 1880 నాటి ఖాజీల చట్టాన్ని అనుసరించి సయ్యద్ నజీం అలీ షామిరి మూడు సంవత్సరాల పాటు కడప నగర […]పూర్తి వివరాలు ...
ప్రొద్దుటూరు: మైదుకూరు పట్టణంలో ఒక సామాజిక వర్గానికి చెందిన వారిపై దాడి చేసి గాయపరచిన కేసు(క్రైం నెంబరు 97/2013)లో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న 35మందిని ఐపిసిలోని 147,148,448,427,324,379,307,153-A, 143 రెడ్ విత్ 149 సెక్షన్లతో పాటుగా మారణాయుధాల చట్టం, క్రిమినల్ లా సవరణ చట్టాల కింద విచారించేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. ఇందుకు సంబంధించి 2014లో డీజీపి రాసిన లేఖను అనుసరించి హోం శాఖ జీవో నెంబరు RT 611ను మే 26న విడుదల […]పూర్తి వివరాలు ...
జూన్ 7న తొలి విమాన సర్వీసు టికెట్ ధర రూ.1234 కడప: కడప – బెంగుళూరు నగరాల మధ్య వారానికి రెండు సార్లు విమానాన్ని నడిపేందుకు ఎయిర్ పెగాసస్ విమానయాన సంస్థ సిద్ధమైంది. కేంద్రవిమానయాన శాఖ అధికారులు ప్రతిపాదించిన ప్రకారం 7న కడప విమానాశ్రయం ప్రారంభమైతే ఆ రోజు నుంచే విమానాలు నడిపేందుకు ఎయిర్ పెగాసస్ సంస్థ సిద్ధమైంది. మొదటి విమానం జూన్ 7వ తేదీ ఉదయం 10 గంటల 40 నిముషాలకు బెంగుళూరు నుండి బయలుదేరి […]పూర్తి వివరాలు ...
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి పి.అశోక్గజపతి రాజుతో, ఏఏఐ అధికారులతో మే 19న డిల్లీలో సమావేశమైన రాష్ట్ర పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, ఇంధన శాఖ కార్యదర్శి అజయ్ జైన్ వారంలో కడప విమానాశ్రయంలో ట్రయల్ రన్ నిర్వహిస్తామని, అనంతరం ఒక వారంలో కడప నుంచి విమానాలు నడుస్తాయని పత్రికలకు చెప్పారు. కడప విమానాశ్రయాన్ని ఏప్రిల్ 30న పరిశీలించిన ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) దక్షిణ ప్రాంత రీజినల్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ నరసింహమూర్తి మే 10 నుంచి […]పూర్తి వివరాలు ...
భగవదంకితబుద్ధులను ఏ దుష్టశక్తులూ నిలుపలేవు. భగవంతుని చేరడానికి పేర్కొన్న నవవిధ భక్తి మార్గాలలో వైరాన్ని ఆశ్రయించిన వారు శిశుపాల హిరణ్యకసిపాదులు. వైకుంఠవాసుడు ఆ దుష్టశక్తులను సంహరించి తన సాధుసంరక్షకత్వాన్ని చాటినాడు. అన్నమయ్య తన సంకీర్తన తపస్సును భంగపరిచే దుష్ట రాజకీయ శక్తులను నిర్మూలించమని వేంకటగిరి నృశింహుని ఇలా వేడుకుంటున్నాడు…. Your browser does not support the audio element. సంకీర్తన వినడానికి పైనున్న ప్లే బటన్ నొక్కండి… నరసింహ రామకృష్ణ నమో శ్రీవేంకటేశ సరుగ నా(నా) […]పూర్తి వివరాలు ...
ప్రత్యేకత: భూమిలోపల ఇంద్రభవనాన్ని తలపించే సహజసిద్ధ దృశ్యాలు, నీటిధారకు స్ఫటికలింగంలా మారిన రాళ్లు, నీటి చుక్కల ధార – రెండువేల ఏళ్ల కిందట ఆదిమమానవుడు నివసించిన ఈ కుందిలిచెర్లోపల్లె బిలం సొంతం. బిలం లోపలికి ఇలా వెళ్ళాలి: ప్రారంభంలో బండరాళ్లను దాటుకొని లోపలికి వెళ్లాలి. 10 మీటర్లు లోనికి వెళ్లిన తర్వాత ఎత్తుభాగం నుంచి కిందికి దిగాలి. అక్కడి నుంచి రెండు మీటర్లు నేలమీద పాకుతూ వెళ్లాలి. 600 మీటర్లు లోనికి వెళితే నీటి చుక్కధారలు కిందికి పడుతున్న దృశ్యాలు […]పూర్తి వివరాలు ...
అందమైన ఆ పల్లె పిల్ల ఆకు వేసి, తమ్మ పుక్కిట పెట్టి చెంగావి రంగు సీర కట్టుకొని బుంగ తీసుకుని ఒయ్యారంగా నడుస్తూ నీటి కోసం ఏటికి వచ్చింది. ఏటి దగ్గర ఒక కొంటె కోనంగి సరదాపడి రాయి విసిరినాడు. ఆ రాయి గురి తప్పి ఆ గడుసు పిల్ల కడవకు తగిలి అది పగిలిపోయింది. ఆ పిల్ల రాయి విసిరిన పిల్లగాడిని నిలేసి ఇలా అడుగుతోంది… వర్గం: యాలపాట పాడటానికి అనువైన రాగం: ఆనందభైరవి స్వరాలు […]పూర్తి వివరాలు ...
కడప: వైఎస్ఆర్ జిల్లాకు కడప జిల్లాగానే పేరు మార్చాలని ఆదివారం కడపలో జరిగిన తెదేపా మినీ మహానాడులో ఆ పార్టీ నేతలు తీర్మానించారు. కడపకు ఎంతో ఘనచరిత్ర ఉందని, జిల్లాలో ఎంతోమంది కవులు, కళాకారులు, మహనీయులు, పుట్టారని, అలాంటి వారి పేర్లను మరచి జిల్లాకు వైఎస్ఆర్ కడప జిల్లా అన్న పేరు పెట్టడం దురదృష్టకరమని పలువురు తెలుగుదేశం నాయకులు పేర్కొన్నారు. ఆదివారం జరిగిన మినీమహానాడులో నూతన అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి దృష్టికి ఈ అంశాన్ని తీసుకురాగా వైఎస్ఆర్ పేరు […]పూర్తి వివరాలు ...
98.54 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలోనే ప్రధమ స్థానం 484 మందికి పదికి పది జిపిఏ కడప : మూడేళ్లుగా ఉత్తీర్ణత శాతాన్ని గణనీయంగా పెంచుకుంటూ వచ్చిన కడప జిల్లా.. ఈ ఏడు పదవ తరగతి ఫలితాల్లో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. బుధవారం విడుదలైన ఫలితాల్లో జిల్లాకు చెందిన విద్యార్థులు 98.54 శాతం ఉత్తీర్ణత సాధించి కడప జిల్లాను ప్రధమ స్థానంలో నిలిపినారు. జిల్లా వ్యాప్తంగా 35,366 మంది పరీక్షలకు హాజరవ్వగా 34,848 మంది ఉత్తీర్ణులయ్యారు. దాంతో […]పూర్తి వివరాలు ...