పీసెట్లో మొదటి, ఆరవ ర్యాంకు మనోల్లకే..
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నబీపీఈడీ, యూజీడీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన పీసెట్ పరీక్ష ఫలితాలలో కడప జిల్లా వాసులు సత్తా చాటారు. బీపీఈడీలో రాష్ట్ర మొదటి ర్యాంకును కడప జిల్లా గోపవరానికి చెందిన దుత్తలూరు ప్రభావతి సాధించారు. యూజీడీపీఈడీ కోర్సులో 6వ ర్యాంకును లక్కిరెడ్డిపల్లి మండలం కుర్నూతలకు చెందిన గ్రంధం భారతి సాధించారని పీసెట్ కన్వీనర్ పాల్కుమార్ వెల్లడించారు.
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం మంగళవారం పీసెట్ ఫలితాలను విడుదల చేసింది.