కడప : అక్టోబరు 30 నుంచి యోవేవి అనుబంధ కళాశాలలలో డిగ్రీ బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఎం కోర్సులు చదువుతున్న విద్యార్థులకు సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
జిల్లావ్యాప్తంగా సుమారు 40 వేల మంది విద్యార్థులు సెమిస్టర్ పరీక్షలకు హాజరుకానున్నారు. 30న ప్రారంభమై నవంబరు 21 వరకు సెమిస్టర్ పరీక్షలు జరుగుతాయి.