Tags :ఉక్కు పరిశ్రమ

    అభిప్రాయం

    హైకోర్టు రాయలసీమలో ఎక్కడ? – రెండో భాగం

    రాయలసీమలో హైకోర్టు కుండల్లో నీళ్ళు పొరుగు జిల్లాలకు, మబ్బుల్లో నీళ్ళు కడపకు గ్రోత్ సెంటర్స్‌గా ఎంపిక చెయ్యడానికి రాయలసీమలో ఎక్కడైనా ఒకటే అనుకోవడం ఒక పద్ధతి (రాయలసీమలోనే జిల్లాల మధ్య అభివృద్ధిలో ఉన్న అంతరాల దృష్ట్యా, అలాగే విభజనానంతర అనుభవాల దృష్ట్యా కూడా నేను దీన్ని బలంగా వ్యతిరేకిస్తాను). అభివృద్ధిలో ఎక్కువ వెనుకబడిన జిల్లాలకు ఎక్కువ అవకాశాలు కల్పించాలనుకోవడం ఇంకొక పద్ధతి. రాయలసీమలో హైకోర్టు అంటే కర్నూల్లో హైకోర్టు అనే అభిప్రాయం ఒకటి బలంగానే వ్యాప్తిలో ఉంది. […]పూర్తి వివరాలు ...

    అభిప్రాయం

    మనకు జరగబోయే మరో మోసాన్ని ప్రతిఘటిద్దాం

    కడప జిల్లాకు ఉక్కు కర్మాగారం వస్తే ఇక్కడి జీవితాలకు కొంతైనా ఒక ఆదరువు, భరోసా లభించినట్లే. తరతరాలుగా దగాపడ్డ రాయలసీమ ఎన్నో కరువు, కాటకాలను చూసింది. రాయలసీమలో క్రిష్ణదేవరాయుల కాలంలో వజ్రాలను, వైడూర్యాలను రాసులుగా పోసి అమ్మేవారని విన్నాం. కానీ యిప్పుడు నీరులేక – పంటలు ఎండిపోయి కరువులతో జీవిస్తున్న రైతులు ఒకవైపు…చదివిన చదువుకు ఉద్యోగాలు వెతుక్కుంటూ వలసలు వెళ్ళే యువతరం ఒకవైపు..ఉపాధి లేక ఏమీ తోచని పరిస్థితులలో మధ్య వయస్కులు మరొక వైపు వున్న రాయలసీమను […]పూర్తి వివరాలు ...

    వార్తలు

    ఉక్కు పరిశ్రమ కోసం ‘అఖిల‌ప‌క్షం’ ఆందోళన

    కడప: విభజన చట్టంలో పేర్కొన్న విధంగా కడప జిల్లాలోనే ఉక్కుపరిశ్రమ ఏర్పాటు చేయాలంటూ అఖిలపక్షం ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం కడప విమానాశ్రయం వద్ద ఆందోళన చేపట్టారు. విమానాశ్రయంలో సమీక్షా సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును అడ్డుకునేందుకు యత్నించారు. అంతకు మునుపు సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆపార్టీ కార్యాలయంలో నిర్వహించిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో కడప జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి పర్యటనను అడ్డుకోవాలని తీర్మానం చేశారు. ఆందోళన కార్యక్రమానికి ముందుగా ఎయిర్‌పోర్టు వద్ద నాయకులు మీడియాతో మాట్లాడుతూ జిల్లాలోనే ఉక్కుఫ్యాక్టరీ […]పూర్తి వివరాలు ...

    రాజకీయాలు

    పోరాటం చేయకపోతే ఉక్కు పరిశ్రమ దక్కదు : అఖిలపక్షం

    ఓట్లు, సీట్లు ప్రాతిపదికన జిల్లాకు అన్యాయం చేస్తున్న ప్రభుత్వం వైకాపాను ఆదరించారనే అధికారపక్షం కక్ష కట్టింది కోస్తా వాళ్ళ ప్రాపకం కోసమే విపక్ష నేత మౌనం కడప : కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ సాధనకు జెండాలను పక్కనబెట్టి అన్ని రాజకీయ పక్షాలు కలిసి పోరాడాలని అఖిలపక్షం పిలుపునిచ్చింది. సోమవారం సీపీఎం జిల్లా కార్యాలయంలో ‘కడప ఉక్కు- రాయలసీమ హక్కు, ఉక్కు పరిశ్రమను తరలించడం అడ్డుకుందాం’ అనే అంశంపై ఆ పార్టీ రాష్ట్ర నేత బి నారాయణ అధ్యక్షతన […]పూర్తి వివరాలు ...

    రాజకీయాలు

    జంగారెడ్డిగూడెంను తెరపైకి తెచ్చింది రాష్ట్ర ప్రభుత్వమే : భాజపా

    పార్టీలకు అతీతంగా రాయలసీమ నాయకులు పోరాడాల్సిన అవసరం ఉంది కడప: కడప జిల్లా విషయంలో మొదటి నుంచీ వివక్ష చూపుతున్న రాష్ట్ర ప్రభుత్వమే ఉక్కు పరిశ్రమ ఇక్కడ ఏర్పాటు కాకుండా ఉండేందుకు పశ్చిమగోదావరి జిల్లాలోని జంగారెడ్డిగూడెం ఉక్కు పరిశ్రమ స్థాపనకు అనుకూలమైందనే వాదాన్ని తెరపైకి తీసుకొచ్చిందని తేటతెల్లమైంది. ఇదే విషయాన్ని జిల్లాకు చెందిన భాజపా నాయకులు విలేఖరుల సమావేశం పెట్టి మరీ ఉద్ఘాటించారు. ఆదివారం స్థానిక భాజపా జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భాజపా నాయకుడు […]పూర్తి వివరాలు ...

    రాజకీయాలు

    ఉక్కు పరిశ్రమను తరలిస్తే అడ్డుకుంటాం : సిపిఎం

    కడప: రాష్ట్ర విభజన సమయంలో కడప జిల్లాకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని కూడా రాష్ట్ర ప్రభుత్వం మరో ప్రాంతానికి తరలించాలనుకోవడం బాధాకరమని సీపీఎం రాష్ట్ర నాయకుడు నారాయణరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం స్థానిక సీపీఎం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ఇప్పటికే జిల్లాకు కేటాయించిన ఉర్దూ యూనివర్సిటీ, డీఆర్‌డీవో రక్షణ రంగం ప్రాజెక్టు ఇతర జిల్లాలకు తరలించారన్నారు. రాష్ట్ర విభజన సమయంలో జిల్లాలో సెయిల్ ఆధ్వర్యంలో ఉక్కు పరిశ్రమను […]పూర్తి వివరాలు ...

    రాజకీయాలు

    కడప జిల్లా అంటే ముఖ్యమంత్రికి చిన్నచూపు: రఘువీరా

    సీమ ప్రజలు అభద్రతా భావంలో ఉన్నారు ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కోసం రాజీలేని పోరాటం కడప: కడప జిల్లా అంటే ముఖ్యమంత్రికి చిన్నచూపని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆరోపించారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం ‘కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు’ అన్న అంశంపై సదస్సు నిర్వహించారు. సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరైన రఘువీరారెడ్డి మాట్లాడుతూ… కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కోసం కాంగ్రెస్ రాజీలేని పోరాటం చేస్తుందని, ఇందుకోసం ప్రజలతో మమేకమై […]పూర్తి వివరాలు ...

    రాజకీయాలు

    జిల్లా అభివృద్ధికి పోరుబాటే శరణ్యం: అఖిలపక్షం

    మొత్తానికి కడప జిల్లాకు చెందిన నాయకులు జిల్లా అభివృద్ది కోసం సమాలోచనలు సాగించడానికి సిద్ధమయ్యారు. ఈ దిశగా అఖిలపక్షం గురువారం కడపలో సమావేశం నిర్వహించింది. జిల్లా అభివృద్ది కోసము పోరాటాలు చేయాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులూ, రైతు సంఘాల నాయకులూ నొక్కి చెప్పారు. ఇది ఒక ముందడుగు… ఈ అడుగులు గమ్యం చేరే వరకు ఇలాగే సాగాలని జిల్లా ప్రజానీకం ఆకాంక్షిస్తోంది! కడప: రాయలసీమలో వెనుకబడిన కడప జిల్లాను అభివృద్ధి చేయాల్సిన ప్రభుత్వమే వివక్ష చూపుతోన్ననేపధ్యంలో […]పూర్తి వివరాలు ...

    అభిప్రాయం

    మనమింతే!

    DRDO వాళ్ళు ఎలెక్ట్రానిక్ వార్‌ఫేర్ లాబ్ నెలకొల్పడానికి ఒకేచోట 3,400 ఎకరాలు అవసరమై, ఏరికోరి కడప నగర శివార్లలోని కొప్పర్తిలో భూమి కావాలని కోరితే రాష్ట్రప్రభుత్వం ఇక్కడ భూమి ఇవ్వకుండా రాయలసీమలో ఇంకెక్కడైనా సరేనంటోంది. ఈ విషయంలో జోక్యంచేసుకుని, కొప్పర్తిలో కుదరకపోతే జమ్మలమడుగులోనైనా ఈ లాబ్ ఏర్పాటుచెయ్యమని రక్షణశాఖ మంత్రికి ఒక విన్నపం పంపేదానికి త్రివిక్రమ్ అనే ఆయన (ఈయన గతంలో కడపకు శివరామకృష్ణన్ కమిటీ వస్తోందని చివరి నిమిషంలో తెలిస్తే బెంగుళూరు నుండి అప్పటికప్పుడు వచ్చి […]పూర్తి వివరాలు ...