కడప: రెండు నెలల క్రితం అదృశ్యమైన నాగేశ్వరి, ఆమె కొడుకును భర్తే చంపేశాడని పోలీసులు ఎట్టకేలకు నిర్ధారించారు. రిమ్స్ సమీపంలోని అటవీ ప్రాంతం నుండి శవాలను శుక్రవారం పోలీసులు వెలికితీశారు. ఘటనస్థలంలోనే పోస్టుమార్టం చేశారు. పోలీసుల కథనం మేరకు…కడప మాసాపేటకు చెందిన నాగేశ్వరి అలియాస్ నీలిమా (37), కడప మరియాపురానికి చెందిన రాజాప్రవీణ్లకు 2003లో వివాహమైంది. వీరికి దివ్యవర్షిత, ప్రణీత్రాజ్(8)అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2015 డిశంబరు 12న నాగేశ్వరి అలియాస్ నీలిమా(37) ఆమె కొడుకు ప్రణ్త్రాజ్(8)లు […]పూర్తి వివరాలు ...
అది అనంతపురం జిల్లాలోని తాడిపత్రి…కరువుసీమ అయినా కురిసే ఆ కాస్త వర్షంతోనే సిరులు పండించగల రైతులు…బ్రిటిష్ వారు వేసిన మద్రాస్-బొంబాయి రైలు మార్గంలో ఉండే ఆ ఊరునుంచి ఎందరో వ్యాపారాలూ చేసారు…. ఆ ఊరునుంచి వచ్చిన మూలా నారాయణ స్వామి,పక్కనున్న కడప జిల్లాకు చెందిన బి.ఎన్.రెడ్డి తో కలిసి మద్రాస్ లో వాహినీ స్టుడియోస్ స్థాపించారు…ఆ తర్వాత ఆ తాడిపత్రిలోని పెన్నేటి ఇసుకలో ఆడుకుని madras presidensy college లో B.Sc(hons) Gold medalist K.పూర్తి వివరాలు ...
కడప లో సెక్యూరిటీ సర్వీసెస్ రాజా ప్రవీణ్ భార్య నాగేశ్వరి, 7ఏళ్ల కొడుకు గోల్డి గత డిసెంబర్ 10 వ తేది నుండి కనపడటం లేదు. నాగేశ్వరి@ నీలిమ M.A ,B.ed చేసింది. ఆమె తండ్రి retd. head constable వెంకట సుబ్బన్న. ఆయనకు నలుగురు కూతుర్లు,ఒక కొడుకు. అందరు ఉద్యోగస్తులే. నాగేశ్వరి పెళ్లి 2003 లో 2 లక్షల కట్నం, 10 తులాల బంగారు ఇచ్చి ఘనంగా చేసారు. కానీ సంసారం ఎపుడు గొడవలు, వేధింపులు, […]పూర్తి వివరాలు ...
ప్రొద్దుటూరు: శాస్త్రీయ దృక్పధంతో మూఢనమ్మకాలు లేని సమాజాన్ని నిర్మించాల్సిన అవసరం ఉందని అని జనవిజ్ఞాన వేదిక జిల్లా వ్యవస్థాపక నాయకులు, పట్టణ గౌరవాధ్యక్షుడు డా. డి. నరసింహా రెడ్డిఉద్ఘాటించారు. స్థానిక జనవిజ్ఞాన వేదిక కార్యాలయంలో జరిగిన సైన్సు ప్రయోగాత్మక శిక్షణా తరగతుల ముగింపు సమావేశం బుధవారం జరిగింది. శిక్షణా తరగతులలో భాగంగా బుధవారం విద్యార్థులకు మ్యాజిక్ పైన మెజీషియన్ సుజాన్ కుమార్ శిక్షణను యిచ్చారు. అనంతరం జనవిజ్ఞాన వేదిక క్యాలెండరు ను జెవివి నాయకులు విడుదల చేశారు. […]పూర్తి వివరాలు ...
కడప: జన్మభూమి – మా ఊరు కార్యక్రమంలో పాల్గొనడానికి ఈ రోజు (శనివారం) కడప జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆద్యంతం ప్రభుత్వ పథకాలను, ఘనతలను వల్లె వేయటానికి ప్రాధాన్యమిచ్చారు. గతంలో జిల్లాకు ఇచ్చిన హామీలను గానీ, వాటి పురోగతిని గాని వివరించేందుకు కనీస ప్రయత్నం చెయ్యలేదు. ఆలంఖాన్ పల్లెలో జరిగిన ‘జన్మభూమి – మా ఊరు’ గ్రామ సభలో పాల్గొనడానికి వచ్చిన ముఖ్యమంత్రి అంతకు ముందు 44 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించతలపెట్టిన హజ్ హౌస్ […]పూర్తి వివరాలు ...
కడప : కేంద్ర న్యాయశాఖ మంత్రి డీవీ సదానందగౌడ ఈరోజు జిల్లా పర్యటనకు వస్తున్నట్లు ఫ్యాక్స్ ద్వారా సమాచారం అందిందని డీఆర్వో సులోచన నిన్న ఓ ప్రకటనలో తెలిపారు. బెంగుళూరు నుంచి ఈరోజు (గురువారం) ఉదయం 10.30 గంటలకు పులివెందుల చేరుకుని రైతులతో ముఖాముఖి అవుతారు. అనంతరం మధ్యాహ్నం 2.30 గంటలకు ఎర్రగుంట్లలో ట్రేడ్ యూనియన్ కార్మికులతో, సాయంత్రం 4.30కు ప్రొద్దుటూరులో మహిళలు, యువకులతో, సాయంత్రం 6 గంటలకు వైద్యులు, వ్యాపారవేత్తలతో సమావేశమవుతారు. శుక్రవారం ఉదయం 7.30 […]పూర్తి వివరాలు ...
పచ్చచొక్కాలకే పక్కా ఇళ్ళా? చంద్రబాబును గెలిపించడం ప్రజల ఖర్మ మైదుకూరు: అర్హులు ప్రభుత్వ పథకాలు పొందాలంటే జన్మభూమి కమిటీ సభ్యుల కాళ్లు పట్టుకోవాల్సిన పరిస్థితి దాపురించిందని.. ఈ పరిస్థితి చూస్తుంటే కర్మపట్టి ప్రజలు చంద్రబాబును గెలిపించారనిపిస్తోందని మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఖాజీపేటలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో మంగళవారం జన్మభూమి మాఊరు గ్రామసభకు డీఎల్ హాజరయ్యారు. అధికారులు వేదికపైకి ఆహ్వానించినా.. ఆయన ప్రజల మధ్య కూర్చొని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ […]పూర్తి వివరాలు ...
ప్రొద్దుటూరు: విద్యార్థులకు సైన్సు ను ప్రయోగాత్మకంగానే శిక్షణ ఇచ్చినప్పుడే మంచి అవగాహన కలుగుతుందని జనవిజ్ఞాన వేదిక చెకుముకి కన్వీనర్ జి,టి.ఈశ్వరయ్య ఆన్నారు . స్థానిక శ్రీరాములపేటలోని CRC భవనంలో ఆదివారం ఉదయం విద్యార్థులకు సైన్సు ను ప్రయోగాత్మకంగా వివరించే కార్యక్రమం చేపట్టారు. బోధకులుగా సైన్సు ఉపాద్యాయులు శివ మాధవ రెడ్డి , రసాయన శాస్త్ర అధ్యాపకులు ఐఎల్ కుమార్ పాల్గొన్నారు. రసాయన శాస్త్రం లోని ద్రావణాల రకాలు , సజాతీయ , విజాతీయ , సంత్రుప్త , […]పూర్తి వివరాలు ...
బద్వేలు: శాసనసభకు హాజరుకాని తనను ఎలా సస్పెండ్ చేస్తారని వైఎస్సార్ జిల్లా బద్వేలు శాసనసభ్యుడు తిరువీధి జయరాములు ప్రశ్నించారు. ఐదు రోజుల క్రితం అయ్యప్పస్వామి దర్శనం కోసం శబరిమలై వెళ్లిన ఆయన శనివారం సాయంత్రం పోరుమామిళ్లలోని తన నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ తాను ఐదు రోజుల క్రితం శబరిమలైకి వెళ్లానని అందువల్ల అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాలేకపోయానన్నారు. అయినా ఈనెల 18న తాను అసెంబ్లీలో ఉన్నట్లు ప్రకటించి స్పీకర్ తనను కూడా సస్పెండ్ చేశారన్నారు. […]పూర్తి వివరాలు ...