కడప విమానాశ్రయం ఈనెల 14న ప్రారంభం కానుందని ఈ మేరకు విశ్వసనీయ సమాచారం అందిందని ఒక దినపత్రిక ఇవాళ కథనాన్ని ప్రచురించింది. నగరం నుండి విమానాశ్రయానికి దూరాన్ని సూచిస్తూ సూచికలు ఏర్పాటు చేయటం కూడా ఇందుకు నిదర్శమని ఆ పత్రిక పేర్కొంది. ఆ కథనం ప్రకారం ‘విమానాశ్రయం ప్రారంభానికి సంబంధించిన ఏర్పాట్లను చేపట్టాలని విమానాశ్రయ అధికారులను జిల్లా కలెక్టర్ సూచించినట్లు కూడా సమాచారం. జిల్లా కలెక్టరుకు ప్రభుత్వం నుంచి విమానాశ్రయం 14న ప్రారంభించనున్నట్లు మౌఖిక సమాచారం అందినట్లు తెలుస్తోంది. […]పూర్తి వివరాలు ...
రాజంపేట: కడప జిల్లాలో ప్రభుత్వం 30వేల పింఛన్లు తొలగించిందని వైకాపా జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథ్రెడ్డి ఆరోపించారు. రాజంపేటలో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రజల్ని మభ్య పెట్టేందుకే ప్రభుత్వం జన్మభూమి-మాఊరు కార్యక్రమాన్ని ప్రభుత్వం మళ్లీ తెరపైకి తెచ్చిందని పేర్కొన్నారు. జన్మభూమికి కేటాయించిన నిధులు మంత్రులు, అధికారులు తిరిగేందుకే సరిపోతాయన్నారు. రుణమాఫీ అంటూ రైతులను, డ్వాక్రా మహిళలలను బురిడీ కొట్టించారన్నారు. ఎన్నో ఆశలతో అధికారంలో కూర్చోబెట్టిన జనాన్ని నట్టేట ముంచడమే ధ్యేయంగా టీడీపీ ప్రభుత్వం పని […]పూర్తి వివరాలు ...
కడప: భవిష్యత్లో కడప జిల్లా కేంద్రంగా అంతర్జాతీయ స్థాయిలో ఈత పోటీలు నిర్వహించడానికి వీలుగా అన్ని సదుపాయాలతో కూడిన ఈతకొలనును వైఎస్సార్ ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేయనున్న ట్టు నగర మేయర్ కె. సురేష్బాబు, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు సీఆర్ఐ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన ఈతకొలను నిర్మాణ పనులు చేపట్టడానికి సోమవారం ఉదయం ఇండోర్ స్టేడియం ప్రాంగణలో భూమి పూజ చేపట్టనున్నారు. ఇందుకు సంబందించి ఆదివారం మేయర్ సురేష్బాబు, సీఆర్ఐ […]పూర్తి వివరాలు ...
జన్మభూమి గ్రామసభల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈనెల 12, 13వ తేదీల్లో జిల్లాలో పర్యటించనున్నారని మంత్రి రావెల కిశోర్బాబు తెలిపారు. ఆదివారం స్టేట్ గెస్ట్హౌస్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ… ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రామసభల్లో కడప జిల్లాపై వరాలజల్లును కురిపిస్తారని మంత్రి చెప్పారు. ఉక్కు ఫ్యాక్టరీ, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు, టెక్స్టైల్ పార్కు, గాలేరు-నగిరి ప్రాజెక్టు, రైల్వేలైన్ల నిర్మాణం చేపడతామన్నారు. ముఖ్యమంత్రి ప్రకటనతో కడప జిల్లా ముఖచిత్రమే మారిపోనుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్లను అందిస్తామన్నారు. 27 వేల పెన్షన్లపై […]పూర్తి వివరాలు ...
కడప యోగివేమన విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్ర అధికారి లక్ష్మీప్రసాద్ను దూషించినందుకు తెదేపా నేత, బసవరామతారకం న్యాయ కళాశాల అధిపతి ఎస్.గోవర్ధనరెడ్డిపై పెండ్లిమర్రి పొలీసు స్టేషనులో 506 సెక్షన్ కింద కేసు నమోదైంది. యోగివేమన విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్ర అధికారి, బాధ్య కులసచివులు ఆచార్య సాంబశివారెడ్డి, సహాయ పరీక్షల నియంత్రణ అధికారి లక్ష్మీప్రసాద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. పొలీసులు, ఫిర్యాదుదారుల వివరాల మేరకు పది రోజుల కిందట గోవర్ధన్రెడ్డి ఫోన్లో సహాయ పరీక్షల నియంత్రణ అధికారి లక్ష్మీప్రసాద్ను […]పూర్తి వివరాలు ...
పులివెందుల: పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల (మెయిన్), రమణప్ప సత్రం, మైదానాల్లో సోమవారం పన్నెండేళ్ళ లోపు బాలబాలికల (అండర్-12) అఖిల భారత ఛాంపియన్షిప్ టెన్నిస్ టోర్నీ ప్రారంభమైంది. అక్టోబర్ 3తేదీ వరకు జరిగనున్న ఈ పోటీలను ప్రముఖ చిన్నపిల్లల వైద్యుడు డాక్టర్ ఈ.సి.గంగిరెడ్డి ప్రారంభించారు. టోర్నీలో పాల్గొనేందుకు చెన్నై, బెంగళూరు, కొయంబత్తూరు, విశాఖపట్టణం, శివకాశి, హైదరాబాద్, కేరళ తదతర ప్రాంతాల నుంచి 50 మందికి పైగా క్రీడాకారులు తరలివచ్చారు. పారిశ్రామికవేత్త గంగాధర, స్వామి వివేకానంద పాఠశాల అధిపతి సోమశేఖర్రెడ్డి […]పూర్తి వివరాలు ...
వర్ధమాన సినీకథానాయకుడు సాయిధరమ్తేజ్ సోమవారం పెద్దదర్గాను దర్శించి ప్రార్థనలు చేశారు. దర్గామహత్యం విని ఇక్కడి వచ్చానన్నారు. దర్గా ప్రతినిధులైన అమీర్ను అడిగి దర్గా విషయాలు తెలుసుకున్నారు. గురువుల ఆశీస్సుల కోసం వచ్చినట్లు తెలిపారు. ఆయన నటించిన రేయ్, పిల్లానీవులేని జీవితం సినిమాలు విడుదల కావలసి ఉంది. సాయిధరమ్తేజ్ ప్రముఖ నటుడు చిరంజీవి మేనల్లుడు.పూర్తి వివరాలు ...
ఇడుపులపాయ: ట్రిపుల్ఐటి విద్యార్థులకు దసరా సెలవులు ప్రకటించారు. ఈనెల 28వ తేదీ నుంచి అక్టోబర్ 6వ తేదీ వరకు సెలవులు ఇవ్వడంతో శనివారం రాత్రి విద్యార్థులందరు స్వగ్రామాలకు పయనం అయ్యారు. ట్రిపుల్ఐటి నుంచి వివిద దూర ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు నడిపారు.పూర్తి వివరాలు ...
కడప: పర్యాటక అభివృద్ధికి జిల్లాలో అనేక ఆదాయ వనరులు ఉన్నాయని, జిల్లా సంస్కృతిని అందరికీ తెలపాలని ఏజేసీ ఎం.సుదర్శన్రెడ్డి పేర్కొన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం ఏపీ టూరిజం హోటల్, జిల్లా పర్యాటక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో హరిత హోటల్ ప్రాంగణంలో పర్యాటక ఫొటో ఎగ్జిబిషన్ నిర్వహించారు. పెన్నెటి పబ్లికేషన్ ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనను సైతం ఆయన పరిశీలించారు. ఎగ్జిబిషన్ ప్రారంభించి తిలకించిన ఏజేసీ ఈ సందర్బంగా మాట్లాడుతూ జిల్లా సంస్కృతిని విద్యార్థులకు తెలిపే విధంగా […]పూర్తి వివరాలు ...