కడప నగర పరిధిలోని పుట్లంపల్లెలో 11.6 ఎకరాల్లో రూ. 8 కోట్లతో కడప క్రికెట్ స్టేడియం ( వైఎస్ రాజారెడ్డి–ఏసీఏ క్రికెట్ మైదానం) ఏర్పాటైంది. ఆంధ్ర క్రికెట్ అసోషియేషన్ ఆధ్వర్యంలో ఈ మైదానం నిర్మితమైంది. 2007లో అప్పటి ముఖ్యమంత్రి డా. వైఎస్ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేయడంతో పాటు ఆయన తండ్రి రాజారెడ్డి జ్ఞాపకార్థం రూ.50 లక్షల మూలనిధిని ఈ స్టేడియం నిర్మాణం కోసం అందజేశారు. దీంతో 2009లో ప్రారంభమై 2011 నాటికి మైదానం అందుబాటులోకి వచ్చింది. కడప […]పూర్తి వివరాలు ...
కడప జిల్లాలోని దర్శనీయ స్థలాలు, పర్యాటక ఆకర్షణల వివరాలు. కడప జిల్లాలోని పర్యాటక ప్రదేశాలకు వెళ్లే మార్గాల వివరాలు.
ప్రత్యేకత: భూమిలోపల ఇంద్రభవనాన్ని తలపించే సహజసిద్ధ దృశ్యాలు, నీటిధారకు స్ఫటికలింగంలా మారిన రాళ్లు, నీటి చుక్కల ధార – రెండువేల ఏళ్ల కిందట ఆదిమమానవుడు నివసించిన ఈ కుందిలిచెర్లోపల్లె బిలం సొంతం. బిలం లోపలికి ఇలా వెళ్ళాలి: ప్రారంభంలో బండరాళ్లను దాటుకొని లోపలికి వెళ్లాలి. 10 మీటర్లు లోనికి వెళ్లిన తర్వాత ఎత్తుభాగం నుంచి కిందికి దిగాలి. అక్కడి నుంచి రెండు మీటర్లు నేలమీద పాకుతూ వెళ్లాలి. 600 మీటర్లు లోనికి వెళితే నీటి చుక్కధారలు కిందికి పడుతున్న దృశ్యాలు […]పూర్తి వివరాలు ...
రాష్ర్టవిభజన నేపథ్యంలో భద్రాచల రామాలయం తెలంగాణ రాష్ట్ర పరిధిలోకి వెళ్లడంతో ఆంధ్రప్రదేశ్లో శ్రీరామనవమి వేడుకలను అధికార లాంఛనాలతో కడప జిల్లా ఒంటిమిట్ట కోదండరామాలయం వేదికగా నిర్వహించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఆ ఆలయ విశేషాల పట్ల తెలుగువారిలో సహజంగానే ఆసక్తి నెలకొంది. ఆధ్యాత్మికంగా, చారిత్రకంగా ఎన్నో విశిష్టతలను సంతరించుకున్న ఈ రామాలయం వివరాలు… కడప నుంచి తిరుపతికి వెళ్లే ప్రధానమార్గంలో కడపకు 24 కి.మీ. దూరంలో మండలకేంద్రం ఉంది. ఈ గ్రామం త్రేతాయుగం నాటిదని స్థలపురాణం వివరిస్తోంది. […]పూర్తి వివరాలు ...
ఒంటిమిట్ట కోదండరామాలయంలో జరిగే పూజలు, సేవలలో పాల్గొనాలనుకునే భక్తుల కోసం …. శాశ్వత పూజా వివరములు: నైవేద్య పూజ రూ 500 శాశ్వత అభిషేకం రూ 1116 పుష్ప కైంకర్యం రూ 1500 అన్నదానం రూ 2500 బ్రహ్మోత్సవ సమయములో పగటి ఉత్సవము రూ 15000 రాత్రి ఉత్సవము రూ 25000 సేవా టికెట్ల వివరములు అర్చన 10-00 కుంకుమార్చన 20-00 సహస్రనామార్చన 30-00 కేశఖండన 10-00 అభిషేకం 150-00 అంతరాలయ దర్శనం 50-00 వివాహ కట్టడి […]పూర్తి వివరాలు ...
కడప (ఆంగ్లం: Kadapa లేదా Cuddapah, ఉర్దూ: کڈپ ), వైఎస్ఆర్ జిల్లా యొక్క ముఖ్య పట్టణము, రాయలసీమలోని ఒక ప్రముఖ నగరము. మూడు వైపులా నల్లమల అడవులు, పాలకొండలతో కడప నగరం చూడముచ్చటగా ఉంటుంది. కడప నగరం యొక్క పాలన ‘కడప నగర పాలక సంస్థ’ పరిధిలో జరుగుతుంది. కడప పేరు వెనుక కథ: కడప జిల్లా గెజిటీరులో కడప పేరును 18వ శతాబ్ది వరకూ కుర్ప (Kurpa/Kurpah) అనే రాసేవాళ్ళని స్పష్టంగా ఉంది. ఇది కృప […]పూర్తి వివరాలు ...
కడప జిల్లాలోని వివిధ పర్యాటక ఆకర్షణలు : కోటలు: గండికోట (విశేషం : కొండకు పెన్నానది గండికొట్టిన చోట నిర్మించిన కోట. ఇక్కడ ఏర్పడిన లోయకు The Grand Canyon of India అనిపేరు), సిద్ధవటంకోట (విశేషం : మట్లిరాజుల స్థావరం, కడప జిల్లా తొలి పాలనాకేంద్రం). విహారప్రాంతాలు: గుంజన జలపాతం, గుండాలకోన, తుమ్మలబైలు, సోమశిల వెనుక జలాలు, గండికోటలోని పెన్నాలోయ, మైలవరం జలాశయం, బ్రహ్మంసాగర్ జలాశయం, ఆదినిమ్మాయపల్లె ఆనకట్ట, రైల్వేకోడూరులోని ఎర్రచందనం పార్కు, ఇడుపులపాయలోని ఎకోపార్కు, నెమళ్ళ పార్కు, కడప నగరంలోని శిల్పారామం, రాజీవ్ స్మృతివనం. పుణ్యక్షేత్రాలు: అద్వైత: పుష్పగిరి దేవాలయాలు (విశేషం: […]పూర్తి వివరాలు ...
ఒంటిమిట్ట, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని వైఎస్ఆర్ జిల్లాకు చెందిన ఒక మండల కేంద్రము. కడప నుంచి రాజంపేటకు వెళ్ళే మార్గంలో 27 కి.మీ. దూరంలో ఒంటిమిట్ట ఉంది. ఇక్కడ ప్రసిద్ధి చెందిన కోదండ రామాలయం ఉంది. వివిధ మార్గాలలో ఒంటిమిట్టకు ఇలా చేరుకోవచ్చు… రోడ్డు మార్గంలో… బస్సు ద్వారా… దగ్గరి బస్ స్టేషన్: కడప (27 KM), రాజంపేట (29 KM) కడప, రాజంపేటల నుంచి ప్రతి పది నిమిషాలకు ఒంటిమిట్ట మీదుగా వెళ్ళే బస్సు సర్వీసులు […]పూర్తి వివరాలు ...
పౌరాణికం 1. సీతారామలక్ష్మణులు అరణ్యవాసం చేస్తున్నపుడు సీతమ్మ కోసం రామయ్య బాణం సంధించి భూమి నుంచి నీరు తెప్పించిన చోటు ఇక్కడుంది. అక్కడే నేడు రామతీర్థం వెలసింది. 2. సీతమ్మ కోసం వెతుకుతూ జాంబవంతుడు ఇక్కడ ఒక రాత్రి నిద్రించాడు. మరునాటి ఉదయం ఒక శిలలో సీతారామలక్ష్మణుల్ని, భావించి నమస్కరించి అన్వేషణకు బయలుదేరాడు. ఈ గుట్ట మీద నిర్మాణం అయిందే కోదండరామాలయం. భౌగోళికం తిరుమల నుంచి కడపకు వస్తున్న శేషాచలం కొండలు ఒంటిమిట్టను దాటుకొంటూ విస్తరించాయి. ఆ […]పూర్తి వివరాలు ...
వైష్ణవులకిది మధ్య ఆహోబిలమూ శైవులకిది మధ్య కైలాసమూ కడప నుంచి కర్నూలుకు వెళ్ళే మార్గంలో పుష్పగిరి క్షేత్రం కొండపై ఉంది. కింద పుష్పగిరి గ్రామం ఉంది. ఇది హరిహరాదుల క్షేత్రంగా కూడా ప్రసిద్ధి చెందింది. ఈ క్షేత్రంలో ప్రాచీన కాలంలో వందకు పైగా ఆలయాలు ఉండేవన్న పురాణగాధ ప్రచారంలో ఉంది. బ్రహ్మాండ, వాయు పురాణాల్లో ఈ క్షేత్ర మహిమను వ్యాస మహర్షి ప్రస్తావించారుట. ఆది శంకరులు పూజించిన చంద్రమౌళీశ్వర లింగం, విద్యారణ్యస్వామి ప్రతిష్ఠించిన శ్రీచక్రంతో దర్శనీయ క్షేత్రంగా […]పూర్తి వివరాలు ...