ఇడుపులపాయ: ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పాదయాత్రలు చేసి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి రెండు పర్యాయాలు అధికారాన్ని తెచ్చిపెట్టిన దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డిపై జరుగుతున్న కుట్రలు, కుతంత్రాలు చూస్తుంటే బాధ కలుగుతోందని.. వైఎస్ సోదరుడు, మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. వైఎస్, ఆయన కుమారుడు జగన్మోహన్రెడ్డిలపై సీబీఐ దాడులు జరిపే కుట్రకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబే ప్రధాన సూత్రధారి అని నిప్పులు చెరిగారు. టీడీపీ నేత పయ్యావుల కేశవ్కు స్వయానా బావ అయిన సీబీఐ జాయింట్ డెరైక్టర్ లక్ష్మీనారాయణ లంచగొండి అని […]పూర్తి వివరాలు ...
న్యూఢిల్లీ: తన సంస్థలలో పెట్టుబడులు, తన ఆస్తులపై సీబీఐ విచారణకు ఆదేశిస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును నిలిపివేయాలని కోరుతూ వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపి జగన్మోహన్రెడ్డి దాఖలు చేసిన పిటీషన-ని సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. దీనిపై సుప్రీం కోర్టులో రెండు గంటలసేపు వాదనలు జరిగాయి. జగన్ తరపున ప్రముఖ న్యాయవాదులు రామ్ జెఠ్మాలనీ, ముకుల్ రోహత్గీ వాదించారు. సిబిఐ విచారణపై స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. విచారణ జరుగుతున్న ఈ సమయంలో […]పూర్తి వివరాలు ...
జగన్పై వచ్చినవి రాజకీయ కక్షతో కూడిన ఆరోపణలని జగన్ తరపు న్యాయవాది మకుల్ రోహతగీ సుప్రీంకోర్టుకు తెలిపారు. హైకోర్టు సీబీఐ నివేదిక చూసి, విచారణకు ఆదేశించినా, తమకు ఆ ప్రతిని ఇవ్వలేదని ఆయన తెలిపారు. అధిష్ఠానం చెప్పిన ప్రకారమే పిటీషన్ వేసినట్టు మంత్రి శంకర్రావ్ చెప్పారని ఆయన తెలిపారు. ముకుల్ రోహతగీ తన వాదనలతో జగన్ తపురు న్యాయవాదుల వాదనలు పూర్తయ్యాయి. ఇప్పుడు టీడీపీ నేత ఎర్రన్నాయుడు తరుపున న్యాయవాదులు గంగూలీ, లలిత్లు వాదనలు వినిపిస్తున్నారు.పూర్తి వివరాలు ...
న్యూఢిల్లీ: వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షడు, కడప ఎంపి జగన్మోహన్రెడ్డి ఆస్తులకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పు సహజ న్యాయసూతాలకు వ్యతిరేకం అని ప్రముఖ న్యాయవాది రామ్ జెఠ్మాలానీ సుప్రీం కోర్టులో వాదించారు. జగన్ దాఖలు చేసిన లీవ్ పిటిషన్లపై సుప్రీం కోర్టులో ఈరోజు విచారణ ప్రారంభమైంది. జగతి పబ్లికేషన్స్, సాక్షి టీవీల్లో పెట్టుబడులు, తన ఆస్తులపై సీబీఐ విచారణకు ఆదేశిస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును నిలిపివేయాలని కోరుతూ ఆయన సుప్రీం కోర్టులో మూడు పిటిషన్లు […]పూర్తి వివరాలు ...
ప్రస్తుతం రాజీనామాలు సిద్దపడ్డ ఎమ్మెల్యేలు.. 30 మందితో సహా.. సోమవారం నాటికి.. మరో 30 మంది ఎమ్మెల్యులు కలుస్తారని ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ రావు స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన సంకేతాలు తమకు అందుతున్నాయని ఆయన చెప్పుకొచ్చారు. దీంతో కిరణ్ సర్కార్ కూలిపోవడం ఖాయం అని ఆయన అన్నారు. మరో ఆగస్టు సంక్షోభం తప్పదని ఆయన జోస్యం చెప్పారు.పూర్తి వివరాలు ...
శ్రీశైలం జలాశయం నీటిని రాయలసీమ ప్రాంతానికి తరలించాలని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎస్.గోవర్ధనరెడ్డి డిమాండ్ చేశారు. టీడీపీ జిల్లా కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇదివరకు కర్నూలు ముంపునకు గురయ్యేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులే కారణమని, దీంతో ప్రజలు భారీగా నష్టపోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు.పూర్తి వివరాలు ...
కడప : జిల్లాలోని నిరుద్యోగ యువత రాజీవ్యువశక్తి పథకం దరఖాస్తులను ఈ నెల 18వ తేదీలోపు పంపుకోవాలని స్టెప్ సీఈవో డి.మహేశ్వరరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తేలిపారు. స్వయం ఉపాధి పొందేందుకు అర్హత గల అభ్యర్థుల నుంచి చిన్న పరిశ్రమలు లేక సర్వీసింగ్ కేటగిరి పరిధిలోకి వచ్చే యూనిట్లు నెలకొల్పేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ఆయన తెలిపారు.పూర్తి వివరాలు ...
విద్యపై ఎపిపిఎస్సి మాజీ సభ్యుడు బిఆర్కెరాజు తీర్మానం ప్రవేశపెట్టారు. విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చాలని ఆయన కోరారు. అందుకోసం రాజ్యాంగ సవరణ తీసుకురావాలన్నా రు. విద్యారంగంలో సమూల మార్పులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుడుతుందని చెప్పారు. డిగ్రీ తరువాత భవిష్యత్పై మరింత దృష్టి పెట్టాలన్నారు. సంక్షేమ హాస్టళ్ల పరిస్థితి దయనీయంగా ఉందని ఆయన అన్నారు. విద్యారంగంలో సమగ్ర ఆలోచన, విధానల రూపకల్పనకు పార్టీ తరపున ప్రత్యేక సదస్సు నిర్వహించవలసిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. […]పూర్తి వివరాలు ...
జమ్మలమడుగు : ప్రముఖ టివి యాంకర్ ఉదయభాను, ఫైట్ మాస్టర్స్ రామలక్ష్మణ్లు అదివారం మండల పరిదిలొని గండికొట పరిసర ప్రాంతాల్లొ హల్చల్ చేశారు. మా టివి నిర్మాణ సారధ్యంలొ స్టైల్ సురేష్ దర్శకత్వ పర్యవేక్షణలొ ధండర్ స్టార్ రియాలీటి షొ కు సంభందించిన ఎపొసిడ్ చిత్రీకరణ చేశారు. ఈ సందర్బంగా స్దానిక గండికొట ప్రాంతంలొని అత్యంత రమణీయమైన లొయ ప్రాంతంలొ రియాలిటి షొ కు సంభందించిన కొండను త్రాడుతొ పట్టుకొని పైకి వెళ్ళే వాటికి సంభందించి చిత్రీకరించారు.పూర్తి వివరాలు ...