బ్రహ్మణీకి కేటాయించిన స్థలంలోనే సెయిల్ ఆధ్వర్యంలో ప్రభుత్వం వెంటనే ఉక్కు కర్మాగారం నిర్మాణం చేపట్టాలని కోరుతూ త్వరలో ఉద్యమానికి శ్రీకారం చుట్టనున్నట్లు రాయలసీమ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎంవీ రమణారెడ్డి తెలిపారు. స్థానిక తన స్వగృహంలో రాయలసీమ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధుల సమావేశం ఆదివారం నిర్వహించారు. సమావేశం అనంతరం వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు. 2 లక్షల మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో బ్రహ్మణీ ఉక్కు కర్మాగారం నిర్మాణాన్ని […]పూర్తి వివరాలు ...
గత కొద్ది సంవత్సరాలుగా సివిల్స్లో సత్తా చాటుతుతున్న కడప జిల్లా వాసులు, మరోసారి విజయ పతాక మోగించారు. శుక్రవారం విడుదలైన సివిల్స్ – 2012 ఫలితాలలో జిల్లాకు చెందిన మేఘనాథ్రెడ్డి, తేజ లోహిత్ రెడ్డి, సగిలి షణ్మోహన్లు మెరుగైన ర్యాంకులు సాధించారు. మేఘనాథ్రెడ్డి 55వ ర్యాంకును, తేజ లోహిత్ రెడ్డి 101వ ర్యాంకును, సగిలి షణ్మోహన్ 132వ ర్యాంకును సాధించారు. తేజలోహిత్రెడ్డి కమలాపురంలో హెడ్కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్న కొండారెడ్డి కొడుకు తేజలోహిత్రెడ్డి. ఖాజీపేట మండలం సుంకేసుల వీరి సొంతూరు. […]పూర్తి వివరాలు ...
2011 జనాభా లెక్కలను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా మంగళవారం విడుదల చేసింది. 2001తో పోల్చితే జిల్లా జనాభా వృద్ధి రేటు 10.87 శాతంగా నమోదైంది. 2001లో జిల్లా జనాభా 26,01,797 మంది ఉంటే, తాజా జనాభా లెక్కల ప్రకారం 28, 82,469 మంది ఉన్నారు. వీరిలో 14,51,777మంది పురుషులు, 14,30,692 మంది స్త్రీలు ఉన్నారు. అంటే స్త్రీ, పురుష జనాభా నిష్పత్తి పోల్చితే స్త్రీల కంటే 21085మంది పురుషులు అధికంగా ఉన్నారు. అయితే 2001తో పోల్చితే జనాభా వృద్ధిరేటు […]పూర్తి వివరాలు ...
కడప : జిల్లా కోర్టుకు మే ఒకటో తేదీ-బుధవారం నుంచి వేసవి సెలవులు మంజూరు చేస్తు రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా కోర్టుతోపాటు అయిదు అదనపు జిల్లా కోర్టులు, అన్ని సినియర్, సివిల్ జిల్లా కోర్టులకు మే ఒకటో తేదీ నుంచి 31 వరకు సెలవులు వర్తిస్తాయి. వేసవి సెలవుల్లో సివిల్ కేసుల విచారణ ఉండదు. జిల్లా వ్యాప్తంగా అత్యవసర సివిల్ కేసులు విచారించేందుకు జిల్లా స్థాయి న్యాయమూర్తి ఒకేషనల్ కోర్టు జడ్జిగా పని […]పూర్తి వివరాలు ...
జీవితంలో ముందు ముందు ఎవరిదారి వాళ్ళదనుకున్నాము. నలుగురం ఎప్పుడైనా, ఎక్కడైనా కలవడం కూడా అంత సాధ్యం కాదేమో అని నిరుత్సాహపడ్డాము. కాన్పూరు ఐ.ఐ.టిలో బి.టెక్ చదివిన నాలుగేళ్లూ ఎంతో ఆత్మీయంగా గడిచాయి. ఆ తర్వాత ఉద్యోగరీత్యా ఒకచోట పనిచేసే అవకాశం వస్తుందని ఎవరూ కలగనలేదు. అబ్దుల్లాది జమ్ము, సేతు మాధవన్ది తంజావూరు, దేశపాండేది పూనా, నాదేమో తెనాలి. నలువురం ఒకే దేశంలోని వాళ్ళమే. అయినా ఉద్యోగాల విషయంగా ఎవరు ఎక్కడుంటామో తెలియదు. అయితే, నిజం ఊహకంటే గొప్పది. […]పూర్తి వివరాలు ...
2011 లెక్కల ప్రకారం మన జనాభా: మొత్తం జనాభా : 28,84,524 పురుషులు : 14,54,136 స్త్రీలు : 14,30,388 పట్టణాలలో నివసించే వారి సంఖ్య: 983,736 పల్లెలలో నివసించే వారి సంఖ్య: 19,00,788 జనసాంద్రత (చదరపు కి.మీ.కి): 188 ఆడ – మగ నిష్పత్తి (1000 మంది మగవారికి) : 984 పూర్తి వివరాలు ...
జిల్లాలో చరిత్ర సృష్టించిన మహానుభావులెంతోమంది వున్నా ఫ్యాక్షన్ సినిమాల పుణ్యమా అని కడప పేరు వింటేనే గుండెలు పేలిపోతాయి… కడప కథలు వింటేనే నరాలు ఉత్కంఠతో తెగిపోతాయి. అయితే అదే జిల్లా నుంచి వచ్చిన ఓ వైద్యుడు మాత్రం నరాలను సరి చేస్తూ, నాడీ వ్యవస్థ శస్త్ర చికిత్సా నిపుణుడి (న్యూరో సర్జన్)గా రోగులకు సేవలందిస్తూ చెన్నైలో పలువురి ప్రశంసలందుకుంటున్నారు. ఆయనే డాక్టర్ ఆవుల చక్రవర్తి. * * * మౌలిక సదుపాయాల లేమి వల్లే వైద్యం […]పూర్తి వివరాలు ...
కడప కలెక్టరేట్ బంగ్లా కూడలిలో ప్రతిష్ఠించిన బాబూ జగ్జీవన్రామ్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఏప్రిల్ 27వ తేదిన లోక్సభ స్పీకర్ మీరాకుమార్ కడపకు రానున్నారు.ఈ మేరకు శనివారం మధ్యాహ్నం ఢిల్లీలో మీరాకుమార్ను కలిసిన దళిత నాయకులకు ఆమె అంగీకారం తెలిపారు. 27వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటకు ఢిల్లీ నుంచి తిరుపతికి చేరుకుంటారు. అక్కడ భోజనాలను ముగించుకుని కడపకు బయలుదేరుతారు. 3-4 గంటల్లోగా కడపలో జరిగే జగ్జీవన్రామ్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆమె పాల్గొంటారు. స్పీకర్ను కలిసిన వారిలో బాబూ […]పూర్తి వివరాలు ...
1921 సెప్టంబర్ 28న మహాత్మాగాంధీ తిరుపతి (రేణిగుంట) నుండి ప్రత్యేక రైలు బండిలో కడపకు వచ్చారు. సుమారు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో రాజంపేటకు చేరుకున్న గాంధీజీ అక్కడ కొద్దిసేపు ఉపన్యసించి తిరిగి కడపకు అదే రైలులో వెళ్లారు. సాయంత్రం ఐదు గంటల సమయంలో గాంధీజీ కడప చేరుకున్నారు. అప్పటికే సన్మాన సంఘం వారు అక్కడ సభకు ఏర్పాట్లు చేసి ఉన్నారు. దాదాపుగా 40వేల మంది సభకు హాజరైనారు. జనసందోహం కారణంగా అక్కడ సుమారు ఒక గంట సేపు […]పూర్తి వివరాలు ...