వార్తా విభాగం

ప్రసిద్ధులు

‘గడ్డం పొడవునుబట్టా, తెల్లబడిన వెంట్రుకను బట్టా’ – సభాపతీయం 1

రత్న సభాపతిని ఆంధ్రప్రదేశ్ సహకార భూమి తనఖా కేంద్ర బాంకుకు అధ్యక్షస్థానంలో చూచిన సన్నిహిత మిత్రుడొక ఉత్తరం వ్రాస్తూ యిలా వ్యాఖ్యానించాడట – “చైనాలో పూర్వం ఒక బంగారు పిట్ట ఉండేది. దాని కంఠస్వరం వర్ణనాతీతంగా ఉండేది. అందువలన చైనావారు ఆ పిట్టను ఒక పంజరంలో అట్టిపెట్టారు” ఈ అభిప్రాయం ఎలావున్నా, కొంచెం పూర్వాపరాలు తెలుసుకోనిదే ఎవర్ని గురించీ అంచనా వేయలేం. ఆ దృష్టితో ఒక్కసారి రత్నసభాపతి గత జీవితచరిత్రను ప్రస్తావించక తప్పదు. బాల్యం బండారు రత్నసభాపతి […]పూర్తి వివరాలు ...

అభిప్రాయం రాజకీయాలు

చంద్రబాబు కోసం వైఎస్ రెకమండేషన్

కాంగ్రెసు సంస్కృతి పూర్తిగా రాష్ట్రంలో అమలు జరుగుతున్న రోజులలో కేంద్రం తన ఇష్టం వచ్చినట్లు ముఖ్యమంత్రులను పేకముక్కలవలె మార్చేసింది. చెన్నారెడ్డిని తొలగించి అంజయ్యను, ఆయనను పక్కన పెట్టి భవనం వెంకట్రామ్ ను ముఖ్యమంత్రిగా చేశారు. అదంతా ఇందిరాగాంధీ అధిష్ఠాన వర్గం చదరంగంలో భాగమే. 1978లో భవనం వెంకట్రామ్ విద్యామంత్రి అయ్యాడు. చెన్నారెడ్డి ఆయనను తరువాత కౌన్సిల్ సభ్యుడుగా చేశారు. ఆ దశలో డా. తంగిరాల సుభాష్ నాకు భవనం వెంకట్రామ్ ను పరిచయం చేశాడు. భవనం వెంకట్రామ్ సోషలిస్టు […]పూర్తి వివరాలు ...

వార్తలు

11,12తేదీలలో యువతరంగం

కడప జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల విద్యార్థులకు ‘యువతరంగం’ పేరిట సాంస్కృతిక, సాహిత్యోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ పి.పద్మావతి తెలిపారు. 11, 12 తేదీలలో ఉదయం తొమ్మిది గంటల నుంచి పోటీలు కళాశాల మైదానంలో ఉంటాయన్నారు. ఇందులో భాగంగా క్రింది పోటీలు నిర్వహిస్తారు. పద్యపఠనం (ప్రాచీన సాహిత్యంలో అయిదు పద్యాలు కంఠస్థంగా) క్విజ్, వ్యాసరచన, వక్తృత్వం, ఏకాంకిక, ఏకపాత్రాభినయం, చుక్కల ముగ్గు (బాలికలు), జానపద, గిరిజన నృత్యం, సంప్రదాయం నృత్యం […]పూర్తి వివరాలు ...

వార్తలు

కొత్త ఎస్పీగా అశోక్

బదిలీపై వెళ్తున్న ప్రస్తుత ఎస్పీ మనీష్‌కుమార్ సిన్హా నుండి జీవీజీ అశోక్ బుధవారం సాయంత్రం 4.20 గంటలకు కడప జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ విలేకరులతో మాట్లాడుతూ … జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.తాను ఎస్పీగా మొదట కడపకు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. జిల్లాలో శాంతిభద్రతలు, ఇతర సమస్యలపై అధ్యయనం చేసి కార్యాచరణ రూపొందించుకుని ముందుకెళ్తానన్నారు. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు పోలీసుల సంక్షేమానికి ఎస్పీ మనీశ్‌కుమార్ సిన్హా తీసుకున్న చర్యలను […]పూర్తి వివరాలు ...

అభిప్రాయం

బిర్యానీ వద్దు, రాగిముద్ద చాలు

రాజధాని నగరాన్ని, నదీ జలాలను త్యాగం చేసిన రాయలసీమ ప్రజలు ‘హైదరాబాద్ బిర్యానీ’ని కోరుకోవడం లేదు. తమ ‘రాగి సంకటి’ తమకు దక్కితే చాలనుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన సుదీర్ఘకాలంగా అటు రాజకీయ పక్షాలకు, ఇటు సామాన్య ప్రజలకు కూడా తీవ్ర సమస్యగా పరిణమించింది. ఎట్టకేలకు తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం… కాదు, కాదు సకల రాజకీయ పక్షాలూ సంసిద్ధమయ్యాయి. రాజకీయ ప్రయోజనాలను ఆశించి చేస్తున్నారో లేక సుదీర్ఘకాలంగా ఉన్న సమస్యకు పరిష్కారం చూపించాలనుకుంటున్నారో గానీ […]పూర్తి వివరాలు ...

ప్రసిద్ధులు వ్యాసాలు

సహృదయ శిరోమణి డాక్టర్ బాలశౌరిరెడ్డి

అమానుషమయిన పరిస్థితులలో జన్మించి, ముసురుకొంటున్న అవరోధాలన్నింటినీ దోహదాలుగా మలుచుకొంటూ జీవించడమే అద్భుతమనుకొంటున్న దశలో ఆ జీవితాన్ని ఆదర్శప్రాయంగా తీర్చిదిద్దడం వెనుకగల కృషి, ఆ రంగంలో ఉన్నవారికి లోతుగా తెలుస్తుంది. ఇతరులకు ఉపరితల దర్శనం మాత్రమే అవుతుంది. అలాంటి ఆదర్శజీవులు, మనదేశంలోనూ ఉన్నారు. మన రాష్ట్రంలోనూ ఉన్నారు – మన రాష్ట్రంలోనూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ కూ, అఖిల భారతావనికీ – ఒక మేరకు – ప్రపంచానికి కూడా రాయలసీమ, చాలా కానుకలను ప్రసాదించింది. ఒక సర్వేపల్లి రాధాకృష్ణ గారు, […]పూర్తి వివరాలు ...

రాజకీయాలు వార్తలు

ఎంపీల రాజీనామాల తిరస్కరణ

సీమాంధ్ర ఎంపీల రాజీనామాలు తిరస్కరణకు గురయ్యాయి. రాష్ట్ర విభజన నిర్ణయానికి నిరసనగా దాదాపు రెండు నెలల కిందట కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు చెందిన 13 మంది ఎంపీలు తమ లోక్‌సభ సభ్యత్వాలకు సమర్పించిన రాజీనామాలను స్పీకర్ మీరాకుమార్ శుక్రవారం తిరస్కరించారు. కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్ సీపీలకు చెందిన లోక్‌సభ సభ్యుల రాజీనామాలు ఎలాంటి ఒత్తిళ్లకు లోనుకాకుండా స్వచ్ఛందంగా చేసినవి కావని.. రాష్ట్రాన్ని విభజించి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్న నిర్ణయంతో ఏర్పడిన తీవ్రమైన భావోద్వేగాల నడుమ తీసుకున్న […]పూర్తి వివరాలు ...

అభిప్రాయం

తాగునీరూ కష్టమే!

కోస్తాంధ్రలో జరిగిన నీటి పారుదల సౌకర్యాల అభివృద్ధి బ్రిటిష్ కాలం నాటిది. కానీ నిజాం ప్రభుత్వం హయాంలో తెలంగాణ అలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. 1957 తరువాత మిగిలిన రెండు ప్రాంతాలతో పోల్చి చూసినప్పుడు సాగునీటి పథకాల అభివృద్ధి తెలంగాణ ప్రాంతంలోనే ఎక్కువ జరిగింది. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగితే నదీ జలాల పంపీణీలో అదనం గా ఉత్పన్నమయ్యే సమస్యలు ఏమీ ఉండబోవని కొందరు తెలంగాణ ప్రాంత ప్రముఖులు వాదిస్తున్నారు. అంటే ఇప్పుడు న్న సమస్యలే తప్ప అదనంగా ఎదురయ్యే […]పూర్తి వివరాలు ...

వార్తలు

రిమ్స్ వైద్యకళాశాలకు సెలవులు

ఈరోజు నుంచి అక్టోబర్ 20వ తేదీ వరకు రిమ్స్ వైద్య కళాశాలకు సెలవులను ప్రకటించారు. సమైక్య సమ్మె నేపధ్యంలోనే సెలవులు ప్రకటించారని విద్యార్థులు భావిస్తుండగా అది వాస్తవం కాదని కళాశాల వర్గాలు ధ్రువీకరించాయి. కేవలం దసరా పండుగను పురస్కరించుకుని మాత్రమె కళాశాలకు పది రోజుల సెలవు ప్రకటించినట్టు  కళాశాల వర్గాలు ధ్రువీకరించాయి. పది రోజుల సెలవు దొరకటంపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.పూర్తి వివరాలు ...