వార్తా విభాగం

వార్తలు

కవులూ..కళాకారులూ ఉద్యమానికి సన్నద్ధం కావాలి

మైదుకూరు: రాయలసీమ రచయితలు చాలామంది రాజకీయాలు మాట్లాడకుండా సీమ దుస్థితికి ప్రకృతిని నిందిస్తూ ఏడుపుగొట్టు సాహిత్యాన్ని రచించడం ఎంతమేరకు సబబు అని విరసం రాష్ట్ర కార్యదర్శి పి.వరలక్ష్మి ప్రశ్నించారు. స్థానిక జిల్లాపరిషత్ హైస్కూల్ ఆవరణలో ఆదివారం కుందూసాహితీసంస్థ ఆధ్వర్యంలో నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాయలసీమ భవితవ్యము అనే అంశంపై సంస్థ కన్వీనర్ లెక్కల వెంకటరెడ్డి అధ్యక్షతన రచయితలు, కవులు, కళాకారుల సమావేశంలో ఆమె పాల్గొని ప్రసంగించారు. రాష్ట్ర విభజన తర్వాత కూడా నూతన ఆంధ్రప్రదేశ్ రాష్టమ్రులో కూడా […]పూర్తి వివరాలు ...

అభిప్రాయం రాజకీయాలు

ఔను…కడప జిల్లా అంటే అంతే మరి!

దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా రాష్ట్రవ్యాప్తంగా మూడు ట్రిపుల్ ఐటి లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అందులో ఒకటి కడప జిల్లాలోని ఇడుపులపాయలో ఏర్పాటు చేయాలని అప్పటి ప్రభుత్వం విధాన పరమైన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని నాటి ప్రతిపక్షమైన తెదేపా అసెంబ్లీ సాక్షిగా తీవ్రంగా తప్పుపట్టింది. ఆ సందర్భంలో వైఎస్ మాట్లాడుతూ ‘ఏం ఇడుపులపాయలో ట్రిపుల్ ఐటి పెట్టకూడదా? అదేమన్నా పాకిస్తాన్లో ఉందా?’ అంటూ తెదేపా నేతలను ప్రశ్నించారు. అదే సందర్భంలో […]పూర్తి వివరాలు ...

ప్రత్యేక వార్తలు

పులివెందులను గబ్బుగా చూపిన ‘జంపు జిలాని’

పులివెందులలో చోటా మోటా నాయకులు ఇళ్ళ ముందు చూడడానికి భయంకరంగా ఉండే మనుషులను పెట్టుకుని బాంబులు చుట్టిస్తూ.. కత్తులు పట్టుకుని తిరుగుతుంటారట – అంతే కాదండోయ్ పులివెందులలో కేవలం ఫ్యాక్షనిస్టులు, నేరస్తులు, రౌడీలు మాత్రమే ఉంటారుట – ఇదీ ‘జంపు జిలానీ’ అనే పేరుతో ఇటీవల విడుదలయిన ఒక సినిమాలో పైత్యం శ్రుతిమించి చూపించిన సన్నివేశం. అంతేనా సినిమాలో పలుచోట్ల పులివెందుల అనగానే అయ్యా బాబోయ్ అది ఫ్యాక్షనిస్టుల ఊరు నేను రాను అంటూ కథానాయకుడితో సంభాషణలు […]పూర్తి వివరాలు ...

రాజకీయాలు

తెదేపా ప్రలోభాల పర్వం

జిల్లాలో స్థానిక ఎన్నికలలో గెలిచిన అభ్యర్థులను తమ దారిలోకి తెచ్చుకునేందుకు అధికార తెదేపా ప్రలోభాలకు తెరతీసింది. వైకాపా కైవసం చేసుకున్న ఎర్రగుంట్ల పురపాలికను దక్కిన్చుకునేందుకు, అలాగే జిల్లా పరిషత్ పీఠాన్ని సైతం దక్కించుకోవడం కోసం తెదేపా నేతలు గెలుపొందిన స్థానిక ప్రతినిదులపైన సామదాన దండోపాయాలను ప్రయోగిస్తున్నారు. 20 మంది వార్డు సభ్యులున్న ఎర్రగుంట్ల పురపాలికలో 18 స్తానానలను వైకాపా అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. రెండు స్థానాలను తెదేపా అభ్యర్థులు దక్కించుకున్నారు. దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎర్రగుంట్ల మండలానికి […]పూర్తి వివరాలు ...

రాజకీయాలు

జమ్మలమడుగులో ఎవరికెన్ని ఓట్లు?

జమ్మలమడుగు శాసనసభ స్థానం నుండి పోటీ చేయటానికి మొత్తం 24 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల తిరస్కరణ మరియు ఉపసంహరణల అనంతరం మొత్తం 12 మంది అభ్యర్థులు తుదిపోరులో తలపడ్డారు. ఈ పోరులో వైకాపా తరపున బరిలోకి దిగిన చదిపిరాల్ల ఆదినారాయణ రెడ్డి తన సమీప ప్రత్యర్థి అయిన రామసుబ్బారెడ్డిపై సుమారు 12వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఆదినారాయణరెడ్డి చదిపిరాళ్ల – వైకాపా – 100794 రామసుబ్బారెడ్డి పొన్నపురెడ్డి – తెదేపా+భాజపా  – 88627 […]పూర్తి వివరాలు ...

వార్తలు

‘రాజధానిని రాయలసీమలోనే ఏర్పాటు చేయాల’

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిని రాయలసీమలో ఏర్పాటు చేయాలని రాయలసీమ ప్రజాసంఘాల ఐక్య కార్యాచరణ సమితి కోరింది. సోమవారం ఆ సమితి నేతలు జిల్లా సచివాలయం ఎదుట ఆందోళన చేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతు 1953లో ఉమ్మడి మద్రాసు రాష్రం నుంచి విడిపోయి ఏర్పాటైన ఆంధ్ర రాష్ట్రానికి పెద్ద మనుషుల ఒప్పందం మేరకు రాయలసీమ ప్రాంతంలోని కర్నూల్లో అప్పట్లో రాజధాని ఏర్పాటుకు నిర్ణయించారని గుర్తుచేశారు. గుంటూరులో ఉన్నత న్యాయస్థానం స్థాపించాలనేది ఒప్పందంలో ఉందన్నారు. 1956లో విశాలాంధ్ర ఉద్యమం […]పూర్తి వివరాలు ...

రాజకీయాలు

పులివెందులలో ఎవరికెన్ని ఓట్లు?

పులివెందుల శాసనసభ స్థానం నుండి పోటీ చేయటానికి మొత్తం 15 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల పరిశీలన మరియు ఉపసంహరణల అనంతరం మొత్తం 14 మంది తుది పోరులో తలపడ్డారు. ఇక్కడ వైకాపా తరపున బరిలోకి దిగిన ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ సుమారు 75 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో తన సమీప ప్రత్యర్థి సతీష్ రెడ్డి (తెదేపా + భాజపాల ఉమ్మడి అభ్యర్థి) పై విజయం సాధించారు. జగన్‌మోహన్‌రెడ్డి, యెడుగూరి సందింటి – […]పూర్తి వివరాలు ...

వార్తలు

కడప లేదా కర్నూలులో రాజధాని ఏర్పాటు చెయ్యాలి

జూన్ 2న కడప కలెక్టరేట్ వద్ద ధర్నా రాయలసీమలో రాజధానిని ఏర్పాటుచేయాలని కోరుతూ రాయలసీమ ప్రజాఫ్రంట్ ఆధ్వర్యంలో జూన్ 2వ తేదిన కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు ఫ్రంట్ కమిటీ పేర్కొంది. బుధవారం స్థానిక వైఎస్సార్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో కమిటీ నాయకులు, రాష్టబ్రిసి మహాసభ కన్వీనర్ అవ్వారు మల్లికార్జున, డిపిపి అధ్యక్షుడు సంగటి మనోహర్, ఎస్సీ,ఎస్టీ రైట్స్ ఫోరం అధ్యక్షుడు జెవి రమణ, సంపత్‌కుమార్, కళాధర్, సత్తార్‌లు మాట్లాడుతూ రాయలసీమలో ఉన్న రాజధానిని కోల్పోయి […]పూర్తి వివరాలు ...

రాజకీయాలు

మైదుకూరులో ఎవరికెన్ని ఓట్లు?

మైదుకూరు శాసనసభ స్థానానికి గాను మొత్తం 28 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా ఉపసంహరణ మరియు తిరస్కరణల అనంతరం మొత్తం 12 మంది అభ్యర్థులు తుది పోరులో నిలుచున్నారు. ఈ పోరులో వైకపా తరపున బరిలోకి దిగిన శెట్టిపల్లి రఘురామిరెడ్డి తన సమీప ప్రత్యర్ధి పుట్టా సుధాకర్ యాదవ్ పై గెలుపొందారు. మైదుకూరు నియోజకవర్గం నుండి తుదిపోరులో తలపడిన 12 మంది అభ్యర్థులకు లభించిన ఓట్ల వివరాలు… రఘురామిరెడ్డి శెట్టిపల్లి – వైకాపా – 85539 పుట్టా […]పూర్తి వివరాలు ...