వార్తా విభాగం

వార్తలు

రాజధాని కోసం ఈ రోజు విద్యాసంస్థల బంద్

శ్రీభాగ్ ఒప్పందం మేరకు సీమలో రాజధానిని ఏర్పాటు చేయాలనే డిమాండుతో సోమవారం విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చనట్లు రాయలసీమ విద్యార్థి సమాఖ్య ప్రతినిధులు తెలిపారు. బంద్‌కు సంబంధించిన కరపత్రాలను ఆదివారం సమాఖ్య కోకన్వీనరు దస్తగిరి, నాగార్జున యోగివేమన విశ్వవిద్యాలయంలో విడుదల చేశారు. ఆర్ఎస్ఎఫ్ బంద్‌కు పిలుపునివ్వడం వెనక ప్రధాన ఉద్దేశం రాజధాని లేకపోతే రాయలసీమకు జరిగే నష్టం వివరించే అన్నీ విషయాలు అందులో పొందుపరిచారు. బంద్‌కు విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యాసంస్థల ప్రతినిధులు పాల్గొనాలని వారు కోరారు.పూర్తి వివరాలు ...

కథలు

సొప్పదంటు ప్రెశ్నలు (కథ) – వేంపల్లి రెడ్డినాగరాజు

“నాయినా, నాయినా” అని పరిగెత్తుకుంటా వొచ్చె మా పిల్ల నాకొడుకు నిన్న తెల్లార్తో జలదాట్లో నీల్లు పోసుకుంటాంటే. “ఏంటికిరా అట్ల గస పోసుకుంటావొస్తివి ?” అనడిగితి సబ్బుతో వొల్లు రుద్దుకుంటా. “నీ సెల్లు పోను మోగుతాంది, అది చెప్తామనే వొస్తి ” అని చెప్పె. “సరేపా, వస్తాండాగనీ” అంటి చెంబుతో నీల్లు మింద కుమ్మరిచ్చుకుంటా. “ఇబ్బుడికి రొండుతూర్లు మోగిండాది” అనె వాడు ఆట్నించీ ఎల్లబారకుండానే. “అట్లనా , ఎవురు చేసినారో చూస్తివ్యా”? అనడిగితి. “ఆ, చూసినా, ‘ […]పూర్తి వివరాలు ...

చరిత్ర ప్రసిద్ధులు

పాలెగత్తె హొన్నూరమ్మ

మట్లి వెంకట్రామరాజు మైసూరు నవాబైన హైదరాలీకి కప్పము కట్టడానికి తిరస్కరించాడు. దీంతో ఆగ్రహించిన మైసూరు నవాబు హైదరాలీ దండెత్తి వచ్చి  వెంకట్రామరాజును తరిమి సిద్దవటం కోటను స్వాధీనం చేసుకొన్నాడు. హైదరాలీ ఈ సిద్ధవటం కోటను కప్పం చెల్లించు విధానంపై చిట్వేలి జమిందారునకు స్వాధీనం చేసినాడు. ఈ జమిందారు భాకరాపేట పరిసర ప్రాంతాలలో ఉన్న పట్ర పాళెగార్ల వ్యవహారాలకు దోపిడీలకు భయపడి, ముదిరెడ్డిపల్లె పాళెగాడైన గోపాలరెడ్డి ఆయన సోదరుడు నర్సింరెడ్డికి అమ్మివేశాడు. ఈ  ముదిరెడ్డిపల్లి సోదరులు  దుర్మార్గులు. పేద […]పూర్తి వివరాలు ...

జానపద గీతాలు

నా కొడకా మానందీరెడ్డీ…! : జానపద గీతం

మానందిరెడ్డి లేదా మహానందిరెడ్డి రాయలసీమలో ఒక పాలెగాడు. అతని మంచి ఎందరికో మేలు చేసింది. అది కొందరికి కంటగింపైంది. ఓర్వలేని కొందరు అతన్ని నరికివేశారు. అతని ధీనగాధను తలుచుకుని జానపదులు ఇలా విలపిస్తున్నారు… వర్గం: భిక్షకుల పాట ఈ పాటకు అనువైన తాళం : సావేరి స్వరాలు – చావు తాళం పచ్చశత్రీ సేతబట్టీ… కిర్రు సెప్పూలేసుకోని కట్ట మీదా పోతావుంటేరో… నా కొడకా మానందీరెడ్డీ నువ్వు కలకటేరనుకొంటిరో… మల్లు పంచా కట్టుకోనీ నల్లకోటు ఏసుకోని సందు […]పూర్తి వివరాలు ...

జానపద గీతాలు

బావా… నన్ను సేరుకోవా! – జానపద గీతం

ఊరూ నిదరోయింది.. మెరుపూ మెరిసేసింది మెరుపులోన నా సోకంతా కరువుదీర సూదువుగాని బావా… నన్ను సేరుకోవా! బావా… నన్నందుకోవా!! | ఊరూ నిదరోయింది| మరుమల్లె తోటకాడ మల్ల నిన్ను కలుత్తనాని మాట సెప్పి మరిసీనావే.. బూటకాలు సేసినావే (2) అత్త కొడుకువనీ…అందగాడివనీ.. కొత్త వలపులను తెచ్చితి రారా బావా… నన్ను సేరుకోవా! బావా… నన్నల్లుకోవా!! జొన్నసేని మంచెపైన నన్ను ముద్దుసేసి శాన (2) ముద్దబంతి పూలసరమూ మురిపెంగా తెత్తానంటివి(2) మామకూతురని, మరదలు పిల్లని మాటలోనే ఏమారిసిపోదువా బావా… […]పూర్తి వివరాలు ...

కవితలు

రాయలసీమ బిడ్డలం (కవిత) – సొదుం శ్రీకాంత్

అమ్మని ఆదరిచ్చే కమ్మని గోరుముద్దలమైతాం కొమ్ముగాసి రొమ్ము గుద్దితే పోరుగిత్తలమైతాం రాగిసంగటి ముద్దలం రాయలసీమ బిడ్డలం బందువుగా చూశావా బాహువుల్లో బందిచ్చాం బానిసగా ఎంచితే పిడిబాకులమై కబళిచ్చాం రేగటిసేను విత్తులం రాయలగడ్డ బిడ్డలం కలిసి నడిచ్చే కారే కన్నీటికి సాచిన దోసిల్లమైతాం కాదని నమ్మిచ్చి నడ్డిడిచ్చే కారుచిచ్చై దహిచ్చాం రేపటితరం స్వప్నాలం రాయలసీమ బిడ్డలం సాగు నీళ్ళిచ్చి సాగనంపితే సావాసగాళ్ళం ఐతాం సాగుతున్న దగాని సాగదీచ్చే సానపట్టిన గళాలమై సాగుతాం రాతిగుండె పిల్లోల్లం రాయలగడ్డ బిడ్డలం జై […]పూర్తి వివరాలు ...

అభిప్రాయం

కృష్ణా జలాలపై ఆధారపడ్డ రాయలసీమ పరిస్థితి ఏమిటి?

కేటాయింపులున్న రాయలసీమ పరిస్థితి పట్టదా? పోలవరం ద్వారా ఆదా అయ్యే 45 టీయంసీల నీటిని, పులిచింతల నిర్మాణం ద్వారా ఆదా అయ్యే 54 టీయంసీల నీటిని, కృష్ణా డెల్టాలో పంటల మార్పిడి ద్వారా ఆదా అయ్యే నీటిని తక్షణమే గాలేరు-నగరి, హంద్రీనీవా, వెలిగొండ ప్రాజెక్టులకు నికర జలాలు పొందేలాగా బ్రిజేష్‌ ట్రిబ్యునల్‌కు నివేదికలు ఇవ్వాలి. రాష్ట్ర విభజన బిల్లులో పూర్తిచేస్తామన్న పై ప్రాజెక్టులు అన్నింటికీ బడ్జెట్‌ కేటాయింపులు ఇచ్చి ఒకటి రెండేళ్ళలో పూర్తిచెయ్యాలి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన […]పూర్తి వివరాలు ...

జానపద గీతాలు

సై..రా నరసింహారెడ్డి – జానపదగీతం

వర్గం: వీధిగాయకుల పాట పాడటానికి అనువైన రాగం: కాంభోజి స్వరాలు (ఆదితాళం) పాటను సేకరించినవారు: కీ.శే. కలిమిశెట్టి మునెయ్య సై..రా నరసింహారెడ్డి.. రెడ్డీ నీ పేరే బంగారు కడ్డీ.. రెడ్డీ సై.. సై..రా నరసింహారెడ్డి.. రెడ్డీ నీ పేరే బంగారూ కడ్డీ..రెడ్డీ అరెరే రాజారావు రావుబహద్దర్ నారసింహరెడ్డి ఏయ్..రెడ్డి కాదు బంగారపు కడ్డీ.. నారసింహరెడ్డి అరెరే.. ముల్కుల్ కట్టె సేతిలో ఉంటే మున్నూటికి మొనగాడు ఆ.. పెట్టి మాటలు ఏదాలూర రండి శూరులారా.. సై..రా నరసింహారెడ్డి.. రెడ్డీ […]పూర్తి వివరాలు ...

రాజకీయాలు

అందులోనూ వివక్షే!

కడప జిల్లా పర్యాటక రంగానికి మరోసారి అన్యాయం జరిగింది. కేంద్ర పర్యాటకశాఖ సహాయ మంత్రి శ్రీవద్ యశో నారాయణ మంగళవారం పార్లమెంటులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో పర్యాటకాభివృద్ధికి చేపట్టనున్న ప్రాజెక్టుల వివరాలను లిఖిత పూర్వకంగా వివరించారు. మన రాష్ట్రానికి సాధారణ సర్క్యూట్ విభాగంలో పది ప్రాజెక్టులను కేటాయించారు. సాధరణంగా రాష్ట్ర ప్రభుత్వం పంపే నివేదికలకు అనుగుణంగా కేంద్రం ఇటువంటి ప్రాజెక్టులకు అనుమతి మంజూరు చేస్తుంది.. అందులో గుంటూరుకు మూడు కేటాయించి పశ్చిమ గోదావరికి రెండు, చిత్తూరు (శ్రీకాళహస్తి)కు […]పూర్తి వివరాలు ...