అవి చిరుతపులి పాదాల గుర్తులే!

అవి చిరుతపులి పాదాల గుర్తులే!

రైల్వేకోడూరు మండల పరిధిలోని ఆర్.రాచపల్లె తోటలలో శుక్రవారం తెల్లవారుజామున చిరుతపులి తిరగడంతో స్థానికులు బెంబేలెత్తారు.  మూడు రోజులుగా ఈ ప్రాంతంలోని అరటితోటల్లో చిరుతపులి తిరుగుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

పొలాల్లో నీటితడులు కట్టిన తర్వాత ఏదో అడవిజంతువు తిరుగుతుందని పాదాల గుర్తులు చూసి అనుకున్నామని , అయితే శుక్రవారం వేకువజామున తమ తోటలో నీరు తడి కట్టేందుకు వెళ్లానని భాస్కర్‌రాజు అనే రైతు పేర్కొన్నారు. గ్రామ సమీపంలోని తన తోటలో నిలబడి ఉన్న చిరుతపులిని చూసి భయపడి గ్రామంలోకి ఉరుకులు పరుగులు తీశానన్నారు.

చదవండి :  పాత బస్టాండు టు రిమ్స్ బస్ సర్వీసు

గ్రామానికి చెందిన పలువురి తోటల్లో ఈ పులి సంచరించినట్లు అడుగులు ఉన్నాయి. తోటల్లో ఉన్న ఒక పొదలో ఈ పులి రాత్రుళ్లు నిద్రపోతున్నట్లు రైతులు తెలిపారు. రైతులు ఈ విషయాన్ని అటవీ అధికారులకు తెలిపారు. దీంతో బాలుపల్లె అటవీ రేంజర్ ఆదేశాల మేరకు ఎఫ్ఎస్‌వో, ఎఫ్‌బీవో సంఘటనా స్థలానికి వెళ్లి అక్కడ పాదాల గుర్తులను పరిశీలించారు. అవి చిరుత పులి పాదాల గుర్తులేనని నిర్ధారించారు.

ఉన్నతాధికారులతో మాట్లాడి  తోటల్లో రిస్క్యూవ్యాన్ ద్వారా బోన్ ఏర్పాటు చేసి పులిని పట్టే ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పారు.

చదవండి :  కరువుసీమలో నీళ్ళ చెట్లు!

    వార్తా విభాగం

    ఇవీ చదవండి

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *