శుక్రవారం , 18 అక్టోబర్ 2024

కడపజిల్లా పోలింగ్ విశేషాలు

– పులివెందులలో ఎస్వీ సతీష్ రెడ్డి వాహనం ధ్వంసం చేసిన వైకాపా కార్యకర్తలు

– చింతకొమ్మదిన్నె మండలం చిన్నమాచుపల్లెలో కందుల శివానందరెడ్డి వాహనం ధ్వంసం చేసిన తెదేపా కార్యకర్తలు.

– చెన్నూరు మండల కేంద్రంలో సాయంత్రం నాలుగు గంటల సమయంలో మొరాయించిన ఈవీఎంలు.

– ఖాజీపేట మండలం నాగాసానిపల్లెలో తెదేపా రిగ్గింగ్ యత్నం. వైకాపా ఏజంట్లను బయటకు లాగిన తెదేపా అభ్యర్తి.

– రైల్వే కోడూరు మండలంరెడ్డివారిపల్లిలో తెదేపా, వైకపా కార్యకర్తల మధ్య ఘర్షణ

చదవండి :  హృదయమున్న విమర్శకుడు - రారా!

– చెదురుమదురు ఘటనలు మినహా జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది.

– పులివెందుల నియోజకవర్గంలోని తొండూరు మండలంలోని గోటూరు పోలింగ్ బూత్లో ఇరు పార్టీల ఏజంట్ల మధ్య ఘర్షణ. పోలీసుల లాఠీచార్జి.

–  పులివెందుల నియోజకవర్గంలోని తొండూరు మండలం చేర్లోపల్లిలో వైకాపా తెదేపా కార్యకర్తల మధ్య స్వల్ప ఘర్షణ. పోలీసుల లాఠీచార్జి.

 – దేవగుడిలో నాలుగు రౌండ్లు కాల్పులు జరిపిన పోలీసులు …

– జమ్మలమడుగు నియోజకవర్గంలోని దేవగుడిలో వైకాపా అభ్యర్థి ఆదినారాయణ కుమారుడి పై చేయి చేసుకున్న జమ్మలమడుగు ఎఎస్పీ అప్పలనాయుడు. పోలీసులపై దాడికి దిగిన దేవగుడి గ్రామస్తులు. మూడు పోలీసు కార్ల ధ్వంసం.

చదవండి :  మచ్చలేని కుటుంబం మాది -మాజీ మంత్రి వైఎస్‌ వివేకా

– ప్రొద్దుటూరులో వైకాపా కార్యకర్త ముక్తియార్ కు చెందిన కారును ధ్వసం చేసిన తెదేపా కార్యకర్తలు

– మైదుకూరు నియోజకవర్గంలోని నక్కలదిన్నె (వైకాపా అభ్యర్థి రఘురామిరెడ్డి స్వగ్రామం)లో తెదేపా అభ్యర్థి పుట్టా సుధాకర్ ను అడ్డుకున్న వైకాపా కార్యకర్తలు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ. ఘర్షణలో సుధాకర్ కారు అదాలు ధ్వంసం.

– ఎర్రబల్లెలో వైకాపా అభ్యర్థి రఘురామిరెడ్డి కారును ధ్వంసం చేసిన పుట్టా అనుచరులు.

– మైదుకూరు నియోజకవర్గంలోని ఎన్ ఎర్రబల్లెలో వైకాపా ఏజంట్లను బయటకు పంపిన తెదేపా ఏజంట్లు. పోలింగ్ కేంద్రానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చిన మైదుకూరు డిఎస్పీ

చదవండి :  ఆయన ఎవరో నాకు తెలియదు

ఇదీ చదవండి!

వైకాపా-లోక్‌సభ

కడప జిల్లా వైకాపా లోక్‌సభ అభ్యర్థుల జాబితా – 2019

కడప: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభ అభ్యర్థుల జాబితా విడుదలైంది. ఇడుపులపాయలో పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీ …

error: