
11,12తేదీలలో యువతరంగం
కడప జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల విద్యార్థులకు ‘యువతరంగం’ పేరిట సాంస్కృతిక, సాహిత్యోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ పి.పద్మావతి తెలిపారు.
11, 12 తేదీలలో ఉదయం తొమ్మిది గంటల నుంచి పోటీలు కళాశాల మైదానంలో ఉంటాయన్నారు. ఇందులో భాగంగా క్రింది పోటీలు నిర్వహిస్తారు.
పద్యపఠనం (ప్రాచీన సాహిత్యంలో అయిదు పద్యాలు కంఠస్థంగా)
క్విజ్, వ్యాసరచన,
వక్తృత్వం,
ఏకాంకిక,
ఏకపాత్రాభినయం,
చుక్కల ముగ్గు (బాలికలు),
జానపద, గిరిజన నృత్యం,
సంప్రదాయం నృత్యం (సోలో),
సంగీతం
పోటీలలో విజేతలైన వారికి బహుమతులిస్తామని- ప్రాంతీయ (జోనల్) పోటీలకూ పంపుతామన్నారు.