వైఎస్ఆర్ కాంగ్రెస్­ ప్లీనరీ విశేషాలు

విద్యపై ఎపిపిఎస్­సి మాజీ సభ్యుడు బిఆర్­కెరాజు తీర్మానం ప్రవేశపెట్టారు. విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చాలని ఆయన కోరారు. అందుకోసం రాజ్యాంగ సవరణ తీసుకురావాలన్నా రు. విద్యారంగంలో సమూల మార్పులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుడుతుందని చెప్పారు. డిగ్రీ తరువాత భవిష్యత్­పై మరింత దృష్టి పెట్టాలన్నారు. సంక్షేమ హాస్టళ్ల పరిస్థితి దయనీయంగా ఉందని ఆయన అన్నారు. విద్యారంగంలో సమగ్ర ఆలోచన, విధానల రూపకల్పనకు పార్టీ తరపున ప్రత్యేక సదస్సు నిర్వహించవలసిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.



పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముందుగా ప్రజా ప్రస్థానం వేదికపై ఏర్పాటు చేసిన వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వైఎస్‌ఆర్ అమర్ హే అనే నివాదాలతో ప్లీనరీ ప్రాంగణం మార్మోగింది.

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: