కడప: గురువారం పోతిరెడ్డిపాడు నుంచి ప్రాజెక్టుల పరిశీలన చేపట్టిన అఖిలపక్షం శుక్రవారం ఉదయం గోరుకల్లు నుంచి బయలుదేరి కడప జిల్లాలోని గండికోట ప్రాజెక్టు వద్దకు చేరుకుంటుంది.
కడప పార్లమెంటు సభ్యుడు అవినాష్రెడ్డి, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి, మైదుకూరు శాసనసభ్యుడు రఘురామిరెడ్డి, జమ్మలమడుగు శాసనసభ్యుడు ఆదినారాయణరెడ్డి, రాయచోటి శాసనసభ్యుడు శ్రీకాంత్రెడ్డి, కమలాపురం శాసనసభ్యుడు రవీంద్రనాథ్రెడ్డి, రైల్వేకోడూరు శాసనసభ్యుడు శ్రీనివాసులు, బద్వేలు శాసనసభ్యుడు జయరాములు, కడప శాసనసభ్యుడు అంజాద్బాషా, శాసనమండలి సభ్యుడు దేవగుడి నారాయణరెడ్డి, వైకాపా రైతువిభాగం జిల్లా కార్యదర్శి ఎస్.ప్రసాద్రెడ్డి, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్రెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నారాయణ, సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్యతోపాటు కర్నూలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బుడ్డారాజశేఖరరెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య, పార్టీ నేతలు బుడ్డా శేషారెడ్డి, పోచా జగదీశ్వర్రెడ్డి, చంద్రమౌళి తదితరులు అఖిలపక్ష బృందంలో సభ్యులుగా ఉన్నారు.