కడపలో సినీ నటుడు బ్రహ్మాజీ

కడప : కడప నగరంలోని అమీన్‌పీర్‌ (పెద్ద) దర్గాను ప్రముఖ సినీ నటుడు బ్రహ్మాజీ ఆదివారం దర్శించి ప్రార్థనలు చేశారు.

దర్గా మహిమ గురించి మిత్రులు శంకర్‌, ఉత్తేజ్‌ తదితరులు తనకు చెప్పడంతో పాటు రెహమాన్‌ తరచు ఇక్కడికి రావడం తెలిసి రెండేళ్లుగా తాను రావాలని అనుకుంటున్నట్లు బ్రహ్మాజీ విలేకరులతో చెప్పారు. ఇన్నాళ్లకు ఆ భాగ్యం కలిగిందని అన్నారు.

గురువులకు పూలచాదర్‌ సమర్పించి ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ప్రార్థనలు నిర్వహించారు.

ప్రస్తుతం తాను నటించిన ‘దొంగల ముఠా’ విడుదలకు సిద్ధంగా ఉందని, దోపిడీ షూటింగ్‌ జరుగుతోందన్నారు. సినిమాల్లో నటించడమే తప్ప, సినిమాలు నిర్మించే ఆలోచన తనకు లేదన్నారు. దర్గా ప్రతినిధి అమీర్‌ ద్వారా దర్గా ప్రాశస్త్యాన్ని తెలుసుకున్నారు.

అమీన్‌పీర్‌ (పెద్ద) దర్గా ఫోటో గ్యాలరీ…

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: