కడప – విశాఖపట్నంల నడుమ ‘ఇంద్ర’ బస్సు

    కడప – విశాఖపట్నంల నడుమ ‘ఇంద్ర’ బస్సు

    కడప: కడప నుంచి విశాఖపట్నానికి ఇంద్ర బస్సు సర్వీసును ఆదివారం సాయంత్రం డిపో అధికారులు ప్రారంభించారు.ఈ బస్సు ప్రతి రోజు సాయంత్రం కడప డిపో నుంచి సాయంత్రం 6 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9 గంటలకు విశాఖపట్నానికి చేరుకుంటుంది. తిరిగి విశాఖపట్నంలో సాయంత్రం 5.45 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9 గంటలకు కడపకు చేరుకుంటుంది.

    కడప నుంచి బద్వేలు, కావలి, ఒంగోలు బైపాస్, గుంటూరు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, అన్నవరంల మీదుగా విశాఖపట్నానికి వెళ్తుంది.

    చదవండి :  సివిల్స్‌లో సత్తా చాటిన కడపజిల్లా యువకులు

    పెద్దలకు ఒక్కొక్కరికి కడప నుంచి విశాఖకు రూ.1053, చిన్నపిల్లలకు ఒక్కొక్కరికి రూ.792 చొప్పున బస్సు టిక్కెట్టు నిర్ణయించారు.

    ముందస్తు రిజర్వేషన్ చేసుకునే సౌకర్యం ఉందని డిపో ఇన్‌ఛార్జి మేనేజరు కన్యాకుమారి చెప్పారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

      వార్తా విభాగం

      ఇవీ చదవండి

      1 Comment

      • I traveled in first day service in Indra with my family from Rajamundry to kadapa. The bus is very old, A C water leaked in seats.It is a bitter experience to travel in kadapa RTC depo bus. I had written in complaint book also. Expect a better service from kadapa RTC depo

      Leave a Reply

      Your email address will not be published. Required fields are marked *