రాయలసీమ సిపిఐ నాయకులు పోరాడాల్సింది ఎవరి మీద?

    రాయలసీమ సిపిఐ నాయకులు పోరాడాల్సింది ఎవరి మీద?

    నాకు సిపిఐ పార్టీ అంటే ఎప్పటినుంచో అభిమానం ఉంది కానీ ఈ మద్యన ఆ అభిమానాన్ని చంపుకోవాల్సి వస్తుంది…

    రాయలసీమ సిపిఐ నాయకులు రాయలసీమకు రాజధాని ,నీళ్ళు కావాలని అంటారు

    కానీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ రాయలసీమకు చెందినవాడే –  కానీ ఆయన మాత్రం…

    రాజధాని గుంటూరు-విజయవాడ మద్య ఉండాలంటాడు ..!.

    కృష్ణా డెల్టాకునీళ్ళు కావాలంటాడు…!

    పోలవరాన్ని నిర్మించాలంటాడు…!

    కాకినాడ -వైజాగ్‌ కారిడార్‌ నిర్మించాలంటాడు!

    కానీ ఈయనకు రాయలసీమ లో కరువుకు నీళ్ళులేక అల్లాడుతున్న ప్రజల దుస్థితి పట్టదు

    చదవండి :  సదువుకుంటే వైకాపాకు ఓటేయొద్దా!

    పశువులకు మేత లేక తెలంగాణకు ,ఆంధ్రాకు పశువులను అమ్ముకొనే మా రైతుల గురించి పట్టదు

    మా రాయలసీమ గురించి మా నాయకులకు అస్సలు పట్టదనేదానికి ఇదే నిదర్శనం

    ఇప్పుడు రాయలసీమ సిపిఐ నాయకులు పోరాడాల్సింది ఆ పార్టీ నాయకత్వం మీదనా ? అధికార పార్టీ మీదనా ?

    – చేతన్, యోవేవి

    (ఫేస్బుక్ పోస్టు ఆధారంగా)

      వార్తా విభాగం

      ఇవీ చదవండి

      Leave a Reply

      Your email address will not be published. Required fields are marked *