ఈ రోజు రాచపాలెం అభినందన సభ

    ఈ రోజు రాచపాలెం అభినందన సభ

    కడప: ఆచార్య డాక్టర్ రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డుకు ఎంపికైన సందర్భంగా ఈ రోజు (బుధవారం, డిసెంబరు 23) సాయంత్రం స్థానిక సిపి బ్రౌన్ భాషా పరిశోధనా కేంద్రంలో జనవిజ్ఞానవేదిక – సాహితీస్రవంతిల ఆధ్వర్యంలో అభినందన సభ జరగనుంది. ఈ సభలో రచయిత శశిశ్రీ, యోవేవి తెలుగు విభాగపు సమన్వయకర్త ఆచార్య వినోదిని ఉపన్యసిస్తారు.

    సాయంత్రం 5 గంటల నుండి జరిగే ఈ సభకు సాహితీ అభిమానులందరూ రావాలని జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు అలవలపాటి రఘునాధరెడ్డి ఒక ప్రకటనలో తెలియచేశారు.

    చదవండి :  అమెరికా జీవనమే సుఖమయమైనది కాదు - సొదుం గోవిందరెడ్డి

      వార్తా విభాగం

      ఇవీ చదవండి

      Leave a Reply

      Your email address will not be published. Required fields are marked *