పురంధేశ్వరిపై  లక్షా 74 వేల మెజార్టీతో గెలిచిన యువకుడు

మిథున్ రెడ్డి – రాజంపేట

పురంధేశ్వరిపై లక్షా 74 వేల మెజార్టీతో గెలిచిన యువకుడు

రాజంపేట లోక్‌సభ స్థానానికి వైకాపా తరపున పోటీ చేసిన పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ఇద్దరు కేంద్ర మాజీ మంత్రులను ఢీకొని అధిక మెజారిటీతో ఎన్నికై రికార్డు సృష్టించారు. తొలిసారిగా చట్టసభకు పోటీ చేసిన మిథున్‌ పార్లమెంటు సభ్యునిగా గెలుపొందడం కూడా విశేషమే.

ఈ స్థానానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి సాయిప్రతాప్, బీజేపీ, తెలుగుదేశం పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా ఎన్టీఆర్ కుమార్తె, కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి పోటీలో దిగారు.

చదవండి :  మాకూ ఆ అవకాశం కల్పించండి

పురందేశ్వరి, సాయిప్రతాప్ ఇక్కడ మిథున్‌రెడ్డిని ఓడించేందుకు గట్టి ప్రయత్నమే చేశారు. యువకుడైన మిథున్‌రెడ్డి సుమారు 1,74,762 ఓట్ల మెజారిటీతో  విజయం సాధించారు. ఇంతటి ఘన విజయం అందించిన పార్లమెంటరీ నియోజకవర్గ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

వైకాపా అధినేత జగన్ కు స్నేహితుడైన మిథున్ లండన్ లోని షిల్లర్ విశ్వవిద్యాలయం నుండి ఎంబీఏలో పట్టభద్రత (2000 సంవత్సరంలో) సాధించారు. అంతకు పూర్వం ఆయన చెన్నైలోని క్రిసెంట్ ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ పూర్తి చేశారు.

చదవండి :  ఫిరాయించిన ముగ్గురు వైకాపా కౌన్సిలర్లపై అనర్హత వేటు

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *