పరీక్షలు జరిగిన 24 గంటల్లోపే పీజీసెట్ ఫలితాలు
యోగి వేమన విశ్వవిద్యాలయం ఘనత
కడప: పరీక్షలు జరిగిన 24 గంటల్లోపే పీజీ ప్రవేశ పరీక్ష (పీజీసెట్ 2016) ఫలితాలను ప్రకటించి యోగి వేమన విశ్వవిద్యాలయ రికార్డు సృష్టించింది. శుక్రవారం రాత్రి 7 గంటలకు ఉపకులపతి ఆచార్య బేతనభట్ల శ్యామసుందర్ ఈ ఫలితాలను విడుదల చేశారు.ఈ సందర్భంగా పీజీసెట్ కన్వీనర్ ఆచార్య రఘునాథరెడ్డి మాట్లాడుతూ ఈ నెల 1, 2 తేదీల్లో జరిగిన వైవీయూ సెట్కు 2,602 మంది అభ్యర్థులు పరీక్ష రాయగా 2,356 మంది అర్హత సాధించారన్నారు. 90.54 శాతం మంది ప్రవేశార్హత పొందారన్నారు. శనివారం నుంచి ర్యాంకు కార్డులు విద్యార్థులకు వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయన్నారు.
www.yvudoa.in, www.yogivemanauniersty.ac.in నుంచి ఫలితాలు తెలుసుకోవచ్చన్నారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫలితాలు తరవాత ప్రకటిస్తామన్నారు.
టాపర్లు
పి.వెంకటసాయిచరణ్ (తెలుగు)
పి.సి.నిమోల్ (ఆంగ్లం)
ఎస్.సమత (జర్నలిజం అండ్ కమ్యునికేషన్)
జి.సూర్యప్రకాష్(బయోకెమిస్ట్రీ),
షేక్ రుహీనా (బయోటెక్నాలజి)
సి.లలితరాణి(జెనెటిక్స్)
ఎన్.షఫీర్ (మైక్రోబయాలజి)
షేక్ ముక్తియార్ (బోటని)
బి.గౌరి (కెమిస్ట్రీ)
ఎ.రామాంజనేయులు (ఎన్విరాన్మెంటల్సైన్సు)
సి.రామకృష్ణ (కామర్సు)
జి.త్రినాథ్ (కంప్యూటరు సైన్సు)
ఎ.సవిత (ఎకనామిక్స్)
ఎన్.రాజశేఖర్ (ఎడ్యుకేషన్)
పి.రవికుమార్ (జియాలజి)
వి.సుబ్బారెడ్డి (హిస్టరీ ఆర్కియాలజి)
ఎస్.మహ్మద్ సలీం (సైకాలజి)
వై.హరికుమార్ (పొలిటికల్ సైన్సు అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్)
కె.మాధవి (ఫిజిక్సు)
ఎస్.సుజాత (మేథమాటిక్స్)
పి.వి.స్రవంతి (స్టాటిస్టిక్స్)
ఎం.మౌనికా (జువాలజి)
జె.సాయిసుచిత్ర (ఇంటిగ్రేటెడ్ బయోటెక్నాలజి అండ్ బయో ఇన్ఫర్మేటిక్స్)
సి.సునందీశ్వరరెడ్డి (ఇంటిగ్రేటెడ్ఎర్త్సైన్సు)