కడప: మహాశివరాత్రి పండుగను పురస్కరించుకుని 15, 16, 17 తేదీల్లో జిల్లాతో పాటు సమీపంలోని వివిధ ఆలయాలను దర్శించుకునే భక్తులకు సౌకర్యం కోసం 312 ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ ప్రాంతీయ అధికారి గోపినాథ్రెడ్డి తెలిపారు.
పొలతలకు 180 బస్సులు, లంకమలకు 35, నిత్యపూజకోన 40, బి.మఠం 21, అత్తిరాల 20, తలకోన 10, గుండాలకోన 10, భానుకోట 10, నారాయణస్వామి మఠం 5, మల్లెంకొండ 5, అల్లాడుపల్లె దేవళాలు 22, కన్యతీర్థం 14, ఆగస్తేశ్వరకోన 5, నామాలప్ప 1, జ్యోతి 12, తిమ్మప్పమర్రిమాను 4, శివాలయాలకు ఒక బస్సు సర్వీసు నడుపుతున్నామన్నారు.
అలాగే ఈనెల 19న జరిగే గంగమ్మ జాతరకు 99 ప్రత్యేక బస్సులు నడపుతున్నామని కూడా చెప్పారు.