Tags :RIMS

    వార్తలు

    రిమ్స్‌లో 10 పడకలతో కార్డియాలజీ విభాగం…త్వరలో

    కడప: రాజీవ్ గాంధీ వైద్య విద్యాలయం(రిమ్స్)లో త్వరలో 10 పడకలతో కార్డియాలజీ విభాగాన్ని ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర మెడికల్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డెరైక్టర్ అరుణకుమారి తెలిపారు.శుక్రవారం రిమ్స్ సంచాలకుని కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడిన ఆమె ఈ మేరకు వెల్లడించారు.అలాగే చిన్న పిల్లల వైద్యానికి సంబంధించి మరో విభాగాన్ని ఏర్పాటు చేయనున్నామన్నారు. అరుణకుమారి శుక్రవారం రిమ్స్‌లోని పలు వార్డులను పరిశీలించారు. అనంతరం ఓపీ విభాగానికి వచ్చి అక్కడ మైక్రో బయాలజీ, బయో కెమిస్ట్రీ విభాగాలలో తన […]పూర్తి వివరాలు ...

    ప్రత్యేక వార్తలు

    పాత బస్టాండు టు రిమ్స్ బస్ సర్వీసు

    కడప: నగరంలోని పాతబస్టాండ్ నుంచి రిమ్స్ ఆసుపత్రికి రోజుకు ఎనిమిది సార్లు తిరిగేలా సోమవారం నుంచి ఆర్టీసి బస్సు సర్వీసు ప్రారంభమైంది. నగర శివారులో ఉన్న రిమ్స్ ఆసుపత్రికి కొన్నాళ్లుగా బస్సు సౌకర్యంలేదు. దీంతో రోగులు, వారి సహాయకులు, ఉద్యోగులు ఆటోలను ఆశ్రయించేవారు. ఉదయం 8.45 గంటలకు పాత బస్టాండ్‌లో మొదలయ్యే ఈ బస్సు.. ఏడురోడ్లు, పాతరిమ్స్, కోటిరెడ్డి కూడలి, ఎర్రముక్కపల్లె, కలెక్టర్ బంగళా, శిల్పారామం మీదుగా రిమ్స్‌కు చేరుకుంటుంది. పాత బస్టాండు నుండి రిమ్స్ కు ప్రయాణ […]పూర్తి వివరాలు ...

    వార్తలు

    రిమ్స్ వైద్యకళాశాలకు సెలవులు

    ఈరోజు నుంచి అక్టోబర్ 20వ తేదీ వరకు రిమ్స్ వైద్య కళాశాలకు సెలవులను ప్రకటించారు. సమైక్య సమ్మె నేపధ్యంలోనే సెలవులు ప్రకటించారని విద్యార్థులు భావిస్తుండగా అది వాస్తవం కాదని కళాశాల వర్గాలు ధ్రువీకరించాయి. కేవలం దసరా పండుగను పురస్కరించుకుని మాత్రమె కళాశాలకు పది రోజుల సెలవు ప్రకటించినట్టు  కళాశాల వర్గాలు ధ్రువీకరించాయి. పది రోజుల సెలవు దొరకటంపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.పూర్తి వివరాలు ...

    వార్తలు

    ఆగష్టు 1 నుంచి రిమ్స్ లో మొదటి సంవత్సరం తరగతులు

    ఆగస్టు ఒకటో తేదీ నుంచి రాజీవ్‌గాంధి వైద్య విద్య, విజ్ఞాన సంస్థ అనుబంధ వైద్య కళాశాలలో ప్రథమ సంవత్సరం ఎంబీబీఎస్‌  తరగతులు ప్రారంభిస్తామని సంచాలకుడు డాక్టర్‌ సిద్ధప్ప గౌరవ్‌ ప్రకటించారు. కౌన్సిలింగ్ ద్వారా కడప రిమ్స్ లో సీటును పొందిన విద్యార్థులు ఈ నెల 31 లోగా కళాశాలలో చేరవలసి ఉంది. తొలిరోజు పది మంది ప్రవేశాలు పొందగా.. శుక్రవారం ఈ సంఖ్య పెరిగింది. వెయ్యి మొదలు కొని పదిహేను వందల ర్యాంకు వరకు వచ్చిన విద్యార్థినీ […]పూర్తి వివరాలు ...

    వార్తలు

    రిమ్స్‌లో ఎంసీఐ తనిఖీలు

    కడప : నగర శివార్లలోని రాజీవ్ గాంధీ వైద్య కళాశాల(రిమ్స్)ను శనివారం భారత వైద్య మండలి (ఎంసీఐ) బృందం తనిఖీ చేసింది. ఎంసీఐ ఇదివరకే రిమ్స్‌లో చివరి తనిఖీలు (మార్చి నెలలో) నిర్వహించింది. అప్పట్లో 562 జీవో అమలు, ఫార్మాకో విభాగం, లైబ్రరీ విభాగంలో పుస్తకాల కొరత, ఎక్స్‌రే ప్లాంట్‌లలో ఒకే యూనిట్, చెన్నూరు పీహెచ్‌సీలో కొన్ని కొరతలపై నివేదికను పంపించారు. ఆ నివేదికలతో పాటు ఎంసీఐ బృందం రిమ్స్ ఫైనలియర్ అనుమతికి కూడా ఎసరు పెట్టింది.పూర్తి వివరాలు ...

    వార్తలు

    24న రిమ్స్‌లో వాక్-ఇన్-ఇంటర్వ్యూలు

    కడప : రిమ్స్ వైద్య కళాశాలలో ట్యూటర్స్, జూనియర్ రెసిడెంట్ డాక్టర్లగా కాంట్రాక్టు పద్దతిన పనిచేసేందుకు ఆసక్తి కలిగిన, అర్హులైన అభ్యర్థులు ఈ నెల 24వ తేదీ (ఉదయం 10.30 గంటలకు) జరిగే వాక్-ఇన్-ఇంటర్వ్యూకు  హాజరు కావాలని కళాశాల ఇన్‌చార్జి డెరైక్టర్ డాక్టర్ ఓబులేశు ఒక ప్రకటనలో తెలిపారు. అర్హతలు: ట్యూటర్స్‌కు ఎంబీబీఎస్ డిగ్రీ, ఎంఎస్సీ మెడికల్ ఫిజియాలజీ, ఫెథాలజీ, మైక్రో బయాలజీపూర్తి వివరాలు ...