ఆకు అల్లాడ్డంల్యా గాలి బిగిచ్చింది ఉబ్బరంగా ఉంది ఊపిరాడ్డంల్యా ఉక్క పోచ్చాంది వంతు తప్పేట్లు లేదు వంక పారేట్లే ఉంది. పొద్దు వాల్తాంది మిద్దెక్కి సూచ్చనా వానొచ్చాదా రాదా? పదునైతాదా కాదా? అదును దాట్తే ఎట్లా? ఏడు పదుల కరువు పందికొక్కుల దరువు పంకియ్యని ప్రభువు ముదనష్టపు అప్పు ఉరితాళ్ళ బతుకు. అద్దద్దో…ఆపక్క మోడం ఎక్కొచ్చాంది ఆ మూల నుంచి కుమిల్లు కుమిల్లు నల్లగ కలయబారతాంది కొత్తమిట్ట కాడికొచ్చె దున్నంగి పంపుల్లో దిగబడే అబ్బీ……వచ్చరా….వానొచ్చరా…. మాంచి మోదుబ్బీ… […]పూర్తి వివరాలు ...
Tags :rayalaseema
రాయలసీమ మహాసభ ఆదివారం జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకుంది.కడప జిల్లా కమిటీ సభ్యులు వీరే… అధ్యక్షుడు – ఎన్.ఎస్.ఖలందర్ ఉపాధ్యక్షులు – నూకా రాంప్రసాద్రెడ్డి, తవ్వా ఓబుల్రెడ్డి ప్రధాన కార్యదర్శి – జింకా సుబ్రహ్మణ్యం కార్యదర్శులు – సూర్యనారాయణరెడ్డి, పోలు కొండారెడ్డి సహాయ కార్యదర్శులు – గంగనపల్లె వెంకటరమణ, పుట్టా పెద్ద ఓబులేశు కోశాధికారి – మొగలిచెండు సురేశ్ కార్యవర్గ సభ్యులు – సాయిప్రసాద్, చంద్రశేఖర్రెడ్డి, జి.పార్వతీ టి.వెంకటయ్య, నాగరాజు కల్చరల్ కమిటీ కన్వీనర్ – ధర్మిశెట్టి […]పూర్తి వివరాలు ...
కడప: దుమ్ముగూడెం-నాగార్జునసాగర్ టెయిల్పాండ్ ప్రాజెక్టును కేంద్రం తక్షణమే జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని రాయలసీమ మహాసభ తీర్మానించింది. స్థానిక సీపీ బ్రౌన్ భాషా పరిశోధనా కేంద్రంలో ఆదివారం జరిగిన సమావేశంలో సీమ జిల్లాలకు చెందిన రచయితలు, కళాకారులు, వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాయలసీమ సమగ్రాభివృద్ధి సాధనే ధ్యేయంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని రాయలసీమ మహాసభ కేంద్రకమిటీ అధ్యక్షులు డా.శాంతినారాయణ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పలు తీర్మానాలను ఆమోదించారు. పోలవరం వల్ల ప్రయోజనం స్వల్పమేనన్నారు. […]పూర్తి వివరాలు ...
మైదుకూరు: రాయలసీమ మహాసభ అధ్వర్యంలో ఆదివారం (మార్చి 22వ తేదీ) కడపలోని సి.పి.బ్రౌన్ గ్రంథాలయంలో రాయలసీమ రచయితల, కవుల, కళాకారుల, ప్రజాసంఘాల, విద్యార్ధి, మహిళా, రైతుసంఘాల ప్రతినిధుల సమావేశం జరుగనుంది . ఉదయం 10 గంటలకు రాయలసీమ గురించి చర్చ జరుగుతుంది. మధ్యాహ్నం రాయలసీమ మహాసభ కడప జిల్లా కార్యవర్గ ఎంపిక జరుగుతుంది. సంబందిత ప్రతినిధులందరికీ , రాయలసీమ అస్తిత్వం గురించి తపన పడే మిత్రులకు సమావేశం ఆహ్వానం పలుకుతోంది.పూర్తి వివరాలు ...
కడప: చివరి దశలో ఉన్న రాయలసీమ సాగునీటి పథకాలు పూర్తి చేసేందుకు అవసరమైన నిధులు కేటాయించి ఆయా పథకాలను త్వరగా పూర్తి చేయాలని శాసనమండలిలో ప్రతిపక్ష నేత రామచంద్రయ్య ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఇచ్చిన వినతిపత్రంలో పేర్కొన్నారు. శుక్రవారం ఇందుకు సంబంధించిన వినతిపత్రాన్ని రామచంద్రయ్య చంద్రబాబుకు పంపినారు. రాయలసీమ ఉద్యమం నేపధ్యంలో నాటి తెదేపా ప్రభుత్వం గాలేరు-నగరి, హంద్రీ-నీవా, సుజలస్రవంతి పథకాలు ఏర్పాటు ప్రకటించినా తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కమిటీలు,సర్వేల పేరుతో కాలం గడిపారుతప్ప రాయలసీమ సాగునీటి పై […]పూర్తి వివరాలు ...
బడ్జెట్లో అరకొర కేటాయింపులు జలయజ్ఞానికి సంబంధించి ఇప్పటికే సాగునీరు పుష్కలంగా అందుతున్న కృష్ణా డెల్టా మీద అలవికాని ప్రేమ ప్రదర్శించిన ప్రభుత్వం ఆరుతడి పంటలకూ నోచుకోక కరువు బారిన పడ్డ సీమపైన వివక్షను కొనసాగించింది. నిరుడు రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకు కేటాయింపులు జరపడంలో వివక్ష చూపిన ఆం.ప్ర ప్రభుత్వం ఈ ఏడాది కూడా ఆ విధానాన్ని కొనసాగించి తన ప్రాధమ్యాన్ని చెప్పకనే చెప్పింది. రాయలసీమలోని భారీ సాగునీటి పథకాలు అన్నిటికీ కలిపి ఎప్పుడో పూర్తయి నిర్వహణలో ఉన్న […]పూర్తి వివరాలు ...
తెలుగువారందరి ప్రత్యేక రాష్ట్రం విశాలాంధ్ర ఏర్పాటుకు అంగీకరించి రాయలసీమ వాసులు అన్ని విధాలా నష్టపో యారు. సర్కారు జిల్లాలతో ఐక్యత పట్ల నాటి సీమ నేతలలో పలువురికి ఆంధ్ర మహాసభ కాలం నుండి అనుమానాలు ఉండేవి. ఆంధ్ర విశ్వవిద్యా లయ కేంద్రాన్ని అనంతపురం లో ఏర్పాటు చేయాలంటూ యూనివర్సిటీ సెనేట్ కమిటీ 1926లో చేసిన తీర్మానాన్ని సైతం లెక్కచేయక దాన్ని విజయవాడ నుండి విశాఖపట్టణానికి తరలించారు. ఇలాంటి వైఖరి కారణంగానే తమిళుల ఆధిపత్యం వదు ల్చుకొని సర్కారు […]పూర్తి వివరాలు ...
రాయలసీమ అభివృద్ధిపై వివక్ష రాష్ర్టానికి, జిల్లాకు ఒరిగిందేమీ లేదు టీడీపీకి ఎక్కువ స్థానాలు రాలేదన్న అక్కసుతోనే ఆర్భాటాలు తప్ప ప్రజా సంక్షేమం పట్టడం లేదు ఎర్రచం’ధనం’ సీమ కోసం ఖర్చు చేయాల కడప: రాయలసీమ ప్రాంత అభివృద్ధి గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివక్ష చూపుతున్నారని శాసనమండలిలో విపక్షనేత సి.రామచంద్రయ్య ఆరోపించారు. ఈ రోజు (శుక్రవారం) స్థానిక కాంగ్రెస్ పార్టీ (జిల్లా) కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… జిల్లాలో స్టీలు ప్లాంటు ఏర్పాటు […]పూర్తి వివరాలు ...
ఐజీకార్ల్: కడప జిల్లాలో ఇందిరా గాంధీ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ఇన్ లైవ్స్టాక్ (IGCARL) అనే పేరుతో ఒక (supposedly) ప్రపంచస్థాయి పరిశోధనా సంస్థ ఏర్పాటై ఉంది. ప్రపంచం నలుమూలల నుంచి శాస్త్రవేత్తలు, పరిశోధకులు, వివిధ దేశాల, సంస్థల ప్రతినిధుల రాకపోకలు నిరాటంకంగా, సౌకర్యవంతంగా సాగడానికి వీలుగా కడప విమానాశ్రయం నుంచి ఈ సంస్థ దాకా నాలుగు వరుసల రహదారితో సహా IGCARLలో భవంతులు, ఇతర మౌలిక సౌకర్యాలైతే సిద్ధమయ్యాయిగానీ వాటిని సద్వినియోగం చేసుకుని, ఆ […]పూర్తి వివరాలు ...