Tags :obulreddy

    కవితలు

    గుండ్రాళ్ళసీమకు దారి తప్పి వచ్చావా? (కవిత)

    ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయావా? గణనాయకా ఈ అభాగ్యుల క్షమించు..! ఉండ్రాళ్ళు తినే ఓ బొజ్జ గణపయ్యా..! గుండ్రాళ్ళసీమకు దారి తప్పి వచ్చావా? మా గుండె చప్పుళ్ళన్నీ ఆర్తనాదాలై అధికారాన్ని అంధత్వం ఆవరించినవేళ కన్నీళ్ళే ఇంకిపోయిన ఈ సీమలో నిమజ్జనానికి మాత్రం నీళ్ళీక్కడివి? ఆప్యాయతలకూ అనురాగాలకూ కొదువలేని ఈ రాయలసీమలో ఎండిన చెరువులూ, బావులూ గుండెలు బాదుకునే జీవులూ ఎడారిలో ఎండమావులై తడారిపోయిన గొంతులతో ఆకాశం దిక్కు ఆశగా చూస్తూ ఆశ సచ్చి అంతమై పోతున్నారెందరో! గుక్కెడు నీళ్ళకు […]పూర్తి వివరాలు ...

    వార్తలు

    సీమ కోసం గొంతెత్తిన సాహితీకారులు

    రాయలసీమ స్థితిగతులపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని రాయలసీమకు చెందిన కవులు, రచయితలు డిమాండ్ చేశారు. తుఫానులు, భూకంపాల ప్రాంతంగా జిఎస్‌ఐ నివేదిక పేర్కొన్న విజయవాడ ప్రాంతంలో రాజధాని ఏర్పాటు అశాస్త్రీయమని వారు గుర్తు చేశారు. కడప సిపిబ్రౌన్ గ్రంధాలయ పరిశోధన కేంద్రంలో కుందూ సాహితీ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన రాయలసీమ కవులు, రచయితలతో సమాలోచన జరిగింది. ఆచార్య రాచపాలెం చంద్రశేఖరరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ముఖ్యఅతిధిగా పాల్గొన్న కేంద్రసాహితీ అకాడమి అవార్డు […]పూర్తి వివరాలు ...