ఊరి పిల్లోడు పెన్నేటి కతలు ఆ పిల్లోని అస్సలు పేరు వాళ్లమ్మా, నాయినకూ తప్ప మల్లెవరికీ తెల్దు గానీ ఊళ్లో అందరికీ టంగుటూరోళ్ల పిల్లోడంటే తెల్సు. ఏడుస్తా వుండేవాళ్లకైనా ఆ పిల్లోని పడవ* సెప్తే, ఏడుపు ఇచ్చిపోయి మొకాన నగుపొద్దు పొడవాల్సిందే. అట్టాటోడు ఆ పిల్లోడు! పిల్లోడంటే పిల్లోడే. పదీ పదకొండేండ్లుంటాయేమో, బక్కగా నల్లగా వుండి మినమిన మెర్సే సూపుల్తో దేనిమీదా సిటికేసినంత సేపు సూపు నిలపకుండా బూలోకమంతా ఒక్కసారే సూస్తా వున్నెట్టు వుంటాడు. ఇంట్లో యెప్పుడుంటాడో […]పూర్తి వివరాలు ...
Tags :రామకృష్ణారెడ్డి పోసా
ఆధునిక సాహిత్యకారులకు చిరపరిచితమైన పేరు రామకృష్ణారెడ్డి పోసా. నిశితంగా రచన చేయడంలో నేర్పరి. వీరి మొదటి కథ ‘వెనుకబడిన ప్రయాణికుడు’ 1965 జులైలో జ్యోతి మాసపత్రికలో ప్రచురితమైంది. కడప మాండలికంలో వీరు రాసిన ‘పెన్నేటి కథలు’ ఆంధ్రజ్యోతి వారపత్రికలో వరుసగా ప్రచురితమయ్యాయి. విద్వాన్ విశ్వం ‘పెన్నేటి పాట’ గేయకావ్యం తర్వాత అంతే పదునుగా, స్పష్టంగా రాయలసీమ జనజీవన చిత్రాన్ని రూపుకట్టి చూపించిన కథలు రామకృష్ణారెడ్డి గారి ‘పెన్నేటి కతలు’. పెన్నేటి ఒడ్డున ఒక గ్రామంలోని జీవన శకలాలను ఒక్కో […]పూర్తి వివరాలు ...