Tags :శశిశ్రీ

ప్రసిద్ధులు

అమెరికా జీవనమే సుఖమయమైనది కాదు – సొదుం గోవిందరెడ్డి

సాహితీకారుడు సొదుంగోవిందరెడ్డితో తవ్వా ఓబుల్ రెడ్డి జరిపిన ఇంటర్వ్యూ కడప జిల్లా ఉరుటూరు . చోళుల కాలంనాటి శాసనాలు, ఆలయాలు కలిగిన ఊరే కాదు. సాహితీ దిగ్గజాలైన సొదుం సోదరులు జన్మించిన గ్రామం. వారి పేర్లు సాహితీలోకానికి చిరపరిచితం . వారే సొదుం గోవింద రెడ్డి , సొదుం జయరాం, సొదుం రామ మోహన్ లు. అభ్యుదయ సాహితీ చరిత్రలో తమదైన చెరగని ముద్ర వేశారు ఈసోదరత్రయం . వీరిలో జయరాం, రామమోహన్ బయటి ప్రపంచంలో తిరిగినవారు. […]పూర్తి వివరాలు ...

వ్యాసాలు

కడప జిల్లాలో కథాసాహిత్యం – డా|| కేతు విశ్వనాధరెడ్డి

కడప జిల్లా కథాసాహిత్యం నవల, కథానిక, నాటకం, నాటిక వంటి ఆధునిక రచన సాహిత్య ప్రక్రియల ఆవిర్భావం కడప జిల్లాలో కళింగాంధ్ర, కోస్తాంధ్ర ప్రాంతాలతో పోలిస్తే చాలా ఆలస్యంగా జరిగింది. కందుకూరి వీరేశలింగం పంతులు తొలి సాంఘిక నవల రాజశేఖర చరిత్ర (1878) వచ్చి, ఎనబై ఏళ్లు గడిచాకే, కడప జిల్లా సాహిత్యకారులు నవలా రచన ప్రయత్నాలు చేశారు. గురజాడ తొలి కథానిక దిద్దుబాటు (1910) తర్వాత ఏ యాభై ఏళ్లకో కడప జిల్లా సాహిత్య చరిత్రలో […]పూర్తి వివరాలు ...

వ్యాసాలు

‘శశిశ్రీ’కి పాలగిరి విశ్వప్రసాద్ నివాళి వ్యాసం

శశిశ్రీ 1995లో కడపలో ‘సాహిత్య నేత్రం’ పత్రికను మొదలుపెట్టాడు. అది మొదలెట్టే సమయానికి ఆయన జేబులో రూపాయి లేదు. పనిలోకి దిగితే అవే వస్తాయని మొదలెట్టాడు. ఇందుకు ఆయనకు సహకరించింది ఆయన మిత్రుడు డి.రామచంద్రరాజు, తన కన్నా వయసులో చిన్నవాడైన మరో మిత్రుడు నూకా రాంప్రసాద్‌రెడ్డి. పత్రిక తొలి సంచిక, మలి సంచిక రాగానే ఆంధ్రప్రదేశ్ సాహిత్యకారుల దృష్టంతా సాహిత్యనేత్రం వైపు తిరిగింది. అప్పటికే ‘రచన’, ‘ఆహ్వానం’ మార్కెట్లో ఉన్నాయి. వాటికి ఏమాత్రం తీసిపోకుండా అంతకు మించి […]పూర్తి వివరాలు ...

అభిప్రాయం వ్యాసాలు

భారద్వాజస గోత్రీకుడు షేక్ బేపారి రహంతుల్లా!

1997 ప్రాంతంలో ఒకసారి వేంపల్లెకు పోయినప్పుడు అక్కడి గ్రంథాలయంలో ‘సాహిత్యనేత్రం’ అని ఒక కొత్త పత్రిక కంటబడింది. మంచి కథలు, శీర్షికలు, కవితలు ఉన్న ఆ పత్రిక కడప నుంచి వెలువడుతోందని తెలిసి చాలా సంబరపడ్డాను. ఆ తర్వాత కడపకు పోయినప్పుడు నగర నడిబొడ్డైన ఏడురోడ్ల కూడలికి అతిసమీపంలో ఉన్న ఆ పత్రిక కార్యాలయానికి వెళ్ళి సంపాదకుడిని కలుసుకుని పాత సంచికలన్నీ తెచ్చుకున్నాను. ఆ సంపాదకుడు శశిశ్రీ. s తర్వాత అప్పుడప్పుడూ నేత్రం ఆఫీసుకు వెళ్తూ ఉండేవాడిని. […]పూర్తి వివరాలు ...

వార్తలు

శశిశ్రీ ఇక లేరు

కడప:  సంవత్సర కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ కవి, రచయిత, సీనియర్ పాత్రికేయుడు షేక్ బేపారి రహమతుల్లా అలియాస్ శశిశ్రీ బుధవారం అర్ధరాత్రి కడప నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కన్నుమూశారు. స్థానిక  ద్వారకానగర్‌లోని ఆయన ఇంటికి చేరుకుని అభిమానులు, సాహితీవేత్తలు, పాత్రికేయులు బుధవారం సాయంత్రం కన్నీటి వీడ్కోలు పలికారు. భౌతికకాయం వద్ద నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. వివిధ రాజకీయ పార్టీల ప్రముఖులు, పాత్రికేయులు, సీమ జిల్లాలకు చెందిన సాహితీవేత్తలు కూడా ఆయన […]పూర్తి వివరాలు ...

వార్తలు

ఈ రోజు రాచపాలెం అభినందన సభ

కడప: ఆచార్య డాక్టర్ రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డుకు ఎంపికైన సందర్భంగా ఈ రోజు (బుధవారం, డిసెంబరు 23) సాయంత్రం స్థానిక సిపి బ్రౌన్ భాషా పరిశోధనా కేంద్రంలో జనవిజ్ఞానవేదిక – సాహితీస్రవంతిల ఆధ్వర్యంలో అభినందన సభ జరగనుంది. ఈ సభలో రచయిత శశిశ్రీ, యోవేవి తెలుగు విభాగపు సమన్వయకర్త ఆచార్య వినోదిని ఉపన్యసిస్తారు. సాయంత్రం 5 గంటల నుండి జరిగే ఈ సభకు సాహితీ అభిమానులందరూ రావాలని జన విజ్ఞాన వేదిక […]పూర్తి వివరాలు ...

వార్తలు

తవ్వా ఓబుల్‌రెడ్డిని సత్కరించిన జాతీయ పాత్రికేయ సంఘం

బుధవారం కడపలో జరిగిన 22వ రాష్ట్ర మహాసభలో కథకుడు, కడప.ఇన్ఫో గౌరవ సంపాదకులు తవ్వా ఓబుల్‌రెడ్డిని జర్నలిస్ట్స్ అషోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ( జాప్ ) ఘనంగా సత్కరించింది. సీనీయర్ పాత్రికేయులైన ఓబుల్ రెడ్డి గతంలో జాప్‌కు కడప జిల్లా ఉపాధ్యక్షునిగా పనిచేసినారు. జాతీయ పాత్రికేయ సంఘం ( ఎన్.యు.జె ) అధ్యక్షుడు ఉప్పల లక్ష్మణ్ , జాప్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజా రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగా రెడ్డి, జిల్లా పరిషత్ అధ్యక్షుడు గూడూరు రవి, […]పూర్తి వివరాలు ...

ప్రసిద్ధులు వ్యాసాలు

రాయలసీమ సాంస్కృతిక రాయబారి

కన్నడం మాతృభాష అయినా తెలుగు భాష కోసం 70 వసంతాల జీవితకాల అంకిత సేవలందించిన మహానుభావుడు, భాషోద్ధారకుడు, బహుభాషావేత్త, వ్యవస్థీకృత వ్యక్తిత్వ సంపన్నుడు డాక్టర్ జానమద్ది హనుమఛ్ఛాస్త్రి. అనంతపురం జిల్లా, రాయదుర్గంలో 1926 సెప్టెంబర్ 5న జన్మించారు. జానకమ్మ, సుబ్రమణ్యశాస్త్రి తల్లిదండ్రులు. ఆంగ్లంలోను, తెలుగులోను రెండు పీజీలు చేశారు. తొలుత విద్యాశాఖలో అధ్యాపకునిగా, స్కూళ్ళ ఇన్‌స్పెక్టర్‌గా, జిల్లా విద్యావిషయక సర్వే ఆఫీసర్‌గా, ఆ తర్వాత ఇంగ్లీషు ఆచార్యులుగా 1984 వరకు ప్రభుత్వ సేవలందించారు. గాడిచర్ల స్ఫూర్తే జానమద్ది […]పూర్తి వివరాలు ...

కథలు సాహిత్యం

రాతిలో తేమ (కథ) – శశిశ్రీ

మా జిల్లాల్లో మునిరత్నం పేరు చెప్తే చాలు ఉలిక్కిపడి అటూ ఇటూ చూస్తారు. ముని అంటే ముని లక్షణాలు కానీ, రత్నం అంటే రత్నం గుణం కానీ లేని మనిషి. పేరు బలంతోనైనా మంచోడు అవుతాడనుకొని ఉంటారు పేరు పెట్టిన అమ్మానాన్నలు. కానీ అదేం జరగలేదు. ఒక్కమాటలో చెప్పాలంటే రాక్షసుడు అని చెప్పవచ్చు. అసలు చూడ్డానికి కూడా ఆఫ్రికా అడవి దున్నపోతులా ఉంటాడు. ఆరు అడుగుల ఎత్తు. తెల్ల ఖద్దరు డ్రస్సు. కనుబొమలు, చేతులపై సుడులు తిరిగినపూర్తి వివరాలు ...