కడప: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పట్టిసీమ పేరుతో రాయలసీమను దగాచేస్తున్నారని తక్షణం పట్టిసీమకు స్వస్తి చెప్పాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. ఇదే విషయమై ఈ నెల 20వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేయాలని సమావేశంలో తీర్మానించారు. బుధవారం నగరంలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం జిల్లా అధ్యక్షుడు రామసుబ్బారెడ్డి అధ్యక్షతన ‘పట్టిసీమను పక్కనబెట్టి- రాయలసీమ ప్రాజెక్టులకు నిధులు పెంచి పూర్తిచేయాలి’ అనే అంశంపై అఖిలపక్ష రైతు సంఘాల రౌండ్టేబుల్ సమావేశం జరిగింది. […]పూర్తి వివరాలు ...