ఆంద్రుల స్మృతి పథంలో చెరగని ముద్ర వేసిన ముగ్గురు ఈస్టిండియా కంపెనీ అధికారులలో థామస్ మన్రో ఒకరు. ఈయన 1761 మే 27వ తేదీన ఇంగ్లండ్లోని గ్లాస్కోలో జన్మించారు. ఇతని తండ్రి అలెగ్జాండర్ మన్రో ఒక వర్తకుడు. థామస్ మన్రో గ్లాస్కో విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్య అభ్యసించాడు. ఈస్టిండియా కంపెనీలో మిలిటరీ ఉద్యోగం కొరకు తన పంతొమ్మిదో ఏట అనగా 1780 జనవరిలో 15న మద్రాసుకు వచ్చాడు. అదే సమయంలో హైదరాలీ, టిప్పుసుల్తాన్లతో జరిగిన రెండు, మూడు […]పూర్తి వివరాలు ...
Tags :నాగభూషణశర్మ
ఆంధ్ర రాష్ట్రంలో అతి ప్రాచీన చరిత్ర కలిగిన జిల్లాలలో కడప ఒకటి. సీడెడ్ జిల్లాలుగా పిలువబడే రాయలసీమ ప్రాంతం విజయనగర సామ్రాజ్యంలో అంతర్భాగంగా ఉండేది. రాక్షస తంగడి యుద్ధం తరువాత గోల్కొండ నవాబుల ఆధీనంలోకి పోయింది. తరువాత హైదరాలీ, టిప్పుసుల్తాన్ ఆధీనంలోకి వచ్చింది. 1792లో టిప్పు ఓడిపోయి శ్రీరంగపట్టణము సంధి వలన ఈ రాయలసీమ నైజాంకు వెళ్లింది. హైదరాబాదు నవాబుతో ఈస్టిండియా కంపెనీ వారు సైన్య సహకార పద్ధతి ద్వారా అక్టోబర్ 20, 1800 సంవత్సరములో సీడెడ్ […]పూర్తి వివరాలు ...