రాయలసీమ ప్రజలకు తీరని అన్యాయం చేస్తున్న బాబు కరెంటు కోసం సీమ ప్రాజెక్టులను గాలికొదిలేస్తారా? హైకోర్టును వేరే చోట ఏర్పాటు చెయ్యాలి 13 జిల్లాలను ఒకే విధంగా అభివృద్ధి చేయాల కడప: రాయలసీమకు జరుగుతున్న అన్యాయలపైన, రాయలసీమ విషయంలో, అభివృద్ది వికేంద్రీకరణ విషయంలో ప్రభుత్వ వివక్షను ప్రశ్నిస్తూ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మొదటిసారి బహిరంగంగా గొంతెత్తారు. మంగళవారంనాడు పులివెందుల నియోజకవర్గ పరిధిలోని సింహాద్రిపురం మండలంలో పైడిపాలెం ప్రాజెక్టును ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రాజధాని చుట్టూ […]పూర్తి వివరాలు ...
Tags :జగన్
జలాశయాలను పరిశీలించిన జగన్ 16 టిఎంసిల నీళ్ళు ఇవ్వాల్సి ఉంటే 2.55 టిఎంసీలే ఇచ్చారు పులివెందుల: విపక్ష నేత, పులివెందుల శాసనసభ్యుడు వైఎస్ జగన్ శుక్రవారం మాయిటాల పులివెందులకు నీరందించే పెంచికల బసిరెడ్డి జలాశయం, పైడిపాలెం జలాశయాలను సందర్శించారు. అలాగే పార్నపల్లె తాగునీటి పథకాన్ని, అలాగే వెలిదండ్లలోని నీటికుంటను కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన నీటి కేటాయింపుల విషయంలో ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టారు. జగన్ ఈ సందర్భంగా పాత్రికేయులతో మాట్లాడుతూ… ‘‘పెంచికల బసిరెడ్డి జాలశయం (చిత్రావతి […]పూర్తి వివరాలు ...
వైకాపా శాసనసభ పక్ష నేతగా వైఎస్ జగన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇడుపులపాయలో ఈ రోజు (బుధవారం) జరిగిన వైకాపా శాసనసభాపక్ష సమావేశంలో పార్టీ నేతలు వైఎస్ జగన్ను వైఎస్ఆర్ సీఎల్పీ నేతగా ఎన్నుకున్నారు. ఈ సమావేశానికి సీమాంధ్ర, తెలంగాణ నుంచి ఎన్నికైన శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, ఇతర సీనియర్ నేతలు హాజరు అయ్యారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ…ఆనాడు విలువల కోసం తాను, అమ్మ విజయమ్మ మాత్రమే కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చామన్నారు. కొండను ఢీకొని […]పూర్తి వివరాలు ...
పులివెందుల నియోజకవర్గం నుండి వైకాపా తరపున అభ్యర్థిగా పోటీ చేసిన ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ సుమారు 75 వేల పైచిలుకు మెజారిటీ సాధించారు. ఇక్కడ తెదేపా నుండి ఎస్వీ సతీష్ రెడ్డి బరిలో ఉన్నారు. మూడు దశాబ్దాలకుపైగా పులివెందుల నియోజకవర్గం నుంచి వైఎస్ కుటుంబీకులే తిరుగులేని మెజార్టీతో విజయం సాధిస్తున్నారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తొలిసారిగా 1978లో పులివెందుల నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ తర్వాత వైఎస్ కుటుంబానికి ఇక్కడ తిరుగేలేదు. […]పూర్తి వివరాలు ...
ఈనాడు అక్కసు ఈనాడు – యావత్తు తెలుగు ప్రజానీకం అత్యధికంగా చదివే తెలుగు దినపత్రిక. పత్రిక యాజమాన్యం మాటల్లో చెప్పాలంటే “తెలుగు ప్రజల అభ్యున్నతే ధ్యేయంగా అహరహం తపించే పత్రిక ఇది”. ఇంత పేరు గొప్ప పత్రిక ఒక ప్రాంతాన్ని కించపర్చే విధంగా వ్యాఖ్యానాలు రాయడం గర్హనీయం. ఇవాళ సంపాదకీయం పేర కడప జిల్లా పైన చల్లిన బురద చూడండి. బహుశా కడప జిల్లా ఓటర్లు మరోసారి ఆ పత్రిక సమర్ధిస్తున్న పార్టీలను పక్కన పెట్టారని కాబోలు… […]పూర్తి వివరాలు ...
ఎన్నికల పోరు సమీపిస్తున్న సందర్భంలో రాజకీయాలపై, పరిణామాలపై ఆసక్తి కాస్త అధికంగానే ఉంటుంది. టీ టైములో లేదా భోజన సమయంలో కలిసినప్పుడు సహోద్యోగుల మధ్య రాజకీయ చర్చలు నడవటం సర్వసాధారణం. ఈ చర్చలలో ఒక్కొక్కరివి ఒక్కో అంచనాలు. ఒక్కొక్కరివి ఒక్కో రకమైన అభిప్రాయాలు. ఈ మధ్య కాలంలో ఒక వింతైన, గమ్మత్తైన వాదన ఒకటి మేధావులుగా చలామణీ అవుతున్న ఒక వర్గం నోట తరచూ వినిపిస్తోంది – అదేమంటే ‘సదువుకున్న వాళ్ళెవరైనా వైకాపాకు ఓటేస్తారా?’ అని. ఇంకొంచెం గట్టిగా […]పూర్తి వివరాలు ...
వైకాపా ప్లీనరీలో జగన్ చేసిన ప్రసంగంలో ఒక భాగం …. “ఓట్లకోసం,సీట్ల కోసం ఏ గడ్డి అయినా తినే కార్యక్రమాన్ని చూశాం..ఓట్ల కోసంసీట్ల కోసం కేసులు పెట్టడం చూశాం..ఓట్లకోసం,సీట్ల కోసం అడ్డగోలుగా రాష్ట్రాన్ని విడదీయడానికి జరుగుతున్న ప్రయత్నాలు చూస్తున్నాం..రెండు న్నర సంవత్సరాలలో పదహారు నెలలపాటు జైలులో పెట్టారు.అన్యాయమైన రాజకీయాలు ఇంత అన్యాయంగా ఉంటాయని అనుకోలేదు.ఓట్ల కోసం,సీట్ల కోసం చంద్రబాబు,కాంగ్రెస్ కలిసికట్టుగా ఒకటే కేసు పెట్టిన రోజు చూశాం. మూడు నెలల్లో బెయిల్ ఇచ్చి పంపాలి. అయినా దర్యాప్తు […]పూర్తి వివరాలు ...
రాష్ట్రంలో ఒక విచిత్రమైన రాజకీయ పరిస్థితి నెలకొంది.ఆమాటకు వస్తే అన్ని విషయాలలోను పరస్పర వైరుధ్యాలతో మన సమాజం కొట్టుమిట్టాడుతోంది. అవినీతికి వ్యతిరేకంగా పోరాటాన్ని నెత్తికెత్తుకుని లబ్ది పొందాలని చూస్తున్న కొందరు రాజకీయ నాయకులు తామే హజారే తర్వాత హజారేలమంటూ బాగానే హడావుడి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. పనిలో పనిగా అవినీతి నిర్మూలనకు కరెన్సీ నోట్లు రద్దు చేయాలంటూ పాటలు మొదలు పెట్టారు.పాపం ఈ ఆలోచన రిజర్వ్ బ్యాంకు వారికి కానీ ఆర్ధిక వేత్త అయిన మన ప్రధానుల వారికి కానీ […]పూర్తి వివరాలు ...
తెదేపా అధ్యక్షుడు చంద్రబాబుకు సీబీఐని ప్రశ్నించే దమ్ము, ధైర్యం లేదని రాజంపేట శాసన సభ్యుడు ఆకేపాటి అమరనాథరెడ్డి విమర్శించారు. రాజంపేటలో మాట్లాడుతూ జగన్మోహన్రెడ్డికి బెయిల్ రాకుండా కాంగ్రెస్, టీడీపీ మోకాలొడ్డుతున్నాయన్న ఆయన సీబీఐ కాంగ్రెస్ పార్టీ జేబు సంస్థ అని, ఇప్పటికే ప్రజల్లో దానిపై చులకన భావం ఏర్పడిందన్నారు. చివరకు సీబీఐ పనితీరును అత్యున్నత న్యాయస్థానం కూడా ప్రశ్నించడం తెలిసిందేనన్నారు. బెయిల్ రాకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా సీబీఐ పనిచేస్తున్నదన్నారు. సీబీఐ సర్కారు పంజరంలో చిలుక అని ఆయన […]పూర్తి వివరాలు ...