ముఖ్యమంత్రిగారూ! ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపన ఉత్సవానికి రమ్మంటూ నాకు ఆహ్వాన పత్రిక పంపారు. రాయలసీమ ప్రజల మనోభావాలను పట్టించుకోకుండా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ‘నేను రాలేను’ అని చెప్పడానికి చింతిస్తున్నాను. సీమ ప్రజలకు ప్రతినిధిగా ఉన్న నాకు ఇంతకంటే వేరే మార్గం కనిపించడం లేదు. రాష్ట్ర విభజన సమయంలో మీరు చేసిన ప్రకటనలు, ముఖ్యమంత్రి పదవి చేపట్టాక మీరు వ్యవహరిస్తున్న తీరు పొంతన లేకుండా ఉన్నాయి. అభివృద్ధిలో తీవ్రమైన అసమానతల వల్లే తొలి భాషా ప్రయుక్త […]పూర్తి వివరాలు ...
Tags :గేయానంద్
ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రజాఉద్యమం సీమ ప్రజలంతా పోరుబాటకు సిద్ధం కావాల ప్రొద్దుటూరు: కడప జిల్లా అభివృద్ధిపై ప్రభుత్వం అలవికాని నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూ, తీవ్ర వివక్ష చూపుతోందని శాసనమండలి సభ్యుడు డాక్టరుఎం.గేయానంద్ పేర్కొన్నారు. శుక్రవారం ప్రొద్దుటూరులో ఒక ఆసుపత్రిలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ… రాయలసీమకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చినహామీలు ఇంతవరకు అమలు కాలేదన్నారు. నదీజలాల పంపకంలో రాయలసీమకు అన్యాయం జరిగిందన్నారు. రాయలసీమ అభివృద్ది విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రజాఉద్యమం చేస్తామని హెచ్చరించారు.వెనకబడిన రాయలసీమ అభివృద్ధి కోసం ప్రజలంతా పోరుబాటకు సిద్ధం […]పూర్తి వివరాలు ...
శ్వేతపత్రాల తయారీలో తలమునకలుగా ఉన్న తెదేపా ప్రభుత్వం రాయలసీమ కోసం ఏమి చేయాలనుకుంటున్నదో ఒక శ్వేతపత్రం ప్రకటించాలని శాసనమండలి సభ్యుడు డాక్టర్ గేయానంద్ డిమాండ్ చేశారు. సీమలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవనం కోసం కనీసం వచ్చే అయిదేళ్లలో రూ.30వేల కోట్లు ఖర్చుపెట్టాల్సిన అవసరం ఉందని డాక్టర్ గేయానంద్ ఉద్ఘాటించారు. బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ కంటే మెరుగైన ప్యాకేజీ ఈ ప్రాంతానికి అవసరమన్నారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేస్తామని కేంద్రం ప్రకటించిందన్నారు. ఈ నేపథ్యంలో సీమలోని […]పూర్తి వివరాలు ...