చక్రవేణు కథ ‘కసాయి కరువు’ రాళ్లసీమ పల్లె మీద ఎర్రటి ఎండ నిప్పులు కురిసినట్లు కురుస్తోంది. ఎందుకో నూరీడు వగపట్టినట్లు ఊరి మీద అగ్గి వాన చల్లుతున్నాడు. తూరువు కొండ మీద చెట్లు మలమల మాడి ఎండిపోయాయి. గుట్టల మీద తెల్లకనిక రాళ్ళు కొలిమిలో మండినట్లు ఎర్రగా మెరున్తున్నాయి. యుద్ధకాలంలో శత్రువుల దాడికి భయవడి ఊరొదిలి వలనపోయిన విధంగా వల్లె పల్లె అంతా. బోసిగా ఉంది. పల్లెలో ఇళ్ళ యజమనులెవ్వరూ లేరు. పసిబిడ్డలూ, వాళ్ళ తల్లులూ, మునలోళ్ళూ […]పూర్తి వివరాలు ...
Tags :గస
‘యెంకటేస్వర సామీ, కాపాడు తండ్రీ’ కోర్టుహాల్లోకి వెళ్తూ తిరుపతి కొండ వున్న దిక్కుకు తిరిగి దండం పెట్టుకున్నాడు గొల్ల నారాయణ. దావా గెలిస్తే కొండకొస్తానని మొక్కుకున్నాడతను. ఆరోజే తీర్పు. కొద్దిసేపటి క్రితమే అతని వకీలు అతనికి ధైర్యం చెప్పాడు. ”మరేం ఫరవాలేదు. దావా గెల్చేది మనమే. నువ్వు నిమ్మళంగా వుండు” అన్నాడు. గొల్లనారాయణ అలాగేనని బుర్రూపాడు. అయితే అంతటితో అతనికి ధైర్యం చిక్కలేదు. ”అన్నింటికీ నువ్వే వుండావు సామీ” తిరుపతి వెంకన్నను తల్చుకుని అప్పుడే మనసులో దండం […]పూర్తి వివరాలు ...